Mega 157
-
అనిల్ రావిపూడి స్పీడ్కు చిరంజీవి బ్రేకులు.. కారణం ఇదేనా?
సినిమాను ప్రేక్షకుల వద్దకు చేర్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సినిమా ప్రకటన నుంచే అదిరిపోయే ప్రమోషన్స్లతో ప్రేక్షకుల అభిరుచిని పట్టేస్తాడు. ఈ క్రమంలో నటీనటులతో ఆయన కూడా ప్రమోషన్స్లో పాల్గొని, నవ్వులు పంచుతూ ఆయా చిత్రాలపై ఆసక్తి రేకెత్తిస్తుంటారు. అలాంటి మ్యాజిక్ చేసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశాడు. అయితే, తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో (MEGA157) సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అనిల్ దూకుడుతో అదరగొడుతున్నాడు. అయితే, దానికి కాస్త బ్రేక్ ఇవ్వాలని చిరు కోరారట. కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ మొదలు పెట్టమని సూచించారట.అనిల్ రావిపూడి స్పీడ్కు చిరు బ్రేకులు వేయడం వెనుక కూడా కారణం ఉందని తెలుస్తోంది. చిరు కొత్త సినిమా విశ్వంభర( Vishwambhara) త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉండేవి. కానీ, ప్రస్తుతం చిరు అభిమానుల్లో కూడా సినిమాపై అంతగా ఆసక్తి లేదని చెప్పవచ్చు. అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ వల్ల విశ్వంభర మీద ప్రభావం పడుతుంది. అందరూ మెగా157 ప్రాజెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. నయనతారతో ప్రమోషన్స్ ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో చిరు కళ్ళమీద క్లాప్ కొట్టి దాని చిన్న క్లిప్ రూపంలో వదలడం.. ఇలాంటివి అన్నీ మెగా ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. కానీ, విశ్వంభరపై అలాంటి జోష్ కనిపించడం లేదు. అందుకే అనిల్ను కాస్త బ్రేక్ తీసుకోవాలని చిరు సూచించారట.విశ్వంభర టీజర్ తర్వాత ఎలాంటి పబ్లిసిటీని ఆ మూవీ మేకర్స్ చయలేదు. అయితే, ఈ సినిమా దర్శకుడు వశిష్ఠపై ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. తప్పకుండా హిట్ అవుతుందని సాధారణ ప్రేక్షకులలో కూడా అంచనాలు ఉన్నాయి. కానీ, ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచితేనే మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో నిర్మాత విక్రమ్ రెడ్డి ఒక బుక్ లాంచ్ చేసి ఫోటోలు విడుదల చేశారు. కానీ, అందులో ఉన్న సారాంశం ఎంటి..? దాని ప్రత్యేకత ఏంటి అనేది మాత్రం చెప్పలేదు. ఇలా అయితే ఎలా అంటూ విశ్వంభర ప్రమోషన్స్లో వేగం పెరగాలని అభిమానులు కూడా కోరుతున్నారు. సినిమా విడుదల విషయంలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జులైలో విడుదల కావచ్చు అనే టాక్ అయితే వస్తుంది. -
'మెగా 157' ప్రారంభం.. ఫస్ట్ సీన్ ఎక్కడంటే
మెగాస్టార్ చిరంజీవి,అనిల్ రావిపూడి తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్) ఈరోజు హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభమైంది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలు అందించిన అనిల్ రావిపూడికి ఇది చిరంజీవితో తొలి చిత్రం కావడం విశేషం. చిరంజీవి అభిమానులు ఎప్పటి నుంచో ఆయనను మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి కాన్సెప్ట్తోనే ఈ చిత్రం రానుంది.తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి నిరీక్షణకు తెరపడింది. ఈ రోజు (మే 23) హైదరాబాద్లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ప్రాజెక్ట్పై అనిల్తో పాటు చిరంజీవి కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకుని మంచి జోరు మీదున్న అనిల్ రావిపూడి, తన యూనిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. టెక్నికల్ క్రూ పరిచయ వీడియో, తర్వాత నయనతార ప్రోమో వీడియో ఆడియన్స్ ని కట్టిపడేసింది.ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ కూడా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్గా ఉన్నారు. -
చిరంజీవి- అనిల్ సినిమా.. ఎంట్రీ ఇచ్చేసిన హీరోయిన్
చిరంజీవి- అనిల్ రావిపూడి ప్రాజెక్ట్లోకి నయనతార ఎంట్రీ ఇచ్చేశారు. ఈమేరకు తాజాగా చిత్రయూనిట్ ఒక వీడియోను షేర్ చేస్తూ స్వాగతం పలికింది. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరిగింది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.Mega157లో నయనతార నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిని ధృవీకరిస్తూ నయనతారతో ఒక ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి విడుదల చేశారు. జూన్లో ప్రారంభం కానున్న షూటింగ్ కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ చిత్రంతో చాలారోజుల తర్వాత నయనతర హీరోయిన్గా తెలుగులో మళ్లీ అడుగుపెడుతున్నారు. ఇక ఈ సినిమా కోసం అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది -
చిరంజీవి సినిమాలో విలన్గా టాలీవుడ్ యంగ్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi,), అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. మెగాస్టార్ కెరీర్లో గుర్తిండిపోయేలా సినిమా ఉంటుందని అనిల్ చెబుతున్నాడు. ఇందులో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వింటేజ్ చిరంజీవి ఇందులో చూపించబోతున్నాడట. కామెడీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆశించే యాక్షన్ కూడా ఇందులో ఉంటుందట. ఇందుకోసం అనిల్ బలమైన సీన్లు రాసుకున్నాడట. అంతేకాదు చిరంజీవిని ఢీకొట్టే విలన్గా ఓ యంగ్ హీరోని చూపించబోతున్నారట. అతనెవరో కాదు మెగాస్టార్ వీరాభిమాని కార్తికేయ(Kartikeya Gummakonda).ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు కార్తీకేయ. ఆ తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో విలన్గానూ నటించాడు. నాని ‘గ్యాంగ్ లీడర్’ తో పాటు అజిత్ ‘తెగింపు’లో కార్తికేయ విలన్గా నటించి అందరిని మెప్పించాడు. ఇప్పుడు మళ్లీ చిరంజీవి సినిమాలో నెగెటివ్ రోల్ చేయనున్నాడు. అయితే ఇందులో విలన్ కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ కూడా చేస్తాడట. ఈ పాత్రకు కార్తికేయ అయితేనే న్యాయం చేస్తాడని అనిల్ అతన్ని సంప్రదించారట. చిరంజీవి సినిమా అనగానే కార్తికేయ కథ వినకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా టాలీవుడ్లో వినిపిస్తున్న రూమర్స్ మాత్రమే. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కార్తికేయ కూడా దీనిపై స్పందించలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చిరంజీవితో కలిసి నటించాలనుకున్న కార్తికేయ డ్రీమ్ ఫుల్ ఫిల్ అయినట్లే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందట. విక్టరీ వెంకటేశ్ కూడా ఈ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతిథి పాత్రలో ఆయన నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిరు సినిమా: అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక పారితోషికం!
అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. టాలీవుడ్లో హిట్ సినిమాకు ఈ పేరు కేరాఫ్గా మారింది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్సాఫీస్ని షేక్ చేస్తాడు. రీసెంట్గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో విక్టరీ వెంకటేశ్కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న MEGA157(వర్కింగ్ టైటిల్) మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీమ్ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి కచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు రూ.10-12 కోట్లు తీసుకున్న అనిల్.. ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా రూ.20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ప్రారంభంలో పటాస్ చిత్రానికి అనిల్ రూ.50 లక్షలు మాత్రమే తీసున్నాడు. ఇప్పుడు రూ. 20 కోట్లకు ఎగబాకాడు. సూపర్ హిట్ ఇచ్చి భారీగా వసూళ్లను రాబట్టే సత్తా ఉండడంతో రూ.20 కోట్లే కాదు అంతకంటే కాస్త ఎక్కువ అయినా ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. -
చిరంజీవికి జోడీగా సీనియర్ హీరోయిన్కే ఛాన్స్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. మెగా 156గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే పేరు ఖారారు చేయనున్నారు. ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా... యు.వి.క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమే పోరాట ఘట్టాలతో మొదలైంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకని చిరంజీవి ఇటీవల విరామం తీసుకుని హైదరాబాద్ వచ్చారు. ఈ సినిమా ప్రత్యేకమైన ఓ ఊహా ప్రపంచం నేపథ్యంలో సాగనుంది. చిరంజీవి సరసన పలువురు కథానాయికలు నటించే అవకాశాలున్నాయి. నిజానికి ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒక్కరే హీరోయిన్ అని గతంలోనే బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు తెరపైకి త్రిష పేరు బయటకు వచ్చింది. అనుష్క శెట్టి ఆశించిన స్థాయిలో బరువు తగ్గకపోవడంతో ఆ ఛాన్స్ త్రిషకు దక్కినట్లు తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్,లియో వంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో త్రిషకు కూడా గుర్తింపు ఉంది. కానీ చాలా రోజుల నుంచి ఆమె టాలీవుడ్లో కూడా రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తుంది. మెగాస్టార్ చిత్రంతో వస్తున్న ఈ అవకాశాన్ని ఆమె ఉపయోగించుకోవాలని చూస్తుందట. అప్పట్లో, త్రిష, చిరంజీవి కాంబినేషన్లో స్టాలిన్ చిత్రం ద్వారా మెప్పించారు. తర్వాత ఆచార్య సినిమాతో మరోసారి ఆచార్య సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా త్రిష స్థానంలో కాజల్ అగర్వాల్ని తీసుకున్నారు. ఏది ఏమైనా చిరు సినిమాలోకి త్రిష ఎంట్రీకి సంబంధించి అఫీషియల్ అప్ డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మెగా 156లో విజువల్ ఎఫెక్ట్స్కి ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో చిన్నారుల్ని అలరించే అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రాహకుడు. -
చిరంజీవి కొత్త సినిమాలో విలన్గా రామ్చరణ్ ఫ్రెండ్!
