-
ఉన్నతాధికారులపై ఉద్యమం ఒత్తిడి
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభుత్వ ఉన్నతాధికారులపై వత్తిడి పెంచుతోంది. నిన్నటి వరకు ఎస్ బాస్ అన్న దిగువశ్రేణి ఉద్యోగులే ఇప్పుడు సమైక్యాంధ్ర జేఏసీగా ఏర్పడి సమ్మెబాట పట్టాల్సిందిగా ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమైక్య ఉద్యమానికి నడుంకట్టిన సంగతి తెలిసిందే. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం సమ్మె పేరుతో ఎటువంటి పనులు చక్కబెట్టకుండానే తమ కార్యాయాల్లో కాల క్షేపం చేస్తున్నారు. పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం సమైక్యాంధ్ర ఉద్యమానకి కలిసి రావాలని రెండు రోజుల క్రితం ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యం లో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ సమావేశం జరిగే సమయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ వెళ్లి సమ్మెకు రావాలని ఉన్నతాధికారులను కోరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాలో ఉన్నతాధికారుల్లో ఉద్యమంపై ఏకాభిప్రాయం కుదరడంలేదని సమాచారం. ఉద్యమానికి మద్దతుగా సమ్మె బాట పట్టాలని కొందరంటే, సంఘీభావం ప్రకటిస్తే చాలని ఇంకొందరు, ఈ నెల 7న హైదరాబాద్లో జరిగే ఉద్యోగ సదస్సుకు మద్దతు పలకాలని ఇంకొందరు ఇలా ఎవరికి తోచినట్టు వారు నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది. పలు శాఖలకు జిల్లా అధిపతులుగా ఉన్నందున ఉద్యమబాట పడితే ఎలా అంటూ మరికొందరు అధికారులు అధికార పార్టీకి విశ్వాసపాత్రులుగా గుర్తింపుపొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం. సమావేశం గురించి తెలుసుకున్న ఎస్సీ జె.ప్రభాకరరావు ఉద్యోగుల మధ్య గొడవలు జరగకుండా చూసేందుకు మహారాష్ట్రకు చెందిన స్పెషల్ (సీఆర్పీఎఫ్) పోలీసులను కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం మోహరిం చారు. సమ్మెకు వెళ్లేందుకు ససెమిరా అంటున్న ఉన్నతాధికారులు, సమైక్య ఉద్యమానికి బాసటగా ఉండాలని కోరుతున్న దిగువస్థాయి ఉద్యోగుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇబ్బందులు తప్పవనుకున్న ఉన్నతాధికారులు మచిలీపట్నంలో కాకుండా విజయవాడలో తమ విధులు నిర్వర్తించేందుకు తరలివెళ్లినట్టు సమాచారం. ఉద్యోగుల వివాదాలకు అవకాశం ఉందని భావించిన ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ఇందిరా క్రాంతి పథం(మెప్మా) డెరైక్టర్ వీడియో కాన్ఫరెన్స్ను విజయవాడకు ఆఘమేఘాలపై మార్పు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఉపాధ్యాయులు బహిష్కరించారు. దీంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఉపాధ్యాయులు ఆయా ఆందోళన కార్యక్రమల్లోన్లే ప్రత్యేకంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరిం చడం విశేషం. బందరులో సమైక్య వాదులు నిర్వహించిన గురుపూజోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, మాదివాడ రాము తదితర వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
ధర్మఘోష
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్లైన్ : రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ‘అనంత’లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 34వ రోజైన సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం జోరుగా కొనసాగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో వందలాది మంది ఉపాధ్యాయులు గొడుగులు పట్టుకుని నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఎంఐఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలు మెడలో తగిలించుకుని ప్రదర్శన చేశారు. ఎన్జీవో, మెడికల్ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుల సంఘాల జేఏసీ, వాణిజ్య పన్నులశాఖ, మున్సిపల్ జేఏసీ, పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యుత్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. డ్వామా ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్కేయూలో విద్యార్థి, ఉద్యోగ జేఏసీ రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సోనియాగాంధీ, షిండే దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ధర్మవరంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. వేలాది మంది సమైక్యవాదుల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కారు. బత్తలపల్లి, ముదిగుబ్బలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పొట్టిశ్రీరాములు సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. న్యాయవాదులు, ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పామిడిలో వైద్య సిబ్బంది వినూత్న నిరసన తెలిపారు. హిందూపురంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ వేషధారణలతో ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు ర్యాలీ, మానవహారం ఏర్పాటు చేశారు. చిలమత్తూరులో పూసల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, వంటావార్పు చేపట్టారు. ఆదర్శ రైతులు రిలే దీక్షలకు దిగారు. లేపాక్షిలో సమైక్యవాదులు పాండురంగ భజన చేశారు. కదిరి పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో అమడగూరు మండలం