breaking news
Khairtabad RTAs office
-
నకిలీ చిరునామాలతో రవాణా శాఖ పౌర సేవలు
సాక్షి, హైదరాబాద్: వాహన పర్మిట్ బదిలీ కోసం దాని యజమాని నుంచి రూ.40 వేలు వసూలు చేసినట్లు నగరంలోని బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారిపై కొద్దిరోజుల క్రితం ఫిర్యాదులు రావడంతో.. అతడిని అక్కడి నుంచి రవాణా కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇలా పర్మిట్ బదిలీయే కాదు.. అడిగినంత సమర్పించుకుంటే ఎలాంటి సర్వీసులైనా ఇక్కడ తేలిగ్గా లభిస్తాయనే ఆరోపణలున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల బదిలీలు, కొత్త బండ్ల నమోదు సహా వివిధ రకాల పౌరసేవలు ఇక్కడ అంగడి సరుకుల్లా అమ్ముడవుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండ్లగూడ కార్యాలయంలో తప్పుడు చిరునామాలతో వాహన అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడటంలేదు. గతంలో ఇదే వ్యవహారంలో ఇక్కడి ఆర్టీఓపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. కాగా.. ఈ అక్రమాల తంతు ఒక్క బండ్లగూడ (Bandlaguda) కార్యాలయంలోనే కాదు.. నగరంలోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో యథేచ్ఛ గా కొనసాగుతున్నట్లు.. ‘ఫేక్ అడ్రస్’లకు చిరునామాలుగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరునామా ఎంతో కీలకం.. డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, చిరునామా బదిలీలు, పర్మిట్ బదిలీలు వంటి వివిధ రకాల సేవల్లో వాహనదారుడి అడ్రస్ను ఎంతో కీలకంగా పరిగణిస్తారు. తప్పుడు వ్యక్తులు, అసాంఘిక శక్తుల చేతుల్లోకి వాహనాలు వెళ్లకుండా, అలాంటి వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్సులను పొందకుండా నియంత్రించేందుకు కచ్చితమైన అడ్రస్ను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్, ఓటర్ గుర్తింపు, బ్యాంకు ఖాతా పుస్తకం, వంటగ్యాస్ డాక్యుమెంట్లు, కరెంట్ బిల్లు చెల్లింపు రసీదు తదితర 13 రకాల పత్రాలను చిరునామా ధ్రువీకరణకు ప్రామాణికంగా భావిస్తారు.కాగా.. సదరు వాహనదారు సమర్పించింది నిజమైనవో కాదో నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే పౌర సేవలను అందజేయాలి. కానీ కొన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఎలాంటి నిర్ధారణ లేకుండానే పౌరసేవలను అంగడి సరుకుల్లా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా.. బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయానికి ప్రతిరోజూ సుమారు 120 లెర్నింగ్ లైసెన్సులను అందజేస్తే వాటిలో కనీసం 40 వరకు తప్పుడు అడ్రస్లపై జారీ చేసినవే ఉంటాయని ఆర్టీఏ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందినవారివే ఎక్కువగా ఉంటాయన్నారు.అడ్డుకుంటున్నా ఆగడంలేదు.. ‘వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే వారి అడ్రస్లను పరిశీలించినప్పుడు మా కార్యాలయం పరిధిలోకి రానివి, తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించినవి గుర్తించి అడ్డుకుంటున్నాం. కానీ అలాంటి వ్యక్తులు నగరంలో ఇతర ఆర్టీఏ కార్యాలయాల నుంచి యథేచ్ఛగా తమకు కావాల్సిన సర్వీసులను పొందుతున్నారు’’ అని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో (Khairtabad RTO Office) పని చేసే ఒక అధికారి తెలిపారు. ‘ప్రతిరోజూ 100 నుంచి 120 లెర్నింగ్లు ఇస్తేనే గిట్టుబాటవుతుందని భావించే సిబ్బంది ఉన్నచోట స్క్రూట్నీ చేస్తే కనీసం 30 శాతం తప్పుడు అడ్రస్లే నమోదైనట్లు తేలుతుంది’ అని మరో అధికారి చెప్పడం గమనార్హం. వాహనదారులు సమర్పించే అడ్రస్ పత్రాలు అసలివో, నకిలీవో నిర్ధారించే వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణమని జూబ్లీహిల్స్కు చెందిన డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఒకరు అభిప్రాయపడ్డారు. చదవండి: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం -