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది అస్సలు మర్చిపోలేడు. ఎందుకంటే 'వాల్తేరు వీరయ్య' లాంటి సూపర్హిట్ పడింది. మర్చిపోలేని రీతిలో 'భోళా శంకర్' డిజాస్టర్ అయింది. దీంతో తర్వాత మూవీస్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అలా ఇప్పుడు ఓ కొత్త మూవీని లాంచ్ చేశాడు. ఇందులోనే రామ్ చరణ్ ఫ్రెండ్, ఓ తెలుగు హీరో విలన్ గా చేయబోతున్నాడట. దాదాపు పదేళ్ల సినిమాకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి.. 2017లో 'ఖైదీ నం.150' అనే కమర్షియల్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. అది హిట్ అయింది. ఆ తర్వాత చేసిన 'సైరా' తేడా కొట్టేసింది. ఇక 'గాడ్ఫాదర్' కలెక్షన్ తెచ్చుకున్నప్పటికీ హిట్ కాలేకపోయింది. వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. వీటి తర్వాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు సినిమా చేయాలి. కానీ దాన్ని పక్కనబెట్టేశారు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దసరా సందర్భంగా మంగళవారం లాంఛనంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది. కీరవాణితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. ముల్లోకాల నేపథ్య కథతో తీస్తున్న ఈ ఫాంటసీ సినిమాలో చిరు డిఫరెంట్ లుక్స్లో కనిపించబోతున్నారు. రూ.200 కోట్ల బడ్జెట్ అనే టాక్ వినబడుతోంది. ఇందులో చిరుకి విలన్గా రానా పేరు పరిశీలనలోకి వచ్చింది. ఇప్పటికే 'బాహుబలి'తో తానెంటో ప్రూవ్ చేసుకున్న రానా.. ఇప్పుడు చిరు సరసన హాలీవుడ్ మూవీ 'లోకీ' తరహా పాత్ర చేయబోతున్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం సినిమాపై హైప్ పెరగడం గ్యారంటీ. ఇదిలా ఉండగా చరణ్-రానా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ కూడా. (ఇదీ చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) -
Mega 156 Pooja Ceremony Photos: చిరంజీవి-వశిష్ఠ 'మెగా 156' సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు
-
మెగా 156 ప్రారంభం.. వీడియోతో ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి
మెగా 157 ప్రాజెక్ట్ కాస్త నంబర్ మారి మెగా 156 అయిన విషయం తెలిసిందే. 'బింబిసార'తో అటు చిత్ర పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ. తన రెండో సినిమాలోనే మెగాస్టార్ లాంటి లెజెండ్ హీరోను డైరెక్టె చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇటీవల నిర్వహించిన ‘సైమా’ (SIIMA) వేడుకల్లో ఉత్తమ పరిచయ దర్శకుడిగా 'బింబిసార' సినిమాతో వశిష్ఠ అవార్డు అందుకున్నారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను ఎందుకంటే: రేణు దేశాయ్) దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రధాన టీమ్ను ఒక వీడియో ద్వారా యూవీ క్రియేషన్స్ మేకర్స్ ప్రకటించారు. అందులో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణితో వీడియో ప్రారంభం అవుతుంది. ఆపై మెగాస్టార్ తన సతీమణి సురేఖతో కలిసి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి కెమెరామెన్గా చోటా కె. నాయుడు ఉన్నారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తుండగా.. ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గేయ రచయితగా ఉన్నారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని కీరవాణి తెలిపారు. కాస్ట్యూమ్స్ సుష్మిత కొణిదెల,ఏడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు వంటి వారు మెగా 156 ప్రాజెక్ట్లో భాగమయ్యారు. త్వరలో ఈ చిత్రానికి టైటిల్ కూడా ప్రకటించనున్నారు. -
వశిష్ట సినిమా విషయంలో షాకింగ్ న్యూస్ చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ భారీ డిజాస్టర్ తర్వాత రెండు చిత్రాలను ప్రకటించారు. ఇందులో మెగా 156 చిత్రాన్ని తన కుమార్తె సుష్మిత నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారు. మరోకటి మెగా 157 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్లో బింబిసార డైరెక్టర్ వశిష్టతో స్కెచ్ వేశారు. కానీ ఇక్కడ చిరు చిన్న మార్పు చేశారు. మెగా 157వ చిత్రంపైనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టారు. డైరెక్టర్ వశిష్ట కథ పట్ల ఆయనకు భారీ నమ్మకం ఏర్పడ్డాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెగా 156 చిత్రాన్ని వదిలేసి మెగా 157 ప్రాజెక్ట్పైనే ఆయన ఫోకస్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్న సినిమానే ముందుగా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అందులో భాగంగానే తాజాగా ఆ ప్రాజెక్ట్ను మెగా 156 అని ఒక పోస్టర్ను వశిష్ఠ షేర్ చేశారు. మెగాస్టార్-వశిష్ఠ ఈ క్రేజీ ప్రాజెక్ట్లో సంగీత దర్శకుడిగా ఎమ్ఎమ్ కీరవాణి భాగమయ్యారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందిస్తుండగా చోటా కె. నాయుడు కెమెరామెన్గా ఉన్నారు. ఇక మెగా 156 గురించి మాట్లాడుకుంటే.. ఈ సినిమాకు సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, త్వరలో ఆ డైరెక్టర్ని చిరునే అధికారికంగా ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే దసరా రోజున అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పాడు చిరు. తన లైన్లో మెగా 156 లేదు అంటూ తెలిపాడు. మెగా 157 గా తెరకెక్కుతున్న వశిష్ట సినిమానే మెగా 156 గా మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా 156 పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #Mega156 begins 🔥 దసరా శుభాకాంక్షలు 🏹 Mega Star @KChiruTweets @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/sMsVhXnbAj — Vassishta (@DirVassishta) October 23, 2023 -
కొత్త సినిమాకు బ్లాక్బస్టర్ డైరెక్టర్ను ఓకే చేసిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన 'భోళా శంకర్' సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్కి కూడా నచ్చలేదని చెప్పవచ్చు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్పైనా విమర్శలు వచ్చాయి. మెగస్టార్ లాంటి పెద్ద నటుడితో సినిమా తీస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని ఆయనపై విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాలను మరోసారి తీయకండని ఫ్యాన్స్ కూడా కోరారు. (ఇదీ చదవండి: సీఎం యోగి పాదాలను తాకడంపై క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్) దీంతో ఆయన నుంచి వచ్చే కొత్త ప్రాజెక్ట్లు ఎలా ఉంటాయని అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇందులో భాగంగా యూవీ క్రియేషన్స్ నుంచి చిరంజీవి తర్వాతి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన కథను 'బింబిసార' మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ కథను రెడీ చేశారు. మెగా 157 సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటంచారు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో పంచభూతాల గుర్తులను వశిష్ట చూపించాడు. టైటిల్ ఇదేనా..? డైరెక్టర్ వశిష్ఠ, మెగాస్టార్ కాంబో నుంచి వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో అనగా అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మాదిరిగా ఉండబోతోందని సమాచారం. ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి మానవుడైనా చిరంజీవిని ప్రేమించగా. అప్పుడు ఎదురైన ఇబ్బందులను చిరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడో చూశాం. (ఇదీ చదవండి: చిరంజీవిని మెప్పించిన డైరెక్టర్ వశిష్ఠ గురించి పూర్తి వివరాలు) ఇక్కడ కూడా అలాంటి కాన్సెప్ట్తో కొందరు దేవకన్యలు భూమిపైకి రావడం వంటి ముఖ్యమైన కాన్సెప్ట్తో మెగా 157 ఉండనున్నట్లు సమాచారం. పంచభూతాలను చిరు ఎలా అధిగమిస్తాడనే కథాంశం మీద స్టోరీ లైన్ ఉండవచ్చు. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్నది అయితే తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. #Mega157 🔮 This time, its MEGA MASS BEYOND UNIVERSE ♾️ The five elements will unite for the ELEMENTAL FORCE called MEGASTAR ❤️🔥 Happy Birthday to MEGASTAR @KChiruTweets Garu ❤️@DirVassishta @UV_Creations#HBDMegastarChiranjeevi pic.twitter.com/llJcU6naqX — UV Creations (@UV_Creations) August 22, 2023