మహమ్మదాబాద్ హైస్కూల్ ఉపాధ్యాయులు రిలే దీక్ష చేశారు. కదిరి డివిజన్ జర్నలిస్టులు క్రైస్తవ మత సంప్రదాయ పద్ధతిలో శవపేటికలో సోనియా దిష్టిబొమ్మ ఊరేగించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నేత జక్కల ఆదిశేషు చేపట్టిన పాదయాత్ర ఎన్పీకుంటకు చేరింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2-కే రన్లో వేలాది మంది సమైక్యవాదులు పాల్గొన్నారు. మడకశిరలో దేవుళ్ల చిత్రపటాలతో నిరసన ప్రదర్శన చేశారు. అమరాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఓడీ చెరువులో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. కొత్తచెరువులో రెడ్డ్డి సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు, పుట్టపర్తిలో అంగన్వాడీ మహిళలు రిలే దీక్షలు చేశారు. పెనుకొండలో కార్మికులు నిరసన ప్రదర్శన, ఉపాధ్యాయులు భిక్షాటన చేశారు. గోరంట్లలో విశ్వబ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. రాయదుర్గంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, శాంతి హోమం చేశారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో డిప్యూటీ తహశీల్దార్, డీలర్లు పాల్గొన్నారు. వివిధ సంఘాల రిలే దీక్షలకు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో రజకులు ర్యాలీ చేశారు. శింగనమల, నార్పల, గార్లదిన్నెలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో కళాశాల ఉద్యోగుల ర్యాలీలో ఎమ్మెల్యే జేసీ దివాకర్రెడ్డి పాల్గొన్నారు. విభజన అనివార్యమైతే... రాయల తెలంగాణ కోరుకోవడం తప్పుకాదని ఆయన అన్నారు. ఇదే పట్టణంలో మున్సిపల్, జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఉరవకొండలో నిరసన కార్యక్రమాలు జోరుగా కొనసాగాయి. దళిత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. -
ఉయ్యూరులో లక్ష గళ ఘోష విజయవంతం
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర ఉద్యమం 32వ రోజూ ఉధృతంగా సాగింది. శనివారం వినూత్న పద్ధతుల్లో సమైక్యవాదులు తమ నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన ప్రతిపాదన వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తామని నొక్కివక్కాణించారు. ఉయ్యూరులో నిర్వహించిన లక్ష గళ ఘోష కార్యక్రమం విజయవంతమైంది. వేలాదిగా హాజరైన ప్రజలతో ఉయ్యూరు జన సంద్రమైంది. సంపూర్ణ బంద్ విజయవంతమైంది. తిరువూరులో సమైక్య జనగళఘోష నిర్వహించారు. పెద్ద ఎత్తున సమైక్యవాదులు రోడ్డుపైకి వచ్చి రాష్ట్రం ఐక్యంగా ఉండాలని నినదించారు. కార్యాలయాలు, దుకాణాలు బంద్ చేశారు. కైకలూరులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో గళ ఘోష కార్యక్రమం జరిగింది. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవోలు చేస్తున్న రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. రేషన్ డీలర్లు దీక్షలు చేపట్టారు. కలిదిండి మండలంలో రోడ్డుపై వీఆర్వోలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. మండవల్లిలో బంద్ నిర్వహించి రోడ్లపై ఆటలు ఆడారు. రాష్ట్ర విభజన జరిగితే అభివృద్ధి కుంటుపడుతుందంటూ నూజీవీడులో విద్యార్థులు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగాయి. జగ్గయ్యపేటలో రేషన్ డీలర్లు దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ నాయకులు భిక్షాటన చేశారు. రాష్ట్ర విభజన జరిగితే తాము భిక్షాటనే చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలోని తెలుగు తల్లి సెంటర్లో ఆరువేల మందితో ప్రదర్శన నిర్వహించి సమైక్య గర్జన చేశారు. ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. జి.కొండూరు మండలం దుగ్గిరాలపాడులో గ్రామస్తులు ప్రధాన రహదారిపై వంటావార్పు నిర్వహించారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ మహిళా వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఉండమ్మా బొట్టుపెడతా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో 108 మందితో లలితా సహస్రనామ కార్యక్రమం జరిగింది. జననేత జగన్కు మద్దతుగా.. రాష్ట్ర విభజన చేయకూడదంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేస్తున్న నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలువురు నాయకులు, కార్యకర్తలు దీక్షలు కొనసాగిస్తున్నారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావు, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావుల నాలుగోరోజు దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. వారిని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంగవీటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో 10 మంది బందరు రోడ్డుపై రిలే నిరాహారదీక్షలు నిర్వహించగా, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ వారిని పరామర్శించారు. సాయంత్రం రాధాకృష్ణ నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఏడో రోజు కొనసాగాయి. నూజివీడులో ఐదోరోజు రిలేదీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. గుడివాడలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ పేరిట పూజలు నిర్వహించి, 101 కొబ్బరికాయలు కొట్టారు. -
చంద్రబాబువే చీకటి ఒప్పందాలు : కల్పన
