-
టోటల్లీ ప్యాక్డ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ బైక్ కమింగ్ సూన్..!
బీజింగ్: ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ లీ ఇకో మరో ఆవిష్కారానికి శ్రీకారం చుట్టింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారిత బైక్ లను త్వరలో ప్రవేశపెట్టనుంది. ఆండ్రాయిడ్ డివైస్తో అనుసంధానమై పనిచేసే ఈ బైక్ను చైనా సంస్థ లీఎకో రూపొందిస్తోంది. 2017 రెండో త్రైమాసికంలో ఈ టోటల్లీ ప్యాక్డ్ విత్ ఆండ్రాయిడ్ స్మార్ట్బైక్ను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో స్మార్ట్ రోడ్ బైక్, స్మార్ట్ మౌంటెన్ బైక్ పేరుతో రెండు వేరియంట్స్ ను తీసుకొస్తోంది. మిగతా సూపర్ బైక్ ల ఫీచర్లతో పాటు 6000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేసే రిమూవబుల్ బ్యాటరీ , స్నాప్ డ్రాగన్ 410 పవర్డ్ టచ్ స్ర్కీన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ , వాకీ టాకీ లాంటి అదనపు ఫీచర్లు ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే ధర ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సప్పెన్సే. ఈ స్మార్ట్ బైక్ హ్యాండిల్స్ పై ఉండే నాలుగు అంగుళాల టచ్ ఆధారిత స్మార్ట్ స్క్రీన్ ద్వారా మనం ఏ దిశలో వెళ్లాలో తెలుసుకోవచ్చు. ఏయే ప్రాంతాల్లో తిరిగామో రికార్డు కూడా చేస్తుంది. ఒంటరి ప్రయాణంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ సంగీతాన్ని ఆస్వాదించొచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు ఈ బైక్ను ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆ బైక్ సంబంధిత యజమాని ఫోన్కి అలర్ట్ ఆటోమేటిక్గా అందే ఏర్పాటు ఉంది. సెన్సర్ల ద్వారా రైడర్ ఫిట్నెస్ వివరాలను కూడా ఈ స్మార్ట్ బైక్ ట్రాక్ చేసేలా రూపొందించారట. దీంతో ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంపై స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ కార్లు, స్మార్ట్ టీవీలే కాదు స్మార్ట్ బైక్ లు కూడా ఇక మార్కెట్లను ముంచెత్తబోతున్నాయన్నమాట. అయితే ముందుగా అమెరికాలో హల్ చల్ చేయనున్న ఈ స్మార్ట్ బైక్ లకోసం దేశీయ బైక్ లవర్స్ మాత్రం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
ఈ సీఈవో వార్షిక జీతం పది రూపాయలు
బీజింగ్: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు లీ ఎకో ఛైర్మన్, జియా సీఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంస్థ నష్టాలకు పూర్తి బాధ్యతను వహిస్తూ తన వార్షికజీతంలో భారీగా కోతపెట్టుకున్నారు. నామమాత్రపు వార్షిక వేతనంగా కేవలం ఒక యెన్ మాత్రమే(రూ.10లు)గా తీసుకోనున్నట్టు వెల్లడించారు. టీవీలు, ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్లు లాంటి హైటెక్ ఉత్పత్తుల్లో భారీ పెట్టుబడులకు దిగుతున్న ఈ చైనీస్ ఎలక్ట్రిక్ దిగ్గజం లీఎకో సీఈవో సిబ్బందికి రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. సంస్థలో నెలకొన్న ప్రస్తుత పరిస్తితికి తాను, మ్యానేజ్ మెంట్ టీం పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నామని చెప్పారు టెక్ దిగ్గజం తెస్లా మెటార్స్ను అధిగమించాలని భావిస్తున్న ఈ బిలయనీర్ ..అనేక రంగాల్లో పెట్టుబడుల మూలంగా నగదు కొరత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ప్రకటించారు. తమ సంస్థ బిగ్ కంపెనీ డిసీజ్ని ఎదుర్కొంటున్నట్టు రాయిటర్స్ పంపిన మరో లేఖలో జియా పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా సహా వివిధ దేశాల మార్కెట్లకు సవాల్ విసురుతున్న లీఎకో సంస్థాగత ఇబ్బందులు, వ్యక్తిగత పనితీరు తదితర సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. కాగా జియో ఈ వ్యాఖ్యలతో లీ ఎకో అనుబంధ సంస్థ లేషి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ బీజింగ్ లో 4.7శాతం పడిపోయింది. -
దివాలీ ఆఫర్ పొడిగించిన లీ ఎకో
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు లీ ఎకో తన స్మార్ట్ టీవీల దీపావళి ఆఫర్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. సూపర్ 3 టీవీలపై అక్టోబర్ 26 నుంచి 30 వరకు అమలు చేసిన ప్రత్యేక ఆఫర్ మరికొంతకాలం పొడిగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద క్యాష్ బ్యాక్ ఆఫర్ను,మూడు, లేదా ఆరు నెలలపాటు వడ్డీలేని ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే ఎక్సేంజ్ ఆఫర్ కింద 25 వేల వరకు తగ్గింపుధరను అందిస్తోంది. దీపావళి ఆఫర్ సందర్భంగా సంస్థ వెబ్ సైట్ లీమాల్, ఫ్లిప్ కార్ట్ ద్వారా నిర్వహించిన ఓపెన్ అమ్మకాల్లో 2వేలకు పైగా సూపర్ టివీ 3 లనువిక్రయించినట్టు తెలిపింది కాగా చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ సంస్థ లీ ఎకో ఇటీవలే మన దేశంలో స్మార్ట్ టీవీల బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. . సూపర్ 3 టీవీ సిరీస్ పేరిట మూడు వేరియంట్లను మార్కెట్ లోకి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్స్ ఇవేనట!
పండుగ సీజన్లో ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రారంభించే బంపర్ ఆఫర్లు వెల్లువ మొదలైంది. రెండో రోజు 'బిగ్ బిలియన్ డేస్' సందర్భంగా దేశీయ దిగ్గజం ఫ్లిప్కార్ట్, స్మార్ట్ఫోన్లు వాటికి సంబంధించిన ఉపకరణాలపై బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ఎవరైతే కొత్త స్మార్ట్ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి తగ్గింపు ధరల్లో ఫోన్లను విక్రయించనున్నట్టు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.స్మార్ట్ఫోన్ కంపెనీలతో టాప్-20 డీల్స్ను ఫ్లిప్కార్ట్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆఫర్లలో అందిస్తున్న స్మార్ట్ఫోన్లు ఇవేనట... ఆపిల్... ఆపిల్ ఐఫోన్6(గ్రే కలర్, 16జీబీ) ఫ్లాట్పై రూ.7,000 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.29,990 ఆపిల్ ఐఫోన్ 5ఎస్(16జీబీ) ఎక్స్చేంజ్పై రూ.15వేల వరకు ధర తగ్గింపు- అందుబాటులో ఉండే ధర రూ.17,799 ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ ప్రస్తుత ధర రూ.30,990, రెగ్యులర్ ఎక్స్చేంజ్పై అదనపు రూ.2500 తగ్గింపు, నెలకు విధించే రూ.2,584 ఈఎంఐ లేకపోవడం శాంసంగ్... శాంసంగ్ గెలాక్సీ జే5-6(ఫ్లాట్పై రూ.2,300 తగ్గింపు) ప్రస్తుత ధర రూ.10,990, ఎక్స్చేంజ్పై రూ.9,000వరకు తగ్గింపు శాంసంగ్ ఆన్5- అందుబాటులో ఉన్న ధర రూ.6,990, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.5,500వరకు తగ్గింపు శాంసంగ్ ఆన్6- అందుబాటులో ఉన్న ధర రూ.6,990, ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.5,500వరకు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ ఆన్7- ఫ్లాట్పై రూ.2,200 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.7,990, ఎక్స్చేంజ్పై