breaking news
konidala chiranjeevi
-
‘సేవ’కు సత్కారం
మున్నెన్నడూ ఎరుగని రోగమది. కనీ విని ఎరుగని రీతిలో కష్టాలను, నష్టాలను చవిచూపిస్తున్న కరవు కాలమిది. ఒకవైపు బతుకు బండి సాగేదెలా అనే బెంగ.. మరోవైపు నలువైపులా చీకట్లు ముసురుకుంటున్న వేళ కొన్ని మానవత్వపు చిరుదీపాలు వెలుగుతున్నాయి. మందేలేని వ్యాధి అంటుతుందేమోననే భయంతో చేతనైనంత సాయం చేçస్తూ వెలుగు పంచుతున్నారు. అలాంటి చిరు దీపాలకు చిరు సత్కారం అందనుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో సమాజానికి సేవ చేసిన పలువురికి ప్రముఖ సోషల్ ఆక్టివిస్ట్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కోవిడ్–19 ఫైటర్స్ అవార్డ్ ఇవ్వనున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను చూశాం. మరెన్నో ప్రాణాంతక వ్యాధులను దాటుకుని వచ్చాం. అయితే మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఒక వ్యాధి ప్రపంచాన్నే ఇంటికి పరిమితం చేయడమే కాకుండా మనిషికి మనిషికి దూరాన్ని సైతం పెంచింది. కరోనా వ్యాధి సోకి మృత్యువాత పడినవారు కొందరైతే, దాని అవస్థల నుంచి కోలుకుంటున్న వారు మరికొందరు. అయితే ఇది ప్రత్యక్ష ప్రభావం మాత్రమే... మరో వైపు పరోక్షంగా ఇది సృష్టిస్తున్న విధ్వంసం అసాధారణం. లాక్డౌన్.. ఆకలి అప్ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చేతిలో పని లేక, అవసరానికి డబ్బులు అందక, కనీసం తినడానికి తిండి దొరక్క పస్తులుంటున్న ఆకలి కడుపులెన్నో. ఈ తరుణంలో ఎన్నో ఆపన్న హస్తాలు అన్నార్తులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఉన్నంతలో సాటి వారికి చేయూత అందిస్తూ ఆదుకుంటున్నారు. ఈ కష్టకాలంలో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి నభూతో నభవిష్యత్. ముఖ్యంగా అన్నార్తులకు ఆహారం, పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. ఈ సేవలో కరోనా సోకే ప్రభావం ఉన్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక విధంగా ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ సేవ చేస్తున్నారు. ఎంతో మందికి సహాయం చేయాలని ఉన్నా లాక్డౌన్ కారణంగా బయటికి రాలేని పరిస్థితి ఉండటంతో వారందరూ సేవలో నిమగ్నమైన స్వచ్ఛంద సేవా సంస్థలకు, స్వచ్ఛంద సేవకులకు డబ్బులు పంపించి ఉదారతను చాటుకుంటున్నారు. మరికొందరు స్వయంగా ముందుకొచ్చి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ విధంగా సేవ చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి చెందిన 100 మందిని ఈ కోవిడ్–19 ఫైటర్ అవార్డ్స్తో పాటు నగదు బహుమతితో, ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించనున్నామని సంపత్ కుమార్ తెలిపారు. వీరిలో విభిన్న రకాలుగా సేవ చేసిన వారిని ఎంచుకున్నామన్నారు. సంపత్ కేరాఫ్ చారిటీ... సమాజంలో ఎవరికి ఏ అవసరమున్నా నేనున్నాను అని ముందుంటాడు సంపత్ కుమార్. అంతేకాకుండా ఇప్పటి వరకు 211 సార్లు రక్తదానం చేసి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమున్నవారికి అండగా నిలిచి రికార్డ్ సృష్టించాడు. లాక్డౌన్లో కూడా వ్యక్తిగతంగా దాదాపు 2000 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు అందించాడు. దానితో పాటు సోషల్ మీడియాలో ఎఫ్3 ఛాలెంజ్ని (ఫిడ్ ఫైవ్ ఫ్యామిలీస్) విసిరి, దాని ద్వారా పోగైన లక్ష రూపాయలతో సిటీలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందించాడు. అంతేకాకుండా ఈ క్లిష్టపరిస్థితుల్లో తలసేమియాతో బాధ పడేవారికి రక్త నిల్వల కొరత ఉండకూడదని, తన సోసల్ మీడియా ఫాలోవర్స్ ద్వారా 700 యూనిట్ల రక్తాన్ని ముందుగానే సమకూర్చాడు. దీని కోసం ప్రత్యేకంగా బ్లడ్ అంబులెన్స్ని ఏర్పాటు చేశాడు. అలాగే నగరంలో ఎవరికి రక్తం అవసరమున్నా తనకున్న ఫాలోవర్స్ ద్వారా వెంటనే అందిస్తూ అందరికి ఆదర్శంగా, ఆపద్భాందవుడిగా నిలుస్తున్నాడు. -
రక్షమాం.. పాహిమాం
ఏలూరు, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు పూనుకుని కష్టాల్లో మునిగిపోరుున కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే ఆదుకోవాలని కేంద్ర మంత్రి, పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు కొణిదల చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునే చర్యల్లో భాగంగా బస్సుయూత్ర చేపట్టిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రులు జేడీ శీలం, ఎంఎం పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి ఆదివారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. స్థానిక మర్చంట్ చాంబర్ కల్యాణ మండపం వద్ద చిరంజీవికి, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రఘువీరారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో సభ వెలవెలబోరుుంది. అతికొద్ది మంది కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు హాజరుకాగా, వారితోనే సభ నడిపించారు. చిరంజీవి అభిమానులు ‘సీఎం చిరంజీవి, జై చిరంజీవా’ అంటూ నినాదాలు చేయడంతో అలా అనొద్దని చిరంజీవి సైగలతో వారిని వారించారు. ఈ నినాదాల మధ్య సభను నడ పలేక మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా మీకిది మర్యాద కాదంటూ చిరంజీవి అభిమానులను హెచ్చరించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతుండగా, ఉంగుటూరు నుంచి వసంత్కుమార్ పోటీ చేయాలని పలువురు కేకలు వేశారు. కాంగ్రెస్కు శీల పరీక్ష కేంద్ర మంత్రులు చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ విభజన పాపం కాంగ్రెస్ది కాదని చెప్పుకొచ్చారు. దీనికి టీడీపీ సహా పలు పార్టీలు మద్దతు పలకడం వల్లే సీడబ్ల్యుసీ తీర్మానం చేసిందన్నారు. విభజన భాధాకరమని.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శీఘ్రంగా కోలుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికారు. పాతనీరు పోతే పోయిందని.. కొత్త వారికి అవకాశాలు వస్తాయన్నారు. చంద్రబాబు వలసలను ప్రోత్సహించడం.. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అందులో చేరిపోవడం వారి అనైతికతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సమైక్య చాంపియన్ అయిపోదామనుకున్న కిరణ్కుమార్రెడ్డి రాష్ట్రం విడిపోయూక కొత్తపార్టీ పెట్టి నవ్వుల పాలయ్యూరని రఘువీరా నిప్పులు చెరిగారు. బస్సు యాత్ర ద్వారా పార్టీల కుతంత్రాలను ప్రజలకు వివరిస్తున్నామని, రథయూత్ర తరహాలో సాగుతున్న దీని చక్రాల కింద ఇతర పార్టీలు నలిగిపోరుు నాశనం అవుతాయని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ శీల పరీక్ష ఎదుర్కొంటోందని, ఈ గండం నుంచి పార్టీని గట్టెక్కించి నవ్యాంధ్రప్రదేశ్ కోసం అందరూ పనిచేయాలని కోరారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర రంగాల్లో సీమాంధ్రను దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, రాష్ట్ర తాజా మాజీ మంత్రులు వట్టి వసంత్కుమార్, కొండ్రు మురళి, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయూలని కోరారు. ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గ, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఆర్కే చౌదరి, పీసీీసీ ప్రధాన కార్యదర్శి రాజనాల రామ్మోహన్రావు, అలగా రవికుమార్, బీవీ రాఘవయ్య చౌదరి, బద్దా ఆనంద్కుమార్, కమ్ముల కృష్ణ, చిట్టిబొమ్మ వెంకటస్వామి పాల్గొన్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులకు వీడ్కోలు పలికిన చిరంజీవి బస్సుయాత్ర విజయవాడకు బయల్దేరింది.