breaking news
Maruti Ertiga
-
బెస్ట్ 7 సీటర్ కార్లు: ధరలు ఇలా..
భారతదేశంలో కేవలం సెడాన్, హ్యాచ్బ్యాక్స్ కార్లకు మాత్రమే కాకుండా.. ఎస్యూవీలకు, ఎంపీవీలకు డిమాండ్ ఉంది. దీంతో వీటి సేల్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కథనంలో అత్యంత సరసమైన.. ఐదు 7 సీటర్ కార్లను గురించి తెలుసుకుందాం.రెనాల్ట్ ట్రైబర్రెనాల్ట్ ట్రైబర్ భారతదేశంలో అత్యంత సరసమైన ఎంపీవీ. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ కారు స్లైడింగ్, రిక్లైనింగ్ (మధ్య వరుస) సీట్లను పొందుతుంది. అంటే ప్రయాణీకులు అవసరానికి అనుగుణంగా సీటింగ్ లేఅవుట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరోమహీంద్రా బొలెరో భారతదేశంలో చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఈ మోడల్ సెవెన్ సీటర్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. బొలెరో గ్రామీణ & సెమీ అర్బన్ ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభిస్తుంది.సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్సిట్రోయెన్ ఎయిర్క్రాస్ ఎక్స్ అనేది ఏడు సీట్ల లేఅవుట్తో కూడిన కాంపాక్ట్ ఎస్యూవీ. ఇండియన్ మార్కెట్లో ఏడు సీట్ల లేఅవుట్తో అందుబాటులో ఉన్న సిట్రోయెన్ మోడల్ ఇదే. దీని ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 13.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది.మహీంద్రా బొలెరో నియోమహీంద్రా బొలెరో నియో బొలెరో.. లేటెస్ట్ వెర్షన్. ఇది మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందివ్వడమే కాకుండా.. మెరుగైన ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్ను అందిస్తుంది. బొలెరో నియో కూడా కొన్ని నెలల క్రితం బొలెరోతో పాటు డిజైన్ ట్వీక్లు, అదనపు ఫీచర్లను పొందింది. బొలెరో నియో పవర్ట్రెయిన్.. సాధారణ బొలెరో మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 8.49 లక్షల నుంచి రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.మారుతి సుజుకి ఎర్టిగామారుతి సుజుకి ఎర్టిగా.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎంపీవీ. ధరకు తగిన సామర్థ్యం, డిజైన్, ఫీచర్లు, పవర్ట్రెయిన్ వంటివి ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ఎంపీవీ పెట్రోల్, CNG పవర్ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది. ఇందులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. -
ఆగస్టులో ఎక్కువమంది కొన్న కార్లు.. ఇవే!
ఆగస్టు 2025లో మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. తరువాత జాబితాలో డిజైర్, క్రెటా, వ్యాగన్ ఆర్, నెక్సాన్ మొదలైనవి నిలిచాయి. ఈ కథనంలో.. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఏవో చూసేద్దాం.➤మారుతి ఎర్టిగా: 18,445➤మారుతి డిజైర్: 16,509➤హ్యుందాయ్ క్రెటా: 15,924➤మారుతి వ్యాగన్ఆర్: 14,552➤టాటా నెక్సాన్: 14,004➤మారుతి బ్రెజ్జా: 13,620➤మారుతి బాలెనో: 12,549➤మారుతి ఫ్రాంక్స్: 12,422➤మారుతి స్విఫ్ట్: 12,385➤మారుతి ఈకో: 10,785పై జాబితాను గమనిస్తే.. టాప్ 10 కార్లలో 8 కార్లు మారుతి సుజుకి కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. మిగిలిన రెండు హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా, టాటా మోటార్స్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే దేశీయ విఫణిలో మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: నిస్సాన్ మాగ్నైట్కు రీకాల్: 1500 కార్లు వెనక్కి!ఈ నెలలో (సెప్టెంబర్) కూడా.. దేశంలో వాహన అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం వాహనాల ధరల తగ్గుదల, ఫెస్టివల్ సీజన్. విజయదశమి, దీపావళి సందర్భంగా చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో వాహనాల సేల్స్ పెరుగుతాయి. -
ఎక్కువ మంది ఇష్టపడి కొంటున్న 7 సీటర్ కారు ఇదే!
భారతదేశంలో 7 సీటర్ కార్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఎన్ని కార్లు ఉన్నా.. ఈ విభాగంలో మారుతి ఎర్టిగా కారుకు ఓ ప్రత్యేకమైన డిమాండ్, ఆదరణ ఉంది. ఈ కారును గత నెలలో (మే 2024) ఏకంగా 13,893 మంది కొనుగోలు చేశారు. దీంతో ఎక్కువ అమ్మకాలు పొందిన 7 సీటర్ కారుగా ఎర్టిగా మళ్ళీ రికార్డ్ క్రియేట్ చేసింది.దేశీయ మార్కెట్లో మారుతి ఎర్టిగా ధరలు రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు మొత్తం ఏఋ మోనోటోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. దూర ప్రాంతాలకు ఫ్యామిలీతో కలిసి వెళ్లడానికి ఈ కారు ఉత్తమ ఎంపిక.మారుతి ఎర్టిగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 103 పీఎస్ పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇది CNG రూపంలో కూడా లభిస్తుంది. ఇది 88 పీఎస్ పవర్, 121.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో మాత్రమే లభిస్తుంది.డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు నాలుగు ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్ వంటి సేఫ్టీ ఫీచర కూడా పొందుతుంది. ఈ కారు దేశీయ విఫణిలో ఇనోవా క్రిష్టా, కియా కారెన్స్, మారుతి ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎర్టిగా కాదు.. ఇన్నోవాలే ముద్దు!
జంట కమిషనరేట్లకు పోలీసులకు సరికొత్త వాహనాలను సమకూర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి.. ఇన్నోవాలనే ఎంచుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు రెండింటికీ కలిపి వంద వరకు వాహనాలు కావాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే దాదాపు 1500 కార్లు కావల్సి వస్తాయన్నారు. ముందుగా ఇన్నోవా వాహనాలు తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మారుతి కంపెనీ ప్రతినిధులు వచ్చి సీఎం కేసీఆర్ను కలిశారు. ఇన్నోవాది, తమది దాదాపు ఒకటే డిజైన్ అని, సీట్ల సామర్థ్యం కూడా సమానంగా ఉంటుందని చెప్పారు. అయితే ఇన్నోవా ఖరీదు దాదాపు రూ. 16 లక్షలు కాగా ఎర్టిగా మాత్రం దాదాపు 10 లక్షలకే వస్తుందని, పైగా, ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుందని మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. ఒక్కో వాహనానికి 6 లక్షల చొప్పున జంట కమిషనరేట్లలోని వంద వాహనాలకే 6 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉండేది. మొత్తం 1500 కార్లకు అయితే దాదాపు 90 కోట్ల వరకు మిగిలిది. అయితే ఎందుకో గానీ.. ఎర్టిగాకు బదులు ఇన్నోవాలనే తెలంగాణ సర్కారు ఎంచుకుంది. దాంతో ఇన్నోవాలే గురువారం నాటి పెరేడ్లో దర్శనమిచ్చాయి. కొసమెరుపు: ఈ కొత్త వాహనాలను పెరేడ్ చేసిన తొలిరోజే ఓ ఇన్నోవా స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇందులో ఎవరికీ గాయాలు కాకపోయినా వాహనం ముందుభాగం మాత్రం కొద్దిగా దెబ్బతింది. ఇంజన్ భాగంలోంచి కొంత ఆయిల్ కారింది. -
పోలీసుల వాహనాల్లో కొత్త ట్విస్ట్
తెరపైకి ఎర్టిగా వాహనం! ఇన్నోవా కంటే రూ.6 లక్షలు తక్కువ సాక్షి, సిటీబ్యూరో: పోలీసులకు రాబోతున్న కొత్త వాహనాలలో ఇప్పటి వరకు ఇన్నోవా తెరపైకి వచ్చింది. తాజాగా మారుతి కంపెనీ ఎర్టిగా కూడా ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది. జంట పోలీసు కమిషనరేట్లకు ఇన్నోవా కారు, హీరో మోటార్ సైకిల్ను కొనేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి అందులో కొన్నింటిని ఖరీదు చేసింది. సుమారు 1,500 కార్లు, 1,600కుపైగా బైక్లు కొత్తగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్లు ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇన్నోవా ఖరీదు సుమారు రూ.16 లక్షలు ఉంది. కానీ, మారుతి ఎర్టిగా సుమారు రూ.10 లక్షలే. రెండు వాహనాల్లో సిట్టింగ్ కేపాసిటీ ఒకే విధంగా ఉంది. పైగా ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుంది. దీన్నే మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. దీంతో ఇన్నోవాల కొనుగోలులో ప్రభుత్వం పునరాలోచించే అవకాశం కనిపిస్తోంది.