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నాగార్జున
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా తను కొనుగోలు చేసిన లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన అక్కడకు రావడంతో భారీగా ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అక్టోబర్ నెలలో ఆయన ఈ కారు కొన్నారు. కొత్త కారు TG9 GT/R4874 రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి, సంతకం చేసిన నాగ్.. అక్కడి అధికారులతో కొంత సమయం పాటు సరదాగ మాట్లాడి వెళ్లిపోయారు.నాగార్జున కొత్త కారు టయోటా లెక్సస్ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇదే మోడల్ కారును నటుడు రామ్ చరణ్ కూడా ఇటీవల కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో చాలామంది స్టార్స్ ఈ కారును కొనుగోలు చేశారు. దీంతో ఇప్పుడు టయోటా లెక్స్స్ కారు బాగా ట్రెండ్ అవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఉంటుందని సమాచారం.నాగార్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కుబేర' సినిమాలో ఆయన చాలా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ సినిమా 'కూలీ'లో కూడా నాగ్ చాలా ప్రాముఖ్యత ఉన్న రోల్లో కనిపించనున్నారు. త్వరలో ఆయన ఇద్దరి కూమారులలో నాగచైతన్య పెళ్లి తేదీ ఇప్పటికే ఫిక్స్ కాగా.. అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇలా ఫుల్ బిజీ షెడ్యూల్లో నాగ్ ఉన్నారు. -
ఆల్నైన్ వేలం అదుర్స్.. 9999 నెంబర్కు అన్ని లక్షలా..?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్లపై వాహనదారులు తమ క్రేజ్ను చాటుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఏలో శుక్రవారం ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంకు వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. అన్ని ప్రత్యేక నెంబర్లపైన ఆర్టీఏకు రూ.35,58,778 లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. టీఎస్ 09 ఎఫ్.వి 9999 నెంబర్ కోసం జి.రాజశేఖర్రెడ్డి అనే వాహనదారుడు ఆన్లైన్ వేలం పోటీలో రూ.4,49,999 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్ 09 ఎఫ్ డబ్ల్యూ 0001’ అనే మరో నెంబర్ కోసం శ్రీనిధి ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేలంలో పోటీపడి రూ.4 లక్షలు చెల్లించింది. ‘టీఎస్ 09 ఎఫ్డబ్ల్యూ 0099’ నెంబర్ కోసం వై.బిందురెడ్డి ఆన్లైన్ వేలంలో రూ.3,72,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. చదవండి: (Hyderabad: గుడ్న్యూస్.. సిటీబస్సు @ 24/7) -
9999 @ రూ.5.12 లక్షలు
- ఫ్యాన్సీ నంబర్లకు భలే డిమాండ్ - ఒక్క రోజులోనే ఆర్టీయేకు రూ.10.52 లక్షల ఆదాయం సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్ను చాటుకున్నారు.మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో పలు నంబర్లకు వాహనదారుల నుంచి విశేష స్పందన లభించింది. ‘టీఎస్ 09 ఈఏ 9999’ నంబర్ను టెక్ట్రీ సాఫ్ట్వేర్ సంస్థ 5,12,95 రూపాయలకు దక్కించుకుంది. రూ.75.26 లక్షల ఖరీదైన డైమ్లర్ కారు కోసం ఈ నెంబర్ తీసుకుంది. ఆర్ఎన్ ఎంటర్ప్రైజెస్ లక్షా 760 రూపాయలు చెల్లించి జాగ్వార్ వాహనానికి ‘టీఎస్ 09 ఈఏ 0001’ నంబర్ను కైవసం చేసుకుంది. రాజేశ్వర్రెడ్డి అనే వాహనదారుడు రూ.66 వేలు చెల్లించి ‘టీఎస్09 ఈఏ0666’ నంబర్ను సొంతం చేసుకున్నారు. మొత్తంగా మంగళవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా 10 లక్షల 52 వేల 655 రూపాయల ఆదాయం వచ్చినట్టు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ తెలిపారు.