రూ.6500 వరకు తగ్గింపు శాంసంగ్ గెలాక్సీ ఆన్8(గోల్డ్,16జీబీ) ఫ్లాట్పై రూ.1,000 తగ్గింపు, ప్రస్తుత ధర రూ.14,900 లీఎకో... లీఎకో లీ 1ఎస్ ఎకో(32జీబీ)- ఫ్లాట్పై రూ.2,000 తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.6,500వరకు తగ్గింపు లీఎకో లీ 2- ప్రస్తుత ధర రూ.10,499, ఎక్స్చేంజ్పై రూ.8,000వరకు తగ్గింపు లీఎకో లీ మ్యాక్స్2- ఫ్లాట్పై రూ.5,000 తగ్గింపు,ఎక్స్చేంజ్పై రూ.16,000వరకు తగ్గింపు షియోమి... షియోమి రెడ్మి 3ఎస్/3ఎస్ ప్రైమ్- రూ.500 తగ్గింపు, ప్రారంభ ధర రూ.6,499 షియోమి మి5- రూ.5,000వరకు తగ్గింపు, ప్రస్తుత ధర రూ.19,999, ఎక్స్చేంజ్ ఆఫర్ పై రూ.18,300 వరకు తగ్గింపు మోటోరోలా... మోటోరోలా మోటో ఎక్స్ ప్లే 32జీబీ ఫోన్ ఫ్లాట్పై రూ.4,000 తగ్గింపు, ఎక్స్చేంజ్పై రూ.12,000వరకు తగ్గింపు, ప్రస్తుత ధర రూ.14,999 మోటో ఈ3 వపర్ - ఈఎంఐ ధరలు లేకపోవడం, ఎక్స్చేంజ్పై రూ.7,000 వరకు తగ్గింపు మోటోరోలా మోటోజీ టర్బో ఎడిషన్, 16జీబీ, ప్రస్తుత ధర రూ.9,999, ఎక్స్చేంజ్పై రూ.8,000 తగ్గింపు -
నాలుగు వేరియంట్లలో లీఎకో కొత్త ఫోన్
ముందస్తు అంచనాల మాదిరిగా గానే చైనీస్ టెక్నాలజీ సంస్థ లీఎకో, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. లీ ప్రో 3 పేరుతో ఈ ఫోన్ను ముందుగా స్వదేశంలో లాంచ్ చేసింది. వచ్చే వారం నుంచి ప్రారంభంకాబోతున్న ఫ్లాష్ అమ్మకాలకు ఆసక్తి గల వినియోగదారులు ఇప్పటినుంచే రిజిస్ట్రర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. ఒకటి 4 జీబీ ర్యామ్+32 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వెర్షన్, 1,799 యువాన్లు (సుమారు 18,100 రూపాయలు) రెండు 6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వెర్షన్, 1,999 యువాన్లు (సుమారు రూ.20,100 రూపాయలు) ప్రముఖ చైనీస్ ఫిల్మ్మేకర్ జాంగ్ ఇమౌ పేరుమీద మరో రెండు వేరియంట్లను లీఎకో లీ ప్రో 3 ఫోన్ను ప్రవేశపెట్టింది. దానిలో ఒకటి 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ జాంగ్ ఇమౌ ఎడిషన్, ధర 2,499 యువాన్లు(సుమారు రూ.25,100). రెండోది 6 జీబీ ర్యామ్+128 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వెర్షన్ను ధర 2,999 యువాన్ల(సుమారు రూ.30,100)కు కంపెనీ ఆవిష్కరించింది. మెమరీ, ఇన్బిల్ట్ స్టోరేజ్ తేడాలు మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ వేరియంట్లలో సమానంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అయితే 8 జీబీ ర్యామ్ వేరియంట్తో ఈ ఫోన్ను లీఎకో తీసుకొస్తుందని టెక్ వర్గాలు భావించాయి. కానీ 6జీబీ ర్యామ్లో మాత్రమే ఈ ఫోన్ను కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే దీనిలో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని విస్తరించుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించలేదు. రియర్ ప్యానెల్లో ఫింగర్ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్ కలిగిఉంది. ఈ ఫోన్ ఫీచర్లు.. 5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 2.35 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 821 ఎస్ఓసీ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 4జీ ఎల్టీఈ 4070 ఎంఏహెచ్ బ్యాటరీ 175 గ్రాములు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement