breaking news
Maoist central committee member
-
లొంగుబాటుకు దేవ్జీ షరతులు!
కోరుట్ల: మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగుబాటు వ్యవహారంలో కొన్ని షరతుల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అందుకే దేవ్జీ లొంగుబాటులో తాత్సారం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర హోంశాఖ యంత్రాంగంతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా దేశాన్ని మావోయిస్టురహితంగా మార్చాలన్న లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిన క్రమంలో దేవ్జీ లొంగుబాటు అంశం చర్చనీయాంశమైంది. కేంద్ర కమిటీ బలహీనం కావడంతో.. మావోయిస్టు పార్టీలోని కీలక నేతల్లో ఒకరైన హిడ్మా సహా వివిధ హోదాల్లో ఉన్న సుమారు 1,800 మంది మావోయిస్టులు గత కొంతకాలంగా జరుగుతున్న కేంద్ర బలగాల కూంబింగ్, ఎదురుకాల్పుల ఘటనల్లో మృతిచెందారు. దీనికితోడు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు సహా వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఫలితంగా మావోయిస్టు కేంద్ర కమిటీ బలహీనంగా మారింది. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్జీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవ్జీ లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో మృతిచెందినా ఆపరేషన్ కగార్ ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల క్రితం దేవ్జీ అంగరక్షకులను పోలీసులు అరెస్టు చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని.. పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఇప్పటికీ ఆయన లొంగుబాటు విషయంలో నెలకొన్న స్తబ్దత వీడటం లేదు. షరతులతో తాత్సారం? దేవ్జీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్లు ఇటీవల కాలంలో ప్రచారం సాగుతోంది. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్ జిల్లాలతోపాటు జార్ఖండ్లోని తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి అంశాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఉద్యమంలో పనిచేసి జైలుశిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తు ఏమిటన్న అంశంపైనా చర్చించాలని దేవ్జీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షరతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రానందునే దేవ్జీ లొంగుబాటులో తాత్సారానికి కారణమన్న వాదన వినిపిస్తోంది. అయితే డిమాండ్లన్నీ నెరవేరితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు దేవ్ జీ లొంగిపోతారన్న ప్రచారం జరుగుతోంది. -
కరోనా దెబ్బకు మావోల మాత్రల వేట
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత పట్టణాలు, పల్లెలకే కాదు.. దండకారణ్యానికి పాకుతోంది. అడవుల్లో ఉండే మావోయిస్టుల్లోనూ కరోనా భయం పెరిగిపోతోంది. దళసభ్యులు కరోనా వ్యాధి బారిన పడితే.. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం లేకపోవడంతో ముందు జాగ్రత్తగా మాత్రల కొనుగోలుపై దృష్టిపెట్టారు. లాక్డౌన్ ఎత్తివేసిన దరిమిలా..పలువురు మావోయిస్టులు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్లలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో పలువురు మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ కోసం పలు సమావేశాలు నిర్వహించగా పోలీసులు భగ్నం చేసి వారిపై కేసులు కూడా నమోదు చేశారు. జనారణ్యంలో తిరిగిన పలువురు మావోయిస్టులు దండకారాణ్యానికి వెళ్లాక జబ్బుల బారిన పడుతుండటం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. దీంతో అది కరోనా కావొచ్చన్న అనుమానంతో మందులు తెప్పించుకుంటున్నారు. పలు మారుమూల ప్రాంతాల్లో అనుమానాస్పద, కొత్త వ్యక్తులు కరోనా చికిత్సకు వాడే మందులను భారీగా కొనుగోలు చేస్తున్నారని, ఇలా సేకరించిన మందులు తెలంగాణతోపాటు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్కు వెళ్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీజనల్ వ్యాధులా.. కరోనానా? ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ ప్రహార్ మొదలైంది. గోదావరిలో నీటి ప్రవాహలు పలు చోట్ల తగ్గడంతో మావోయిస్టులు పలువురు తెలంగాణలో తలదాచుకునేందుకు వచ్చారు. వారితోపాటు పలుయాక్షన్ టీములు వచ్చాయి. వారి కోసం పోలీసులు కూంబింగ్ జరిపారు. అదే సమయంలో లాక్డౌన్ తీవ్రతరం కావడం, జనాల కదలికలు పూర్తిగా ఆగిపోవడంతో మావోలూ ఆగిపోయారు. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం కొందరు రిక్రూట్మెంట్ కోసం పలువురిని కలిశారు. ఇలా కలిసిన వారిలో చాలామంది సభ్యులు ప్రస్తుతం జ్వరాల బారిన పడుతున్నారు. దీనికితోడు రుతుపవనాల వల్ల కురుస్తున్న వర్షాలతో జలుబు, దగ్గు, చలిజ్వరాలు వంటి సీజనల్ వ్యాధులూ మొదలయ్యాయి. ఫలితంగా తమలోనూ కరోనా వచి్చందేమోనన్న ఆందోళన మావోయిస్టుల్లో మొదలైంది. దీంతో సామాజిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు ధరిస్తున్నారు. అయితే, పరిశుభ్రత విషయంలో వీరికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని సమాచారం. దోమలు, అపరిశుభ్ర వాతావరణం వీరి ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతోందని తెలిసింది. అనుమానాస్పద వ్యక్తుల కారణంగానే.. ఆన్లైన్లో కరోనాకి వాడే మందుల వివరాలు లభ్యమవుతుండటంతో మావోయిస్టులు ముందు జాగ్రత్తగా ఆ మందులను సేకరిస్తున్నారు. సానుభూతిపరులు, కొరియర్ల ద్వారా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు జ్వరం కోసం పారాసిటమాల్తోపాటు, జింక్, విటమిన్–డీ. విటమిన్–సీ మాత్రలు, యాంటిబయాటిక్స్, యాంటి వైరల్ డ్రగ్స్ను కొనుగోలు చేయిస్తున్నారు. ఇవన్నీ తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్లో ఉండే మావోలకు చేరుతున్నాయని సమాచారం. ఒక్కరి కోసం కాకుండా..ఎక్కువ మొత్తంలో కావడంతో ఆ సమాచారం పోలీసులకు వెళ్లింది. దీంతో వారంతా ఇప్పుడు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, ఫార్మా డీలర్లపై నిఘా పెట్టారు. కేంద్ర కమిటీ సభ్యుడి భార్యకు కరోనా ఇటీవల గుండెపోటుతో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామన్న భార్య సుమిత్రకు కరోనా సోకింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మొదుకుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని పెహకావలి దండకారణ్యంలో ఆమెకు కరోనా వచ్చింది. ఈ విషయాన్ని మావోయిస్టు దండకారణ్య కమిటీ ఓ లేఖ ద్వారా వెల్లడించింది. దీంతో ఆమెను దళం నుంచి బయటికి పంపగా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. -
మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేత సుధాకర్
-
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడికి యావజ్జీవ శిక్ష
కరీంనగర్ : మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేసిన ఉగ్గే చంద్రమౌళికి మధ్యప్రదేశ్లోని బాల్గఢ్ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు శుక్రవారం బాల్గఢ్ న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన ఉగ్గే చంద్రమౌళి 1981లో మావోయిస్ట్ దళ సభ్యుడిగా చేరాడు. అనతి కాలంలోనే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. కాగా, 2005లో మధ్యప్రదేశ్ రవాణాశాఖ మంత్రి హత్య కేసులో చంద్రమౌళిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆ క్రమంలో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో 2005లో మహరాష్ట్రలోని నాగ్పూర్లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసును విచారించిన బాలాగఢ్ న్యాయస్థానం శుక్రవారం చంద్రమౌళిని ప్రధాన నిందితుడిగా గుర్తించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.


