breaking news
LeT commander
-
షాకింగ్: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో ఉగ్రనేతలు?!
మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ కార్యక్రమంలో లష్కర్-ఎ-తోయిబా (LeT) కీలక నేతలు, అందునా 2025 పహల్గామ్ దాడి అనుమానిత కీలక సూత్రధారి సైఫుల్లా కసూరి సహా పలువురు హాజరైనట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.Ex Cricketer Shoaib Akhtar's Brother died of heart attack!Shahid Akhtar's funeral was attended by PMML Islamabad President Inam ur Rehman Kamboh and other LeT terrorists.PMML serves as a proxy for LeT. Why Were LeT Leaders/Terrorists There? pic.twitter.com/ldJiocolCl— Megh Updates 🚨™ (@MeghUpdates) June 27, 2026సైఫుల్లా కసూరి గతంలో భారత్పై పలు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 26/11 తరహా దాడుల గురించి, సముద్ర మార్గ దాడుల గురించి అతను చేసిన వ్యాఖ్యలు భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించాయి. పహల్గామ్ దాడికి ఇతనే సూత్రధారి అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు సైతం బలంగా ఉన్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో అతని కార్యకలాపాలు మరోసారి చర్చలోకి వచ్చాయి. ఎల్ఈటీకి రాజకీయ ముఖచిత్రంగా భావించే పాకిస్తాన్ మార్కాజీ ముస్లిం లీగ్ (PMML) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం.జూన్ 24న గుండెపోటుతో అక్తర్ సోదరుడు మరణించారు. ఆయన కూడా మాజీ క్రికెటరే. గురువారం ఇస్లామాబాద్లోని హెచ్-8 గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో ప్రార్థనల సమయంలోనే వాళ్లంతా అక్కడ హల్చల్ చేశారు. అయితే.. క్రికెట్లో రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరున్న షోయబ్ అక్తర్.. భారత్ను ద్వేషించేలా మాట్లాడరు!. కానీ దాయాదుల పోరు సందర్భాల్లో ఎమోషనల్, ఫైర్డ్ కామెంట్స్ చేస్తారు. అదే సమయంలో భారత క్రికెట్ సిస్టమ్ను చాలాసార్లు ఓపెన్గా ప్రశంసించారు కూడా. అయితే షోయబ్ అక్తర్కు వాళ్లకు సంబంధాలు ఉన్నాయా? లేదంటే షాహిద్ అక్తర్కు వాళ్లు దగ్గరా?.. ఇప్పటివరకు షోయబ్ అక్తర్ నుంచిగానీ.. ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అధికారిక స్పందన వెలువడలేదు. Prominent figures and terrorists linked to Lashkar-e-Taiba (LeT) openly attended the funeral of Shahid Akhtar, the elder brother of former Pakistani cricketer Shoaib Akhtar, in Islamabad. pic.twitter.com/Src3ftlmf1— Vyom Pallav 🇮🇳 (@VyomPallav) June 27, 2026అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం లేదంటే స్థానిక భద్రతా సంస్థల నుంచి కూడా అధికారిక ప్రకటన రాలేదు. కానీ, పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాధిక్ కూడా అంత్యక్రియలకు హాజరు కావడం గమనార్హం. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిషేధిత సంస్థల నేతల వీడియోలు వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. సాధారణంగా అత్యంత రహస్యంగా, నీడల్లో కనిపించే ఈ నెట్వర్క్ సభ్యులు ఓ పబ్లిక్ ఈవెంట్లో ఇలా ప్రత్యక్షమవడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో నిషేధాలు ఉన్నప్పటికీ ఈ ఉగ్రసంస్థలు పాక్లో రాజకీయ ముసుగులో కొనసాగుతున్నాయా? అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ సంఘటన పాకిస్తాన్లో ఉగ్ర నెట్వర్క్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.భారత్ గతంలో చేపట్టిన చర్యలు, సరిహద్దు భద్రతా చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామాలు మరింత సున్నితంగా మారాయి. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతీయ భద్రతా సమీకరణాల్లో ఈ ఘటన కొత్త చర్చకు దారి తీసింది. పరిశీలకులు మాత్రం.. నిషేధిత సంస్థలు పూర్తిగా కనుమరుగుకాకుండా “పాలిటికల్ షెల్టర్” లేదా “ఫ్రంట్ ఆర్గనైజేషన్స్” ద్వారా కొనసాగుతున్న అవకాశం ఉందని అంటున్నారు.LeT నెట్వర్క్ నేపథ్యంలష్కర్-ఎ-తోయిబా అనేది 1990ల చివర్లో ఏర్పడిన ఉగ్ర సంస్థగా గుర్తింపు పొందింది. భారత్లో 2008 ముంబై దాడులు సహా పలు భారీ దాడుల్లో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఇది నిషేధిత ఉగ్ర సంస్థగా గుర్తించబడింది. సైఫుల్లా కసూరి వంటి నేతలు ఈ సంస్థలో కీలక కమాండ్ స్థాయిలో ఉన్నారని భద్రతా విశ్లేషణలు చెబుతున్నాయి. -
26/11 కుట్రదారుడు సాజిద్ మీర్పై విష ప్రయోగం!
ఇస్లామాబాద్: ఒకవైపు వరుసగా జరుగుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) కమాండర్ల మరణాలు అంతచిక్కని మిస్టరీగా మారాయి. మరోవైపు తాజాగా మరో ఎల్ఈటీ కమాండర్ సాజిద్ మీర్పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్లోని కోట్ లఖ్పత్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సాజీద్ మీర్.. కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రిలో వెంటిలేటర్పైన ఉన్న సాజిద్పై విష ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం అతనికి గత ఏడాది జూన్లో శిక్ష విధించగా.. ప్రస్తుతం లఖ్పత్ జైల్లో ఖైదీగా ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ప్రాణాలకు ముప్పు ఉందన్న వార్తల నేపథ్యంలో మరో జైలుకు బదిలీ చేసే సమయంలో ఆస్పత్రి పాలు కావటం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. BIG BREAKING: Bharat's Most Wanted Lashkar-e-Taiba terrorist, the main conspirator in the 26/11 Mumbai attacks, Sajid Mir, poisoned by 'UNKNOWN MEN' inside Central Jail Dera Ghazi Khan in Pakistan.Sajid is in critical condition and on a ventilator support; air-lifted by Pak… pic.twitter.com/efICEzadhs— Treeni (@_treeni) December 4, 2023 భారత్లో జరిగిన 26/11 ఉగ్రవాద దాడుల కుట్రదారుల్లో ఒకడైన సాజిద్ మీర్ గత ఏడాది అరెస్టయ్యాడు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాడన్న అభియోగం రుజువు కావడంతో 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. సాజిద్ మీర్ను తమకు అప్పగించాలని అమెరికా.. గత కొంతకాలంగా పాక్పై ఒత్తిడి తెస్తోంది. అమెరికాకు అప్పగించడం ఇష్టం లేని ISI.. సాజిద్పై విషప్రయోగం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సాజిద్ తలకు అమెరికా FBI 5 మిలియన్ డాలర్ల వెల కట్టింది. 26/11 మంబై ఉగ్రవాద దాడి కుట్రదారుల్లో ఒకడైన సాజిద్.. ఉగ్రవాదులు ముంబై చేరడానికి తెర వెనక కావాల్సిన సాయం చేశాడు. ఇది కూడా చదవండి: బ్రిటన్ వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. -
టాప్ ఎల్ఈటీ కమాండర్ ఖతం!
సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాదళాలకు మరో విజయం. పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ వసీం షాను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో వసీం షా సహా అతని అనుచరుడైన మరో ఉగ్రవాది నజీర్ అహ్మద్ మృతి చెందారు. వసీం షా లష్కరే తోయిబా షోపియన్ జిల్లా కమాండర్గా కొనసాగుతున్నాడు. అతన్ని మట్టుబెట్టిన భద్రతా దళాలను జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ ప్రశంసించారు. 'క్లీన్ ఆపరేషన్లో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. వెల్డన్ జేకేపీ (జమ్మూకశ్మీర్ పోలీస్) బాయ్స్, సెక్యూరిటీ ఫోర్సెస్' అని వైద్ ట్వీట్ చేశారు. దక్షిణ పుల్వామా జిల్లాలోని లిట్టర్ గ్రామంలో ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు, పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. శనివారం ఉదయమే ఈ గ్రామాన్ని చుట్టుముట్టి.. ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. -
లష్కరే తోయిబా కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం భీకర ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఆయుబ్ లెల్హరిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. పుల్వామా జిల్లాలోని బందెర్పోరాలోని కాక్పొరా గ్రామంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ జవానుకు గాయాలయ్యాయి. 'మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడిగా ఆయుబ్ లెల్హరి ఉన్నాడు. ఇది భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయం' అని జమ్ము కశ్మీర్ డీజీపీ తెలిపారు. -
ఎల్ఈటీ టాప్ కమాండర్ ఖతం!
శ్రీనగర్: కశ్మీర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ అబు దుజనా మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్టు తెలుస్తోంది. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతాదళాలు జరిపిన ఎన్కౌంటర్లో అబు (27)తోపాటు మరో మిలిటెంట్ చనిపోయాడని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. పుల్వామాలోని హక్రిపోరా గ్రామంలో మిలిటెంట్లుకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా తాము స్వాధీనం చేసుకోలేదని, కాబట్టి ఎవరు చనిపోయింది ఇప్పుడే చెప్పలేమని కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ విలేకరులకు తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిక కశ్మీర్లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి చెందిన అబు దుజనా దక్షిణ కశ్మీర్లో జరిగిన చాలా మిలిటెంట్ దాడుల వెనక ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. -
లష్కరే టాప్ కమాండర్ హతం
జమ్ము: లష్కర్ ఏ తోయిబాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ కమాండర్ అబూ బకర్ హతమయ్యాడు. భారత సైనికుల కాల్పుల్లో ఆ ఉగ్రవాది చనిపోయాడు. సోపోర్లో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. గత కొన్ని గంటలుగా జమ్ముకశ్మీర్ లోని సొపోర్ ప్రాంతంలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లోనే ఉగ్రవాది అబూ బకర్ హతమయ్యాడని తెలుస్తోంది. భారతీయ సైనికులకు ఎలాంటి హానీ జరగలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


