breaking news
lbnagar Circle
-
LBnagar Metro: ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ ఫుల్.. కిలోమీటర్ క్యూ
సాక్షి, ఎల్బీనగర్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్(LbNagar Metro) వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా తర్వాత సొంతూళ్ల నుంచి అందరూ సిటీకి చేరుకున్నారు. అనంతరం, ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా సందడి నెలకొంది.అయితే, ఒక్కసారిగా మెట్రో వద్దకు ప్రయాణికులు చేరుకోవడంతో టికెట్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో మెట్రో రైలు సిబ్బంది.. ప్రయాణికులను క్యూ పద్దతిలో పంపిస్తున్నారు . ఈ క్రమంలో కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి ఉంది. క్యూలైన్ల నుంచి ప్లాట్ఫామ్కు చేరుకోడానికి దాదాపు రెండు గంటలు పడుతోంది. ఈ కారణంగా మెట్రో సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Shameless @HyderabadMetroR #LT @hydcitypolice@HYDTP@CPHydCity@ZC_LBNagar@lbnagarps@TheSiasatDaily@TimesNowNo proper security management to maintain the crowd. #Stampede at #LBNagar #MetroStationl pic.twitter.com/cr9OJNk53N— Citizen's Right (@citizensri8) October 6, 2025మరోవైపు.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా రెండో రోజూ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగర బాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది.Huge traffic today too!People are returning to the city after the Bathukamma and Dussehra festivals, leading to huge traffic jams at Choutuppal on the National Highway. Large number of passengers are lined up at LB Nagar station as they travel back into the city. pic.twitter.com/DaBC4pjoo0— Revanth Chithaluri (@RevanthCh_) October 6, 2025ఇక, పంతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్బీనగర్ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. చింతలకుంట పైవంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్జామ్ కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.Roads jammed, metro crammed#MondayMood #hyderabadmetro #traffic pic.twitter.com/83cxsfdy2Z— Kruthivarsh Koduru (@Kruthiivarsh) October 6, 2025 -
వివాదానికి దారితీసిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు
నాగోలు: ఎల్బీనగర్ సర్కిల్లో శనివారం రాత్రి చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ ట్రాఫిక్ పోలీసులకు సవాలుగా మారింది. ఓ పక్క మందుబాబుల వీరంగం, మరోపక్క పోలీసుల తనిఖీలతో కామినేని చౌరస్తా రణరంగంగా మారింది. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు కామినేని సమీపంలో ఉన్న ఓ బార్, వైన్స్ సమీపంలోనే తనిఖీలు చేపట్టడంతో వివాదం చోటు చేసుకుంది. వైన్స్, బార్ నుంచి వచ్చిన వారిని డ్రంకన్ డ్రైవ్లో బుక్ చేశారు. దీంతో మందుబాబులు పోలీసులపై తిరగబడ్డారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికంగా మద్యం తాగిన వారిని డ్రంకన్ డ్రైవ్ కింద కేసులు బుక్ చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బార్లో మద్యం తాగి బయటకు రాగానే.. వాహనాలు నడపకుండానే జరిమానాలు విధించి కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు మందుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. వివాదం పెద్దది కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఎల్బీనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు మందుబాబులను అరెస్ట్ చేశారు.