breaking news
lift irigation scheme
-
తక్కళ్లపల్లి డ్యామ్ వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం :వైఎస్ఆర్ జిల్లా
-
తీరనున్న నల్లగొండ నీటిగోస: మరో 3 ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగించుకుంటూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించేలా మూడు ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో సాగునీరందని ప్రాంతాలకు నీరు అందించేలా రూ.160 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసింది. నకిరేకల్ నియోజకవర్గంలో 8,058 ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా కట్టంగూరు మండలం, చెరువు అన్నారం గ్రామ పరిధిలో అయితిపాముల ఎత్తిపోతల పథకాన్ని రూ.122 కోట్లతో నిర్మించనుంది. మొత్తం నాలుగు పంపులను వినియోగిస్తూ 80 క్యూసెక్కుల నీటిని తరలించేలా ఈ ఎత్తిపోతలను నిర్మించనున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామం వద్ద వీర్లపాలెం ఎత్తిపోతలను రూ.29.20 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 2,500 ఎకరాలకు నీరిస్తారు. ఇదే నియోజకవర్గంలోని వేములపల్లి గ్రామం సమీపంలో తోపుచెర్ల ఎత్తిపోతలను రూ.10.19 కోట్లతో ప్రతిపాదించగా, దీనిద్వారా 315 ఎకరాలకు నీరందనుంది. ఇప్పటికే నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో నెల్లికల్, దున్నపోతుల గండి, బొంతపాలెం, కేశవాపురం, పొగిళ్ల, ముక్త్యాల, జా¯Œ పహాడ్, అంబాభవాని, కంబాలపల్లి, ఏకేబీఆర్ వంటి ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి మొత్తం రూ.2,500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
నిజాంసాగర్పై మూడు ఎత్తిపోతలు
సాక్షి, హైదరాబాద్: నిజాంసాగర్ నుంచి జలాలు శ్రీరాంసాగర్కు వెళ్లే దారిపై సాగర్ ప్రధాన కాల్వలపై రెండు ఎత్తిపోతల పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో ఒకటి మంజీరా ఎత్తిపోతలను చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం తెలపగా, కొత్తగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల పరధిలో జకోరా, చండూరు ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రతిపాదించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే ప్రణాళికను రూపొందించాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. నిజాం సాగర్, సింగూరు జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నందువల్ల ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీళ్లు అందించేందుకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళికను రూపొందించాలని సూచించారు. గుత్ప, అలీ సాగర్ మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందివ్వాలని సూచించారు. దీనికి వెంటనే సర్వే చేసి, లిఫ్టులు ఎక్కడెక్కడ పెట్టాలి.. వాటి ద్వారా ఏయే గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించవచ్చో తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దీనికనుగుణంగా అధికారులు బాన్సు వాడలో నిజాం సాగర్ ప్రధాన కాల్వపై రెండు ఎత్తిపోతలు ప్రతిపాదించి ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. జకోరా ఎత్తిపోతలతో రూ.4,200 ఎకరాలు, చండూర్ ఎత్తిపోతలతో 2,850 ఎకరాలకు నీరిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే నిజాంసాగర్ దిగువన మంజీర ఎత్తిపోతలకు రూ.476.25 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. నిజాం సాగర్ మండలం మల్లూరు గ్రామ సమీపంలో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. -
లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో టీడీపీ నేతలు చేతివాటం
-
‘పథకం’తో.. పతనమా?
