-
ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థినిని తుపాకీతో కాల్చి పరార్!
పాట్నా: తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ ప్రేమోన్మాది 15 ఏళ్ల బాలికను దారికాచి తుపాకీతో కాల్చాడు. మెడపై తూటా దిగటంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది బాధితురాలు. ఈ దుశ్చర్య బిహార్ రాజధాని పాట్నాలో బుధవారం జరిగింది. బాలికపై తుపాకీ పేల్చుతున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బ్యూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కూరగాయలు విక్రయించే వ్యక్తి కుమార్తె 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ప్రేమించాలని వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను తిరస్కరించిందనే కోపంతో తుపాకీతో వచ్చాడు. బాలిక అతడితో మాట్లాడకుండా వెళ్లగా వెనక నుంచి మెడపై కాల్చాడు. తూటా దిగటంతో బాలిక అక్కడే పడిపోయింది. ఆ తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా పోలీసులు తెలిపారు. Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police (Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1 — ANI (@ANI) August 18, 2022 ఇదీ చదవండి: లఖింపుర్లో 72 గంటల ఆందోళన.. యూపీకి 10వేల మంది రైతులు -
ప్రేమించలేదని.. కాల్చి చంపేశాడు!
తనను ప్రేమించలేదన్న కోపంతో 16 ఏళ్ల అమ్మాయిని కాల్చి చంపేశాడో ప్రేమికుడు. అనంతరం నేరుగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. హిమాంశి అనే అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. యోగేంద్ర (22) అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. ఆమె నిరాకరించడంతో పాటు పెద్దలకు ఫిర్యాదు చేయడంతో స్కూలు నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడికి ఓ బ్యూటీపార్లర్ ఉంది. అతడు తరచు తన వెంటపడుతున్నాడని హిమాంశు తన తాత బల్జీత్ సింగ్ తదితరులకు చెప్పింది. దాంతో వాళ్లు యోగేంద్ర కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో అతడికి కోపం వచ్చి ఆమెను కాల్చి చంపేశాడు. తర్వాత సమీపంలోని పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. అతడిపై హత్యకేసు నమోదుచేసి జైలుకు తరలించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement