breaking news
London Bridge terror attack
-
లండన్ బ్రిడ్జి ఉగ్రవాది.. పాత నేరస్తుడే
లండన్: లండన్లోని ‘లండన్ బ్రిడ్జి’పై శుక్రవారం కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉగ్రవాది ఉస్మాన్ఖాన్(28) గతంలో ఉగ్రవాద నేరాలపై ఏడేళ్ల క్రితం శిక్ష అనుభవించిన విషయాన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వెల్లడించారు. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజిపై బాంబు దాడికి యత్నించినందుకు, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నడిపినందుకు ఉస్మాన్ఖాన్కు గతంలో జైలుశిక్ష పడింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఉస్మాన్.. పెరోల్పై బయటికొచ్చి శుక్రవారం లండన్ బ్రిడ్జిపై పేట్రేగిపోయాడు. కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చిన ఉస్మాన్ మరో ముగ్గురిని గాయపరిచాడు. ఉస్మాన్కు ఉగ్రనేరాలపై 2012లో శిక్ష పడింది. 2018లో లైసెన్స్ (పెరోల్)పై జైలు నుంచి విడుదలయ్యాడు. -
ఉగ్రవాదిని సీక్రెట్గా బొందపెట్టాడు
లండన్: బ్రిటన్లోని ప్రఖ్యాత లండన్ బ్రిడ్జిపై వాహనంతో మారణకాండకు పాల్పడిన పాకిస్థాన్ సంతతికి చెందిన ఉగ్రవాది ఖుర్రం షాద్ బట్ను రహస్యంగా ఖననం చేశారు. లండన్లోని ఏ స్మశాన వాటిక కూడా అతడిని ఖననం చేసేందుకు అనుమతించకపోవడంతో చివరకు అతడి బంధువు అయిన ఓ 27 ఏళ్ల వ్యక్తి చివరకు అతడి మృతదేహాన్ని తీసుకెళ్లి తూర్పులండన్లోని అతడి ఇంటికి సమీపంలోని ఓ స్మశానవాటికకు రహస్యంగా తీసుకెళ్లి ఎలాంటి హడావుడి, అంత్యక్రియలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు లేకుండా చకచకా పూడ్చిపెట్టినట్లు సండే మిర్రర్ తెలిపింది. అయితే, ఉగ్రవాదిగా అతడు చేసిన పనికి కుటుంబ సభ్యులు తీవ్రంగా చిరాకు పడటంతో వాళ్లెవరూ కూడా అంత్యక్రియలకు హాజరుకాలేదట. అంతేకాకుండా, ఎలాంటి ఆడంబరంగా అతడి అంత్యక్రియలు నిర్వహించినా మిగితా వారి దృష్టిలో తమ కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఇలా చేయాల్సి వచ్చిందని కూడా ఆ పత్రిక వివరించింది. పూడ్చిపెట్టిన వ్యక్తికి తప్ప ఎవరికీ కూడా అతడి సమాధి ఎక్కడుందో తెలియదట.