-
ఎర్టిగా కాదు.. ఇన్నోవాలే ముద్దు!
జంట కమిషనరేట్లకు పోలీసులకు సరికొత్త వాహనాలను సమకూర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి.. ఇన్నోవాలనే ఎంచుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లు రెండింటికీ కలిపి వంద వరకు వాహనాలు కావాలని నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే దాదాపు 1500 కార్లు కావల్సి వస్తాయన్నారు. ముందుగా ఇన్నోవా వాహనాలు తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మారుతి కంపెనీ ప్రతినిధులు వచ్చి సీఎం కేసీఆర్ను కలిశారు. ఇన్నోవాది, తమది దాదాపు ఒకటే డిజైన్ అని, సీట్ల సామర్థ్యం కూడా సమానంగా ఉంటుందని చెప్పారు. అయితే ఇన్నోవా ఖరీదు దాదాపు రూ. 16 లక్షలు కాగా ఎర్టిగా మాత్రం దాదాపు 10 లక్షలకే వస్తుందని, పైగా, ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుందని మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. ఒక్కో వాహనానికి 6 లక్షల చొప్పున జంట కమిషనరేట్లలోని వంద వాహనాలకే 6 కోట్ల రూపాయలు మిగిలే అవకాశం ఉండేది. మొత్తం 1500 కార్లకు అయితే దాదాపు 90 కోట్ల వరకు మిగిలిది. అయితే ఎందుకో గానీ.. ఎర్టిగాకు బదులు ఇన్నోవాలనే తెలంగాణ సర్కారు ఎంచుకుంది. దాంతో ఇన్నోవాలే గురువారం నాటి పెరేడ్లో దర్శనమిచ్చాయి. కొసమెరుపు: ఈ కొత్త వాహనాలను పెరేడ్ చేసిన తొలిరోజే ఓ ఇన్నోవా స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇందులో ఎవరికీ గాయాలు కాకపోయినా వాహనం ముందుభాగం మాత్రం కొద్దిగా దెబ్బతింది. ఇంజన్ భాగంలోంచి కొంత ఆయిల్ కారింది. -
పోలీసుల వాహనాల్లో కొత్త ట్విస్ట్
తెరపైకి ఎర్టిగా వాహనం! ఇన్నోవా కంటే రూ.6 లక్షలు తక్కువ సాక్షి, సిటీబ్యూరో: పోలీసులకు రాబోతున్న కొత్త వాహనాలలో ఇప్పటి వరకు ఇన్నోవా తెరపైకి వచ్చింది. తాజాగా మారుతి కంపెనీ ఎర్టిగా కూడా ప్రభుత్వ పరిశీలనకు వచ్చింది. జంట పోలీసు కమిషనరేట్లకు ఇన్నోవా కారు, హీరో మోటార్ సైకిల్ను కొనేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి అందులో కొన్నింటిని ఖరీదు చేసింది. సుమారు 1,500 కార్లు, 1,600కుపైగా బైక్లు కొత్తగా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.300 కోట్లు ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇన్నోవా ఖరీదు సుమారు రూ.16 లక్షలు ఉంది. కానీ, మారుతి ఎర్టిగా సుమారు రూ.10 లక్షలే. రెండు వాహనాల్లో సిట్టింగ్ కేపాసిటీ ఒకే విధంగా ఉంది. పైగా ఇన్నోవా కంటే ఎర్టిగా ఎక్కువ మైలేజీ ఇస్తుంది. దీన్నే మారుతి కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదించారు. తమ వాహనం ఖరీదు చేస్తే రూ.6 లక్షల మిగులుతో పాటు మైలేజ్ కలసివస్తుందని ప్రతిపాదించారు. పోలీస్ స్టిక్కర్లతో డిజైన్ చేసిన కొన్ని ఎర్టిగా కార్లను ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారులకు చూపించి వాటి పనితీరును వివరించారు. దీంతో ఇన్నోవాల కొనుగోలులో ప్రభుత్వం పునరాలోచించే అవకాశం కనిపిస్తోంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement