-
వారు కలిస్తేనే హోదా సాధ్యం: రామకృష్ణ
సాక్షి, వైఎస్సార్ కడప: రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కె.రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తమ పార్టీ 2015లోనే తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మానేసి ప్రధాని నరేంద్ర మోదీపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై అన్ని సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ‘ప్రత్యేక హోదా’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తెలిసేలా ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. కడపలో సోమవారం జరిగిన 26వ సీపీఐ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక అనంతరం పలు ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు చర్చించారు. -
చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం
కర్నూలు, కల్లూరు (రూరల్): టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. బుధవారం నగరంలోని దేవి ఫంక్షన్హాలులో సీపీఐ 22వ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం డబ్బున్న కోటీశ్వరులకు మాత్రమే దక్కుతుందన్నారు. జన్మభూమి కమిటీ నేతలు.. చనిపోయిన వారి పింఛన్లు కూడా వదలడం లేదన్నారు. నీతి మాలిన రాజకీయాలు చేస్తూ సంతలో పశువులను మాదిరిగా ఎమ్మెల్యేలను కొంటుండటం సిగ్గుచేటన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల నిధులు వృథా చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎన్నికల హామీలను ప్రధాని నరేంద్రమోదీ విస్మరించారన్నారు. కేంద్రం బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం∙చేపట్టనున్న రాష్ట్రబంద్ను జయప్రదం చేయాలని కోరారు. బంద్కు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ మద్దతు పలకడం సంతోషకరమన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా బంద్లో పాల్గొనాలని హితవు పలికారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంతవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. అంతకుముందు పార్టీ జెండా ఎగుర వేసి, మృతవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంగీత దర్శకుడు ఖుద్దూస్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి వి.నాగరాజు బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.జె.చంద్రశేఖర్రావు, సీనియర్ నాయకుడు ఎన్.మనోహర్ మాణిక్యం, రాష్ట్ర సమితి సభ్యుడు పి.భీమలింగప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జగన్నాథం, జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్బాబు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమం పట్టని చంద్రబాబు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజం అనంతపురం అర్బన్: కరువుతో రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆయనకు నంద్యాల ఉప ఎన్నిక తప్పితే మరేమీ కనిపించడం లేదన్నారు. సోమవారం ఆయన అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీష్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని.. ఈ ఏడాది మరింత దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 26 శాతం పంటలు మాత్రమే సాగయ్యాయన్నారు. అయితే రైతులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తుంగభద్రకు నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని.. ఈ ఏడాది తాగునీటికి కూడా అవస్థలు తప్పేలా లేవన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజనులు, దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గరగపర్రు, దొండపాడు, దేవరపల్లి ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. దళితులపై దాడులకు నిరసనగా ఢిలీల్లో ఆందోళన చేపడతామన్నారు. ఈనెల 16న పది వామపక్ష పార్టీల నాయకులు దేవరపల్లి, దొండపాడులో పర్యటించి దళితుల్లో ఆత్మస్థైర్యం నింపనున్నట్లు చెప్పారు. త్వరలోనే కరువు పర్యటన నిర్వహించి ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగిస్తామన్నారు. -
చైతన్యంతోనే బడుగులకు రాజ్యాధికారం
- బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటున్న టీడీపీ - సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ - ముగిసిన ప్రజా చైతన్య బస్సు యాత్ర అనంతపురం న్యూటౌన్ : తెలుగుదేశం ప్రభుత్వ ప్రజాకంటక విధానాలపై ఉద్యమిస్తామని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సమస్యలపై చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపు సభ శనివారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వేదిక జిల్లా కన్వీనర్ జగదీష్ అధ్యక్షతన నిర్వహించారు. సభలో రామకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను టీడీపీ పావులుగా ఉపయోగించుకుంటోందన్నారు. మంత్రి వర్గంలో ఎస్టీలు, ముస్లింలకు చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయా వర్గాల వారిని మంత్రి వర్గంలోకి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు చైతన్యంతో ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై పూర్తి నిర్లక్ష్య ధోరణిలో ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన అజెండాను అమలు చేయడానికి అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అదేవి«ధంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అధ్యక్షులు రమేష్ గౌడ్, సామాజిక హక్కుల వేదిక నాయకులు సత్యనారాయణమూర్తి, మైనార్టీ నాయకులు డాక్టర్ మైనుద్దీన్, జాఫర్, బీసీ సంఘం నాగభూషణం తదితరులు బీసీ, ఎస్సీలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆకట్టుకున్న ‘వందేమాతరం’ ముగింపు సభకు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ‘వందేమాతర గీతం’ సభికులను అమితంగా ఆకట్టుకుంది. అలాగే ప్రజా నాట్యమండలి కళాకారులు, ప్రాచీన కళారూపాల ప్రదర్శనలతో, ఆటపాటలతో పలు చైతన్య గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు. అంతకుముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సామాజిక హక్కుల వేదిక నేతలు ర్యాలీగా సభాస్ధలికి చేరుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రజక సంఘం నాయకులు కమ్మన్న, దేవేంద్రప్ప, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్, మహిళా సమాఖ్య నేతలు జయలక్ష్మి, దుర్గాభవానీ, కురుబ సంఘం బోరంపల్లి ఆంజనేయులు, బంజారా నేతలు కైలాష్నాయక్, ముస్లిం మైనార్టీ నాయకులు ఇమామ్, బాషా తదితరులు పాల్గొన్నారు. -
‘భూనిర్వాసితులకు ఉద్యోగం కల్పించాలి’
నంబులపూలకుంట : మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్హబ్లో భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని నాగులకట్ట వద్ద బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్లో ఉండే చిన్నపాటి ఉద్యోగాలను సైతం ఇతర ప్రాంతాల వారికి ఇస్తే ఇక్కడ ఉన్న యువకులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే రైతులతో కలిసి పోరాటం చేయడానికైనా తాము సిద్ధమన్నారు. డీసీఎంఎస్ డైరెక్టర్ టి.జగదీశ్వర్రెడ్డి మాట్లాడారు. కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్య యాదవ్, మండల కార్యదర్శి అమీర్బాషా, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement