breaking news
marine engineering
-
పట్టిసీమ పథకానికి చంద్రబాబు శంకుస్థాపన
-
'భూములిచ్చిన రైతులకు ఎకరానికి అదనంగా రూ.20 వేలు'
పశ్చిమగోదావరి: పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు టీడీపీకి 15 సీట్లిచ్చి పూర్తి మద్దతు పలికారని, పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో వారి రుణం తీర్చుకుంటానన్నారు. జిల్లాలో నిట్, మెరైన్ ఇంజనీరింగ్ యూనివర్శిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కృష్ణాకు తరలిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతేకాకుండా రాబోయే రెండు నెలల్లో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేస్తామన్నారు. తనపై నమ్మకంతో రాజధాని ప్రాంత రైతులు 35 వేల ఎకరాల భూములు ఇవ్వడం సంతోషించదగ్గ పరిణామమన్నారు. అంతేకాకుండా పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పంటనష్టం కింద ఎకరానికి రూ.20 వేలు అదనంగా అందజేస్తామని రైతులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. -
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చేయాలంటే?
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లను తెలపండి? -రఘునందన్, పాలకొల్లు. మెరైన్ ఇంజనీర్లు ప్రధానంగా ఓడలు, పెద్ద పెద్ద పడవల రూపకల్పనలో పాల్పంచుకుంటారు. వాటి ఇంజిన్, వివిధ భాగాల పనితీరును గమనించడం కూడా వీరి బాధ్యతే. ఓడ సమర్థంగా నడవడానికి కావల్సిన అన్ని రకాల వ్యవహారాలను మెరైన్ ఇంజనీర్లు పర్యవే క్షిస్తారు. మోడ్రన్ మెరైన్ టెక్నాలజీ, బేసిక్ టూల్స్, వర్క్షాప్ టెక్నాలజీ, పవర్ హౌసెస్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర అంశాలను మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత పోర్ట్స్, షిప్పింగ్ పరిశ్రమలు, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వంటి సంస్థల్లో ఉపాధి పొందొచ్చు. అమెరికా, యూకేలలో కూడా వీరికి విరివిగా అవకాశాలుంటాయి. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం. ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా వెబ్సైట్: www.andhrauniversity.edu.in మెరైన్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్-కోల్కతా. వెబ్సైట్: www.merical.ac.in టోలనీ మారిటైమ్ ఇన్స్టిట్యూట్-పుణే వెబ్సైట్: www.tolani.edu వీఈఎల్ఎస్ యూనివర్సిటీ-చెన్నై వెబ్సైట్: www.velsuniv.org పీజీలో సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -అశోక్, ప్రొద్దుటూరు ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంలో అనుసంధానం చేసిన నెట్వర్క్కు సంబంధించిన లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి నెట్వర్క్, అప్లికేషన్స్, వెబ్సైట్స్ తదితరాల నెట్వర్క్కు చెందిన సెక్యూరిటీ ప్రోటోకాల్ను సురక్షితంగా ఉంచేందుకు కావల్సిన వ్యూహాలను ఎథికల్ హ్యాకర్స్ రూపొందిస్తారు. కోర్సులో భాగంగా నెట్వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్వర్కింగ్టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలను బోధిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సును పలు యూనివర్సిటీలు పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్ కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.iiit.ac.in జేఎన్టీయూ-హైదరాబాద్ కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం కోర్సు: ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్) వివరాలకు: www.andhrauniversity.edu.in ఈ యూనివర్సిటీలు గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లేదా పోస్ట్గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి. ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా? -ధరణి, సికింద్రాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. పీహెచ్డీ కోర్సుల్లో సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. వివరాలకు: www.iisc.ernet.in యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్ పరీక్ష వివరాలను తెలపండి? జియాలజీలో కోర్సులను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -షాలినీ, కుప్పం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జియాలజిస్ట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. దీని ద్వారా జియాలజిస్ట్, హైడ్రో జియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత: జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్ప్లోరేషన్/ ఇంజనీరింగ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ ఎర్త్ సైన్స్ అండ్ రీసోర్సెస్ మేనేజ్మెంట్/ ఓషియనోగ్రఫీ అండ్ కోస్టల్ ఏరియాస్ స్టడీ/ పెట్రోలియం జియో సెన్సైస్/ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్/ జియో కెమిస్ట్రీ/ జియలాజికల్ టెక్నాలజీ/ జియో ఫిజికల్ టెక్నాలజీ) హైడ్రో జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ైహైడ్రో జియాలజీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. అవి.. జనరల్ ఇంగ్లిష్ (100 మార్కులు), జియాలజీ పేపర్-1 (200 మార్కులు), జియాలజీ పేపర్-2 (200 మార్కులు), జియాలజీ పేపర్-3(200 మార్కులు), హైడ్రోజియాలజీ (200 మార్కులు). ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. వివరాలకు: www.upsc.gov.in మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు యూజీ, పీజీ స్థాయిల్లో జియాలజీ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పీహెచ్డీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తుంది.