-
కొండగట్టు ప్రమాదం వెలికితీసిన బస్సు
-
కొండగట్టు బస్సు ప్రమాదం.. కారణాలు ఇవే!
సాక్షి, జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 62కు చేరింది. ఈ ఘటనలో మరో 38 మంది కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. కారణాలు ఇవే.. కొండగట్టు ఘాట్రోడ్డు లోయలో పడిన ఆర్టీసీ బస్సును అధికారులు గురువారం వెలికితీశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసిన అధికారులు.. ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు. ఆర్టీసీ బస్సు కండిషన్లో లేకపోవడం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. 2007 మోడల్కు చెందిన ఆర్టీసీ బస్సు జీవితకాలంలో 12 లక్షల కిలోమీటర్లు తిరగాల్సి ఉండగా.. ప్రమాదానికి గురైన బస్సు మాత్రం 14 లక్షల 95 వేల 116 కిలో మీటర్లు తిరిగిందని గుర్తించారు. 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత బస్సును స్క్రాప్ (తుక్కు) కింద భావించి పక్కకు పడేయాలని, కానీ, స్క్రాప్గా భావించే బస్సును జగిత్యాల- శనివారంపేట రూటులో ఆర్టీసీ అధికారులు నడపడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెగ్యులర్ బస్సు, రెగ్యులర్ డ్రైవర్ అయినప్పటికీ కాలం చెల్లిన వాహనం కావడం.. ఘాట్రోడ్డులో సరిగ్గా బ్రేక్ వేయడానికి వీలుపడకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణ అధికారులు భావిస్తున్నారు. విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ సరిగా లేకపోవడం, బ్రేక్ రాకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉండడం ఈ మహా విషాదానికి కారణమని వారు ప్రాథమికంగా తేల్చినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగానూ సహాయం అందజేస్తాం కరీంనగర్లో చికిత్స పొందుతున్న 36మందిని మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ గురువారం పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా రూ. ఐదు లక్షలు, ఆర్టీసీ పరంగా రూ. 3 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని మంత్రి ఈటల తెలిపారు. గాయపడ్డవారికి రెండున్నర లక్షల చొప్పున సహాయం అందిస్తామన్నారు. వారు పూర్తిగా కోలుకునే వరకూ ప్రభుత్వపరంగా వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో తొమ్మిది మందికి రైతు బంధు జీవిత భీమా వర్తిస్తుందని, ఇక, పార్టీ సభ్యత్వం ఉన్న వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. రైతుబంధు, పార్టీ సభ్యత్వం వర్తించని వారికి టీఆర్ఎస్ పార్టీపరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. -
ఫిట్నెస్ లేకుంటే సీజ్
డీటీసీ చంద్రశేఖర్గౌడ్ మామునూరు : ఫిట్నెస్లేని ప్రైవేటు పాఠశాల, కళా శాల బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని ప్రాంతీయ రవాణ శాఖ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు. బుధవారం వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేని, ఫిట్నెస్ లేని వాహనాలల్లో విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదాలకు తావివ్వకుండా గురువారం(12వ తేదీ) నుంచి నెలరోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామ న్నారు. టాటా ఏస్, ఆటోరిక్షాల్లో పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు త రలించే వాహనాలను సీజ్చేయడమే కాకుండా డ్రైవర్ లెసైన్స్ సైతం రద్దుచేస్తామని చెప్పారు. పాఠశాలలకు బస్సుల్లో పిల్లలను ఎంత మందిని తరలిస్తున్నారు, ఎంతమేరకు పిల్లలుకు రక్షణలో ఉన్నారో మందుగానే తల్లిదండ్రులు గమనించాలని, ఆటోరిక్షాలో పిల్లలను బడికి పంపకుండా జగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల మొదటి సోమవారం వాహనాదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామని తెలిపారు. టీ ఎస్ సిరీస్ ఉత్తర్వులు విడుదల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలోని అన్ని రకాల వాహనాలకు టీఎస్ సిరీస్ను ఆమలు చేయాలని బుధవారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు విడుదల చేసినట్లు డీటీసీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో లోగోతో కూడిన టీఎస్ సిరీస్ను జిల్లాలో ఆమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. స్లైడింగ్లో బుక్ చేసుకున్న ప్రతి వాహనానికి టీఎస్ నంబర్ ప్లేట్ విడుదల చేస్తామని వెలడించారు. కొత్త వాహనాలకు కొత్త నంబర్లు రానున్నాయని, పాత వాహనాలకు నంబర్లు యధావిధిగా కొనసాగుతాయని పేర్కొ న్నారు. 2013-214 వార్షిక బడ్జెట్లో రూ.106కోట్ల ఆదాయం నిర్దేశించగా రూ.85కోట్ల మేరకు సాధించామన్నారు. లైఫ్ టాక్స్ జూన్1లోపు కట్టిన వాహనాలన్నింటికీ ఉమ్మడి రాష్ట్రాల్లో చెల్లుబాటు ఉంటుందని తెలిపారు. పర్మిట్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వాహనాలు తీరిగేందుకు అభ్యంతరాలు ఉండవన్నారు. సమావేశంలో ఆర్టీఓ మాధవరావు, సీనియర్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement