-
దారిద్య్రాన్ని తొలగించే పూర్ణవల్లీ తాయారు
పూర్ణవల్లీదేవినే పూర్ణవల్లీ తాయారు. ఆమె దరిద్రాన్నీ ఆకలినీ కరువునీ రూపుమాపే తల్లి. తమిళనాడులోని ఉత్తమ కోవెలలో ఈ దేవి కొలువై ఉంది. ఈమె లక్ష్మీదేవి అవతారం. బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకున్న మహాదేవుడు తాను ఖండించిన బ్రహ్మ తలను భిక్షాపాత్రగా చేసుకుని బ్రహ్మహత్యాపాతకం నుండీ బైటపడటానికి భిక్షను యాచించాడు. ఆ పాత్రలో ఎవరెంత భిక్షేసినా మరుక్షణం ఆ పాత్ర మాయమైపోయేది. తన పాపాన్ని పోగొట్టుకోవడానికి పరమశివుడు పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ, ఉత్తమర్ కోవెలకు వచ్చాడు. అక్కడ లక్ష్మీదేవి ఆ పాత్రను నింపింది. కానీ ఆశ్చర్యంగా ఆ పాత్ర మాయమవలేదు. పరమేశ్వరునికే ఆమె భిక్ష వేసి ఆయనను బ్రహ్మ హత్యాపాతకం నుండి విముక్తుణ్ని చేసింది పూర్ణవల్లీ దేవి. అందుకే ఆ ప్రాంతాన్ని భిక్షాంధర కోవెల (బిచ్చందర్ కొయెల్) అంటారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు పురుషోత్తమునిగా దర్శనమిస్తాడు. -
వివాహిత ఆత్మహత్య
ముదిగుబ్బ: చిన్నకోట్లకు చెందిన లక్ష్మీదేవి (28)అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు దంపతులు ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటూ మగ్గం పనులు చేసుకునేవారు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న లక్ష్మీదేవి ఇటీవల పుట్టినిల్లు అయిన ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు వచ్చింది. ఆదివారం కడుపునొప్పి భరించలేక ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్ఐ రహీం కేసు నమోదు చేసుకున్నారు. -
క్షణికావేశానికి నిండు ప్రాణాలు బలి
- ప్రేమ విఫలమైందని యువకుడు.. - సంతానం కలగలేదని వివాహిత - నగరంలో వేర్వేరు చోట్ల ఆత్మహత్య అనంతపురం సెంట్రల్: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిండు నూరేళ్లు గడపాల్సిన జీవితాలు పాతికేళ్లు కాగానే అర్ధంతరంగా ఆగిపోయాయి. నగరంలో వేర్వేరు చోట్ల ఓ వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...కళ్యాణదుర్గం రోడ్డులోని గణేష్నగర్లో నివాసముంటున్న లక్ష్మీదేవి (24), రవికుమార్ దంపతులు. పెళ్లయ్యి ఐదేళ్లయినా సంతానం కలగకపోవడంతో మనస్తాపానికి గురైన లక్ష్మీదేవి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. టూటౌన్ ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరిలించారు. లాడ్జిలో యువకుడు ధర్మవరం పట్టణంలో శాంతినగర్లో నివాసముంటున్న నాగభూషణం కుమారుడు పరమేష్(24) బీటెక్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగాన్వేషణలో భాగంగా రెండు రోజుల క్రితం అనంతపురం వచ్చాడు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని లాడ్జిలో రూం అద్దెకుతతీసుకున్నాడు. అదే రోజు రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఉద్యోగం రాకపోవడంతో పాటు ప్రేమలో కూడా విఫలమవడంతో మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. త్రీటౌన్ ఎస్ఐ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
చిలమత్తూరు: చిన్నపల్లికి చెందిన ఎరికల లక్ష్మీదేవి (45) అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. స్థానికులు, ఎస్ఐ జమాల్బాషా తెలిపిన మేరకు.. ఎరికల రామకృష్ణ భార్య ఎరికల లక్ష్మీదేవికి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. గ్రామాల్లో సంచరిస్తుండేది. శనివారం సాయంత్రం చిన్నన్నపల్లి నుంచి జాతీయ రహదారి దాటి కాలి నడకను దిగువపల్లి తండా వైపు బయల్దేరింది. ఆదివారం ఉదయం లేపాక్షి హబ్ కార్యాలయం వెనుక బావిలో శవమై తేలింది. ఆమె వద్దనున్న సెల్కు కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. గొర్రెల కాపరి లిఫ్ట్ చేసి.. బావిలో శవం తేలియాడుతోందని సమాచారం అందించాడు. హుటాహుటిన వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందిందా.. లేక ఆత్మహత్య చేసుకుందా అనేది తెలియడం లేదు. ఎస్ఐ జమాల్బాషా కేసు నమోదు చేసుకున్నారు. -
వివాహిత దారుణ హత్య
శెట్టూరు (కళ్యాణదుర్గం) : భర్త చేతిలో భార్య దారుణహత్యకు గురైంది. మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శెట్టూరు మండలం బుడ్డయ్యదొడ్డిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. హతురాలి తల్లిదండ్రులు గొల్ల బసమ్మ, వీరనాగప్ప, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుడ్డయ్యదొడ్డికి చెందిన గొల్ల లక్ష్మీదేవి (32)కి 14 ఏళ్ల కిందట కళ్యాణదుర్గం మండలం ముదిగల్లుకు చెందిన ధనుంజయతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. మూడేళ్ల కిందట వీరు బుడ్డయ్యదొడ్డికి వచ్చి వేరుగా కాపురం ఉంటున్నారు. సమీపంలోని కర్ణాటక ప్రాంతంలో గల ఒక డాబాలో ధనుంజయ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్ని రోజులుగా ఇతను మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి డబ్బు ఇవ్వాలని భార్యతో తరచూ గొడవపడేవాడు. తాగొచ్చాక వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా డబ్బు విషయంలో గొడవపడ్డాడు. ఆమె డబ్బు ఇవ్వకపోవడంతో బయటకెళ్లిపోయి పూటుగా మద్యం తాగి వచ్చిన ధనుంజయ.. అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న భార్య లక్ష్మీదేవి తలపై బండరాయి వేసి పరారయ్యాడు. తల్లి అరుపులు విన్న కుమారుడు అజయ్ (12), కుమార్తె గాయత్రి (10) ఉలిక్కిపడి లేచారు. రక్తపుమడుగులో పడిఉన్న తల్లిని చూసి ఏడుస్తుండటంతో బంధువులు, ఇరుగుపొరుగువారు వచ్చి హుటాహుటిన కళ్యానదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే లక్ష్మీదేవి మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రికి వెళ్లిన అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్న పిల్లలు.. ఇక అమ్మ తిరిగిరాదని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. బుధవారం సాయంత్రం సీఐ శివప్రసాద్, ఎస్ఐ శ్రీకాంత్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, స్థానికులను విచారణ చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement