breaking news
LG X Screen
-
ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఎల్జీ తన నూతన స్మార్ట్ఫోన్ 'ఎల్జీ ఎక్స్ స్క్రీన్'ను మార్కెట్ లో లాంచ్ చేసింది. దీనిధరను రూ.12,990 లుగా కంపెనీ నిర్ణయించింది. స్నాప్ డీల్ ద్వారా జులై 20 నుంచి అమ్మకాలు మొదలుకానున్నట్టు సంస్థ తెలిపింది. అలాగే ఎల్జీ ఎక్స్ స్క్రీన్' వినియోగదారులకు 45 రోజుల ఉచిత హంగామా మ్యూజిక్ వీడియో డౌన్లోడ్ అందిస్తోంది. వొడాఫోన్ స్మార్ట ఫోన్ వినియోగదారులకు డబుల్ డేటా ఉచితం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పానిక్ బటన్ ఇందులో అమర్చబడింది. వినియోగదారడు పవర్ బటన్ వరుసగా ఐదు సార్లు నొక్కితే నిర్దేశిత నెంబర్లకు హెచ్చరికలు పంపుతుంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఆఫరింగ్లో తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి డ్యూయల్ డిస్ప్లే ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ వెల్లడించినసంగతి తెలిసిందే. ఈ డ్యూయల్ డిస్ప్లే ఫోన్ ద్వారా నోటిఫికేషన్లను చూసుకోవడాని వేరే ప్రోగ్రామ్ను ఆపాల్సిన అవసరం ఉండదు. బ్రౌజర్లో వర్క్ చేసుకుంటూనే వాట్సప్, ఫేస్బుక్ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఒకేసారి రెండు ప్రోగ్రామ్స్పై వర్క్ చేసుకోవచ్చు. ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు... 4.93 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280-720 పిక్సెల్ స్ర్కీన్ రిజల్యూషన్ 1.76 ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 520 x 80 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ 1.2 జీహెచ్జడ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్స్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్సీ 120 గ్రాముల బరువు 7.1 ఎంఎ మందం 2300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఇటీవల కె10,కె 7 పేరుతో డబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేసింది. -
ఎల్ జీ నుంచి రెండు డిస్ ప్లే ల ఫోన్
స్మార్ట్ ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్లను చూసుకోవడానికి, ఏదైనా ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు దాన్ని ఆపివేసి మరీ నోటిఫికేషన్లు యూజర్లు చూసుకోవాల్సి ఉంటోంది. అయితే ఈ ఆటంకం నుంచి వినియోగదారులు బయటపడేందుకు, రన్నింగ్ ప్రోగ్రామ్ కు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఎల్ జీ కొత్తగా రెండు డిస్ ప్లే స్మార్ట్ ఫోన్ ను వినియోగదారుల ముగింటకు తీసుకురాబోతోంది. జూలై 18న ఎక్స్ స్క్రీన్ పేరుతో ఈ ఫోన్ ను ఆవిష్కరించబోతోంది. ఈ ఈవెంట్ కు మీడియా ప్రతినిధులను ఎల్ జీ ఆహ్వానం పలుకుతోంది. ఇటీవలే కే సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను ఎల్ జీ మార్కెట్లోకి ఆవిష్కరించింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆఫరింగ్ లో తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి ఎక్స్ స్క్రీన్ ను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ఎల్ జీ ప్రకటించింది. రెండో స్క్రీన్ ఎల్లప్పుడూ ఆన్ లో ఉండేలా ఈ ఫోన్ రూపొందింది. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా వెంటనే రెండో డిస్ ప్లేలో యూజర్లు ఈ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఎల్ జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు.. 4.93 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే రెండో డిస్ ప్లే 1.76 అంగుళాలు 520 x 80 పిక్సెల్స్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 7.1 ఎంఎం థిక్ 120 గ్రాముల బరువు 13 ఎంపీ వెనుక కెమెరా 8 ఎంపీ ముందు కెమెరా 2300 ఎంఏహెచ్ బ్యాటరీ