పామర్రు రూరల్, న్యూస్లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబువన్నీ చీకటి ఒప్పందాలేనని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన విమర్శించారు. రాత్రివేళ కేంద్రమంత్రి చిదంబరాన్ని కలుస్తూ, పగటివేళ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్షను బలవంతంగా భగ్నం చేసినంత మాత్రాన రాష్ట్ర విభజనపై తమ పార్టీ అభిప్రాయం, నిర్ణయంలో మార్పు ఉండదనే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ జైలులోనే జననేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దీక్ష చేపట్టారని తెలిపారు. ఆయన దీక్షపై ఎల్లో మీడియా దుష్ర్పచారారం చేస్తోందని విమర్శించారు. విజయమ్మ, జగన్మోహన్రెడ్డి దీక్షలను విమర్శించే అర్హత రెండుకళ్ల సిద్ధాంతం ప్రదర్శించే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలకు లేదని ఎద్దేవాచేశారు. వర్లా... నిజాలు తెలుసుకుని మాట్లాడు వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, భారతి బెంగళురు నుంచి ఢిల్లీకి వెళ్లారని విమర్శించిన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యపై కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు. వారు ఢిల్లీ వెళ్లడం చూశావా అని ప్రశ్నించారు. నిజమైన సమైక్యవాదివి అయితే రాష్ట్ర విభజన వద్దంటూ చంద్రబాబుతో ప్రకటన చేయించాలని వర్లను డిమాండ్చేశారు. విజయమ్మ, జగన్మోహన్రెడ్డి, షర్మిలపై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. వర్లరామయ్య జిల్లాలో ఉద్యోగం చేసిన సమయంలో ఎంతటి నీతి, నిజాయితీగా వ్యవహరించారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవాచేశారు. విజయమ్మపై విమర్శలుచేసిన మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్పై ఆగ్రహం వ్యక్తంచేశార. దొంగనాటకాలు మానుకోవాలని హితవు పలికారు. పామర్రు ఉపసర్పంచి ఆరేపల్లి శ్రీనివాసరావు, పీఏసీఎస్ డెరైక్టర్ మోరా రాజారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు ముత్తేవి ప్రసాద్, కుంపటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతటా రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం శనివారం తీవ్ర రూపం దాల్చింది. పట్టణం, పల్లె తేడా లేకుండా హోరెత్తిపోయింది. పాతిక రోజులవుతున్నా ఉద్యమకారుల దీక్ష సడలడం లేదు. మరో వైపు గుంటూరులోని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేసినందుకు నిరసనగా జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు పలు చోట్ల బంద్ నిర్వహించాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు దిగుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులూ దీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెదబయలు మండల కేంద్రంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులు మూడు కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ మూడు రోడ్ల కూడలిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు థింసా నృత్యం చేశారు. ఉపాధ్యాయ జేఏసీ నర్సీపట్నంలో నిర్వహించిన నమూనా అసెంబ్లీ ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెట్ల ఉమాశంకర గణేష్ తదితర నేతల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు ఇందులో పాల్గొన్నారు. ఎన్నడూ లేని రీతిలో అనకాపల్లి పట్టణాన్ని ఆందోళనకారులు దిగ్బంధించారు. పట్టణంలోకి ప్రవేశించే అన్ని రహదారుల్లోనూ రాళ్లు, వాహానాలను అడ్డంగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగానే షాపులు మూసేశారు. పట్టణమంతా బోసిపోయింది. అత్యవసర సేవలయిన మందుల దుకాణాలు, ఆస్పత్రులకు మాత్రం వెసులుబాటు కల్పించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సాగిన ఆందోళనకు స్టూడెంట్ జేఏసీ, ఎన్జీవోలు నేతృత్వం వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. వైఎస్సార్సీపీ నేతలు బంద్ నిర్వహించారు. ఉపాధ్యాయ, న్యాయవాదుల సంఘాలతో పాటు వైఎస్సార్సీపీ నేతల దీక్షలు కొనసాగుతున్నాయి. పాడేరు పాత బస్టాండ్లో ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గిరిజన సంక్షేమశాఖ డీడీ మల్లికార్జునరెడ్డి వారికి మద్దతు తెలిపారు. విజయమ్మ దీక్ష భగ్నానికి నిరసనగా పాడేరులో వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు వంజంగి కాంతమ్మ, సత్యవేణి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిపారు. లగిశపల్లి నుంచి పాడేరు వరకు టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏయూలో విద్యార్థి ఐక్య ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద కేంద్రమంత్రి చిరంజీవి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పౌరసరఫరాల శాఖ సిబ్బంది బీచ్రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాయకరావుపేటలో విద్యుత్ జేఏసీ రాస్తారోకో నిర్వహించారు. నక్కపల్లిలో మోకాళ్ల ప్రదర్శన ద్వారా ఉద్యమ కారులు తమ నిరసన వ్యక్తం చేశారు. చోడవరంలో మానవహారాలు, నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చోడవరం వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కశింకోట జాతీయ రహదారిపై నిరసన జ్వాలలు మిన్నంటాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement