breaking news
Local media
-
యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కానుందా?
ముంబై: దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో యాక్సింగ్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు కానుందన్న వార్తలు చెలరేగాయి. మనీలాండరింగ్ వ్యవహారాల్లో జోక్యం కారణంగా యాక్సిస్ బ్యాంక్ రద్దుకానున్నట్టు జాతీయ పత్రికలో వార్తలొచ్చాయి. భారీ అక్రమ లావీదేవీలకారణంగా ఇటీవల బ్యాంకుకు చెందిన సుమారు 19 మంది ఉద్యోగులపై వేటుపడిన నేపథ్యంలో ఈ వార్తకు మరింత ప్రాధాన్యం లభించింది.పెద్ద నోట్ల రద్దు తరువాత భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డ యాక్సిస్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసేందుకు కేంద్ర యోచిస్తోందటూ ప్రాంతీయ వార్తాపత్రిక (హిందీ) లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బ్యాంకు తీవ్రంగా ఖండించింది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కావాలనే దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. కేంద్ర బ్యాంకు నిబంధనల ప్రకారం తాము కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేసింది. సాధారణ ప్రజలను, ఖాతాదారులను, తమ సిబ్బందిలో ఆందోళన రేపి, భయభ్రాంతులను చేసేందుకు పన్నిన కుట్ర అని తాము నమ్ముతున్నట్టు స్టాక్ ఎక్సేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. అక్రమాలకు తావులేని బలమైన వ్యవస్థ, నియంత్రణలను కలిగి ఉన్నామని బ్యాంక్ పేర్కొంది. కాగా ఈ వార్తల నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్ లో యాక్సిస్ షేర్ 3 శాతం నష్టపోయింది. -
పూర్తికాలం సీఎం నేనే
సిద్ధరామయ్య బెంగళూరు: ‘ప్రస్తుతం నేను ముఖ్యమం త్రి స్థానంలో ఉన్నాను. పూర్తి కాలం కొనసాగుతా. ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావులేదు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కొప్పళ్లో స్థానిక మీడియాతో ఆయన సోమవారం మాట్లాడారు. దళిత నాయకుడు సీఎం స్థానంలో కుర్చొంటే తనకు అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. బెంగళూరులోని చర్చ్స్ట్రీట్ ఉదంతం ఆనంతరం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఉగ్రవాదుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక ధోరణి అవలంభిస్తోందని విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. హెలిక్యాప్టర్ ఘటన తర్వాత తాను దేవాలయానికి వెళ్లి పూజలు చేసినట్లు మీడియాలోని ఓ వర్గం పనిగట్టుకుని ప్రసారం చేస్తోందన్నారు. ఇలాంటి అసత్య కథనాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.