‘ఎత్తిపోతల’కు భూసేకరణతో బతుకు భారమేనని ఆందోళన ∙ తమ భూములు ఇచ్చేది లేదంటున్న అన్నదాతలు వారంతా చిన్న, సన్నకారు రైతులే.. ఉన్న కొద్దిపాటి భూమే వారికి జీవనాధారం. దానిపైనే వారి ఆశలన్నీ. అయితే ఇప్పటి వరకు ఆనందంగా ఉన్న ఆ రైతుల్లో ఆందోళన నెలకొంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం తమ భూములు కోల్పోవలసి వస్తుందనే గుబులు మొదలైంది. భూసేకరణ పేరుతో తమ పంట భూములు కోల్పోతే తామంతా వీధిన పడతామని, బతుకు భారమవుతుందని, ఆత్మహత్యలే శరణ్యం అని అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. భూసేకరణ జాబితా రావడం, అందులో సుమారు 80మంది వరకు రైతులు భూములు కోల్పోతారని తెలియడంతో వారంతా ’కలవరపడుతున్నారు. – పురుషోత్తపట్నం (సీతానగరం) పురుషోత్తపట్నం ఎత్తి పోతల పథకానికి సంబంధించి సుమారు 200 ఎకరాలు భూసేకరణ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పది పంపులతో నెలకొల్పుతున్న ఈ పథకం కోసం సుమారు పదికిలో మీటర్ల మేర పైపులై¯ŒS వెళ్లనుంది. ఇందులో సుమారుగా 80 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంటే.. మిగిలింది స్థానిక రైతుల నుంచి సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భూసేకరణలో రైతులకు చెల్లించే ధర అనుకూలంగా ఉంటే వారికి నగదు చెల్లిస్తామని, లేకుంటే పైప్లై¯ŒS భూమి కింద నుంచి వెళుతున్నందున లీజుకి తీసుకుని ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. పోలవరం ఎడమ కాలువ ఏలేరు రిజర్వాయర్ వరకు 58 కిలోమీటర్లు ఉందని, ఇక్కడ వరకు మూడు ప్యాకేజీలలో రెండు ప్యాకేజీలు పూర్తయ్యాయని, ఒక ప్యాకేజీలో పనులు పూర్తయ్యే సమయానికి కాలువ పనులు పూర్తి చేస్తామని పోలవరం ఎల్ఎంసీ ఎస్ఈ సుగుణాకరరావు ‘సాక్షి’కి తెలిపారు. ఎందుకివ్వాలి.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల మాకు ఒరిగేదేమి లేదని, తమ పంట భూములను ఎక్కడో ఉన్న వారి లబ్ధికి ఎందుకు ఇవ్వాలంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పంట భూముల నుంచి పైప్లై¯ŒS వేసి, తమ భూములను తీసుకుంటే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. మాకు ఉన్న కొద్దిపొలంను ఎవరికోసమో కాజేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మాకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని ఎత్తిపోతల పథకానికి ఇచ్చేది లేదని రైతులు అంటున్నారు. ఆ భూమినైనా ఉంచండి రెండు ఎకరాల భూమి ఉంది. అమ్మాయికి వివాహమైంది. కట్నం గా ఎకరం ఇచ్చా. ఉన్న భూమి నుంచి పైప్లై¯ŒSకు తీసుకుంటే నా బతుకేంటి. నా భూమి నాకు ఉంచండి. – కలగర చిన సుబ్బారావు, రామచంద్రపురం ఎలా పోషించాలి ఉన్నది రెండెకరాలు. అప్పు రూ.12 లక్షలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భూమి నుంచి పైప్లై¯ŒS వెళుతుంది. ఉన్న భూమి పోతే నా కుటుంబాన్ని ఎలా పోషించాలి. మానోటి వద్ద కూడు లాగవద్దు. – అయినంపూడి వెంకట రామారావు, రామచంద్రపురం బతుకు భారమే.. ఉన్నది ఎకరంన్నర భూమి. అందులో నుంచి ఎత్తిపోతల పథకం పైప్లై¯ŒS వెళుతుందని, భూమి తీసుకుంటున్నామని అంటున్నారు. నాకు ఉన్న ఆ భూమే ఆధారం. భూమి తీసుకుంటే బతకడమే చాలా కష్టమవుతుంది. – నందిపాటి పాపారావు, రామచంద్రపురం మరణమే శరణ్యం నాకు ఉన్నదే యాభైసెంట్ల భూమి అందులో నుంచి పైప్లై¯ŒS వెళుతుందంటున్నారు. నాకున్న ఆధారం అదే. ఆ భూమి పోతే మరణమే శరణ్యం. దయచేసి నా భూమి పోకుండా చూడండి. – కొండిపాటి వీర వెంకట సత్యనారాయణ, రామచంద్రపురం రోడ్డున పడినట్టే అమ్మాయి, అబ్బాయి, భార్య ఉన్నారు. నాకు ఉన్నది ఎకరం భూమి. అందులో నుంచి పథకం పైప్లై¯ŒS వెళుతుందంటున్నారు. ఆ భూమి లేకపోతే కుటుంబమంతా రోడ్డున పడినట్టే. – దుద్దిపూడి వెంకట రామారావు, రామచంద్రపురం జీవించడం కష్టమే.. ఎకరా 30 సెంట్ల భూమి ఉంది. వ్యవసాయ కుటుంబం. అమ్మాయికి వివాహం చేశాం. అప్పు ఇంకా తీరలేదు. అబ్బాయి చదువుకుంటున్నాడు. ఉన్న పొలం పథకంలో పోతే జీవనాధారం పోయినట్టే. – అట్రు పద్మావతి, రామచంద్రపురం ఎలా బతికేది అమ్మాయి, అబ్బాయి. ఇద్దరూ చదువుకుంటున్నారు. ఉన్న పొలం 60 సెంట్లు భూమి. అందులో నుంచి పైప్లై¯ŒS వెళుతుంది. మాకున్న ఆ భూమి ప్రభుత్వ తీసుకుంటే మేము ఎలా బతకాలి. – దుర్దిపూడి అనంత పద్మావతి, రామచంద్రపురం