కిక్బాక్సింగ్ పోటీలకు వనపర్తి విద్యార్థులు
కిక్బాక్సింగ్ పోటీలకు వనపర్తి విద్యార్థులు
వనపర్తి: ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న వాకోఇండియా జాతీయస్థాయి కిక్బాక్సింగ్ పోటీల్లో వనపర్తికి చెందిన గొజూరియో కరాటేఅండ్ కిక్బాక్సింగ్ అకాడమి విద్యార్థులు పాల్గొననున్నారు. 85 కేజీల విభాగంలో ఎస్. ఉదయ్, 55 కేజీల విభాగంలో ఎస్. రాజశేఖర్, 45 కేజీల విభాగంలో ఎస్.వరుణ్, 60 కేజీల విభాగంలోఎ. చంద్రకుమార్ పాల్గొంటారని మాస్టర్ శేఖర్ తెలిపారు. మంగళవారం వారు వనపర్తి నుంచి బయల్దేరి వెళ్లారు.