-
వరద నీటిలో చిక్కుకున్న మహిళా
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మంచిర్యాల: రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి గుర్తుతెలియని వాహనం దూసుకెళ్లిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం అంకత్పల్లిలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యవసాయ పనులకు వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పొలవేని రమేశ్(35) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్య
జెన్నారం(మంచిర్యాల): వృద్ధ దంపతులకు కొడుకు మాటలు కంఠ విషంగా మారాయి. కొడుకు మాటలు మింగుట పడని ఆదంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో సతమతమవుతున్న వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని జెన్నారం మండలం ధర్మారంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దుర్గం ధర్మరాజు(80), పోచవ్వ(70) దంపతులు గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతన్నారు. ఈ క్రమంలో భూమి విషయంలో తలెత్తిన వివాదాల్లో కొడుకుతో మనస్పర్థలు రావడంతో.. మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులపై కేసీఆర్ చిన్నచూపు
మంచిర్యాల సిటీ: జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ సమస్య అ త్యవసరమని తెలిసి కూడా, సీఎం కేసీఆర్ దశలవారీగా రుణాలను రద్దుచేయడాన్ని బట్టి ఆ యనకు రైతులపై ఉన్న చిన్నచూపును అర్ధం చేసుకోవచ్చన్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజునే ఉచిత విద్యుత్తో పాటు, రుణమాఫీ దస్త్రాలపై సంత కం చేసిన విషయూన్ని తెలంగాణ రైతులు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. జిల్లాలోని ప్రతి రైతు కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. విద్యార్థుల భోధన రుసుములను ఒకేసారి చెల్లించకుండా పేదవారు చదువులకు దూరమయ్యేలా తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా సమస్యలపై దశలవారిగా ఉద్యమాలు చేసి ప్రజలకు తమ పార్టీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ విజయ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి మెస్రం శంకర్, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సునీల్ థామస్,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు జాన్, బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, జిల్లా నాయకులు నరేందర్, జమీల్బాబా, ఉన్నారు. మిషన్ కాకతీయతో ఫలితం శూన్యం జన్నారం: ‘మిషన్ కాకతీయ’ పథకం ద్వారా రైతులకు జరుగుతున్న లబ్ధి శూన్యమని వైఎ స్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్ ఆ రోపించారు. శనివారం జన్నారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పథకం కింద జిల్లాలో ఎంపికైన చెరువుల పనులు ఇంకా పూర్తి కాలేదన్నా రు.బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలన్నారు. పార్టీకి పూర్వవైభవం తెస్తాం జిల్లాలో వైఎస్సార్ సీపీకి పూర్వ వైభవం వస్తుందని అనిల్కుమార్ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిల అధ్యక్షతన జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు.మంచిర్యాల, కాగజ్నగర్, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి పట్టణాలలో పార్టీ క్యాడర్ను పెంచామన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ విజయ్కుమార్, రాష్ట్ర కార్యదర్శి మెస్రం శంకర్, అధికార ప్రతినిధి చంద్రయ్య, మండల అధ్యక్షుడు రాజునాయక్ పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న స్వైన్ఫ్లూ..
మంచిర్యాల టౌన్ : తగ్గుముఖం పట్టిందనుకున్న స్వైన్ ఫ్లూ మరోసారి విజృంభించింది. తాజాగా మరో మూడు స్వైన్ఫ్లూ కేసులు పాజిటివ్గా రావడంతో ఒక్కసారిగా జిల్లాలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో 20 మంది వరకు స్వైన్ఫ్లూ లక్షణాలతో చేరగా ఇందులో ఐదుగురికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ అరుు్యంది. వారిలో ఇద్దరు కోలుకుని ఇంటికి వెళ్లగా.. మరో ముగ్గురు తాజాగా వ్యాధి బారిన పడ్డారు. మంచిర్యాల రాంనగర్కు చెందిన వంగపల్లి సాగర్రావు (53), ఏసీసీకి చెందిన కుక్క మేరి(27) ఈ నెల 9వ తేదీన స్వైన్ ఫ్లూ లక్షణాలతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్రావు ఆదేశాల మేరకు వైద్యురాలు నీరజ వారి రక్త నమూనాలు సేకరించి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం ఇద్దరికీ స్వైన్ ఫ్లూ ఉన్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో సాగర్రావు గత రాత్రి ఇంటికి వెళ్లగా హుటాహుటినా ఆస్పత్రికి పిలిపించి వైద్య సేవలందిస్తున్నారు. కాగా.. మందమర్రి దీపక్నగర్కు చెందిన బెల్లారపు భారతి (35)కి కూడా స్వైన్ఫ్లూ ఉన్నట్లు రిపోర్ట్ రావడంతో మందమర్రి నుంచి ఆమె నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలో ప్రస్తుతం మేరీ, సాగర్రావు చికిత్స పొందుతున్నట్లు వైద్యుడు నీలకంఠేశ్వర్రావు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement