-
గురుకులాలకు కొత్త కళ
సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ’మిషన్.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకం. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు చేసిన ప్రయత్నాలతో ప్రభుత్వ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు బీజాలు పడ్డాయి. ఒకప్పుడు పరిమిత సంఖ్యలో ఉన్న గురుకుల పాఠశాలల సంఖ్య.. కొత్త రాష్ట్రం ఏర్పాటుతో వచ్చిన మార్పులతో భారీగా పెరిగింది. అన్నివర్గాలకు నాణ్యమైన విద్య క్రమంగా అందుబాటులోకి వస్తోంది. పెరుగుతున్న పోటీ ప్రపంచానికి దీటుగా నాణ్యతాప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో ఫలితాల్లోనూ ఈ విద్యార్థులు సత్తా చాటుతున్నారు. దీంతో గురుకులాల్లో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మంచిభోజనంతోపాటు.. నాణ్యమైన విద్యనందిస్తున్న కారణంగా అడ్మిషన్లు ఇవ్వాలంటూ కార్యాలయాల చుట్టూ తిరిగేవారి సంఖ్య పెరిగింది. దీంతో పలు సొసైటీలు ‘హౌస్ఫుల్’బోర్డులు పెడుతున్నాయి. ఇదీ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులకు నిదర్శనం. గురుకులాలు మూడింతలు: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గురుకులాల సంఖ్య 292 మాత్రమే. పరిమిత సంఖ్యలో పాఠశాలలుండటంతో వాటిల్లో ప్రవేశాలు సైతం అంత గొప్పగా ఉండేవి కావు. నిర్వహణకు నిధులివ్వకపోవడంతో విద్యానాణ్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత.. టీఆర్ఎస్ సర్కారు విద్యా వ్యవస్థకు పునరుజ్జీవం అందించే ప్రయత్నంలో భాగంగా గురుకులాల సంఖ్య 881కి పెంచింది. వీటితో పాటు మరో 30 డిగ్రీ కాలేజీలు సైతం ప్రారంభం కావడంతో గురుకుల విద్యా సంస్థల సంఖ్య తొమ్మిది వందలు దాటింది. కొత్త రాష్ట్రంలో 104 ఎస్సీ గురుకులాలు, 53 ఎస్టీ గురుకులాలు, 194 మైనార్టీ గురుకులాలు, 119 బీసీ గురుకులాలు ఏర్పాటయ్యాయి. 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హౌస్ఫుల్ బోర్డులు గతంలో గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ సాదాసీదాగా జరిగేది. అర్హత పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పించినప్పటికీ మధ్యలోనే మానేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గురుకుల పాఠశాలల సంఖ్య పెరగడం, అత్తుత్తమ పద్దతిలో భోజనం అందించడంలాంటి కారణాలతో అడ్మిషన్ల కోసం ఎగబడుతున్నారు. అర్హత పరీక్ష ఫలితాల ఆధారంగా సీట్లు భర్తీ చేసినప్పటికీ.. సీట్లు రానివారు అడ్మిషన్ కావాలంటూ కార్యాలయాల చుట్టూ చక్కలు కొడుతున్నారు. ఈనేపథ్యంలో పలు సొసైటీలు ఏకంగా అన్ని సీట్లు భర్తీ అయినట్లు హౌస్ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నాయి. ర్యాంకుల పండగ గురుకుల పాఠశాలలు ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల కంటే అత్యుత్తమ ఫలితాలను ఖాతాలో వేసుకుంటున్నాయి. గతేడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 92% పైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్, నీట్, క్లాట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల్లోనూ గురుకులాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధిస్తున్నారు. జూనియర్ కాలేజీలు అధికంగా ఉన్న ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల నుంచి ఏకంగా 37 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, డెంటల్ సీట్లు సాధించారు. 6గురు విద్యార్థులు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, 12 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్లు సాధించారు. బెంగళూరులోని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో 28 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. 10 మంది విద్యార్థులు వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, 16 మంది విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. గతేడాది ఎస్టీ గురుకులాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించడంతో ప్రభుత్వం వారికి ప్రోత్సాహకంగా ల్యాప్టాప్లు అందించింది. 2.72 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 762 గురుకుల పాఠశాలల్లో విద్యార్థులున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మరో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానుండగా... ఇప్పుడున్న వాటిలో 2.72లక్షల మంది విద్యార్థులున్నారు. ఒక్కో తరగతిలో 40మంది చొప్పున.. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు కలిపి 80 మంది ఉంటారు. కొత్తగా ప్రారంభమైన పాఠశాలల్లో 5,6,7 తరగతులు ప్రారంభించగా.. ఏటా ఒక్కో తరగతి అప్గ్రేడ్ అవుతోంది. దీంతో 2020 నాటికి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 3 లక్షలు దాటనుంది. సొసైటీల వారీగా ప్రస్తుతమున్న గురుకుల పాఠశాలల సంఖ్య సొసైటీ పేరు తెలంగాణకు ముందు కొత్త గురుకులాలు మొత్తం టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 134 104 238 టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ 94 53 147 టీఆర్ఈఐఎస్ 35 0 35 టీఎంఆర్ఈఐఎస్ 10 194 204 ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ 19 119 138 (మరో 119 గురుకులాలు 2019–20 విద్యా సంవత్సరంలో ప్రారంభం) పక్కా ప్రణాళికతో గతంలో గురుకుల పాఠశాలల నిర్వహణ సొసైటీ నిర్ణయాలకు తగినట్లు ఉండేవి. ప్రస్తుతం సొసైటీ ఆదేశానుసారం నడిచినప్పటికీ.. కీలక నిర్ణయాలన్నీ అన్ని సొసైటీ కార్యదర్శులు చర్చించి ఒకే తరహాలో అమలు చేయడంతో ఫలితాలు సైతం ఒకే తరహాలో వస్తున్నాయి. పాఠ్యాంశ బోధన మొదలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలన్నీ పక్కాగా నిర్వహిస్తుండడంతో విద్యార్థులు చదువును ఒత్తిడిగా భావించడం లేదు. కొత్త గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో నియమిస్తోంది. బీసీ సొసైటీకి కొత్తగా మంజూరు చేసిన గురుకులాల్లోనూ ప్రభుత్వం సిబ్బందిని మంజూరు చేసింది. వచ్చే ఏడాది ఈ ఉద్యోగ నియామకాలు చేపడతారు. గురుకులాల్లో ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీఆర్ఈఐఆర్బీ (తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు)బోర్డును ఏర్పాటు చేసింది. బీసీ గురుకులాలదే అతిపెద్ద సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు బీసీ గురుకుల సొసైటీలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉండేవి. కొత్త రాష్ట్రంలో బీసీ గురుకులాల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేయగా 2017–18 విద్యా సంవత్సరంలో వాటిని ఆ సొసైటీ అందుబాటులోకి తెచ్చింది. కానీ బీసీ విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా గురుకుల పాఠశాలలు లేవని క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు బీసీ గురుకుల సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు కాయడం.. గందరగోళ వాతావరణం నెలకొంటొంది. ఇందులో భాగంగా మరో 119 కొత్త గురుకులాల ఏర్పాటుకు అనుమతిచ్చింది. వీటిని 2019–20 విద్యాసంవత్సరంలో వీటిని ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో 257 గురుకుల పాఠశాలలతో అతిపెద్ద గురుకుల సొసైటీగా ‘బీసీ గురుకుల సొసైటీ’అవతరించనుంది. సరికొత్త మెనూతో..! గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు బోధనతో పాటు ఆరోగ్య ప్రమాణాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. పాత విధానానికి స్వస్తి పలుకుతూ సరికొత్త మెనూను సిద్ధం చేసింది. ఎదిగే పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించేలా డైట్ చార్ట్ను తయారు చేసింది. ఇందుకు ఎన్ఐఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్) సహకారాన్ని తీసుకుంది. కొత్తగా రూపొందించిన మెనూ అమలుకు ప్రభుత్వం బడ్జెట్ను పెంచింది. మెస్చార్జీలను భారీగా పెంచడంతో విద్యార్థులకు మరింత పోషకాహారాన్ని ప్రణాళికాబద్ధంగా అందిస్తున్నారు. మెస్ చార్జీల రూపంలో ప్రస్తుతం 7వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.950 చొప్పున, 8నుంచి 10 తరగతికి రూ.1100, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.1050 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. గ్రీన్చానల్ ద్వారా నిధుల విడుదల... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గురుకుల పాఠశాలల్లో ఆర్థిక సమస్యలు రావద్దని నిర్ణయించి వీటిని గ్రీన్చానెల్ విధానంలోకి మార్చింది. నిధుల సమస్య తలెత్తకుండా అవసరాలకు తగినట్లుగా నిధులు విడుదల చేస్తోంది. పైసా బకాయి ఉండకుండా డైట్ చార్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేయడంతో విద్యార్థులకు సకాలంలో సరైన భోజనం అందుతోంది. అదేవిధంగా సమస్యలున్న పాఠశాలల్లో కేవలం ప్రతిపాదనలు అందించిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో పనులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నప్పటికీ.. సకాలంలో ఆమేరకు నిధులు విడుదల చేస్తోంది. పక్కా భవనాలకు కార్యాచరణ సిద్ధం చేస్తూనే ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా భవనాలు నిర్మించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. జనరల్ సర్జన్ అవుతా! మాది నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామం. అమ్మ, నాన్న వ్యవసాయ కూలీలు. ఉన్నత చదువులు చదవాలనేది నాకల. డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నా. కానీ ప్రైవేటు స్కూళ్లలో చదివే స్థోమత లేకపోవడంతో గురుకుల పాఠశాలలో చేరా. పదోతరగతి వరకు ఆర్మూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివా. మంచి మార్కులు రావడంతో గౌలిదొడ్డి జూనియర్ కాలేజీలో సీటు వచ్చింది. అక్కడ బైపీసీలో చేరా. నీట్లో 2వేల ర్యాంకు వచ్చింది. మహబూబ్నగర్ వైద్య కళాశాలలో అడ్మిషన్ దొరికింది. జనరల్ సర్జన్ అవ్వాలనేది నా కల. – అమర్త్య, ఎంబీబీఎస్ ఫస్టియర్, మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల -
స్కూళ్ల పరిధిలోకి అంగన్వాడీలు
► ఇరు శాఖల అంగీకారం.. కార్యాచరణకు ఆదేశాలు ► ముందుగా పాఠశాలల సమీపంలోని కేంద్రాల విలీనం ► ఏప్రిల్ 15లోగా విధివిధానాలు, చేపట్టాల్సిన బోధన ఖరారు ► జూన్ 12 నుంచి తరగతులు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కేజీ టు పీజీ’ విద్యా విధానంలో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశా లల ఆవరణలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు సూత్రప్రాయంగా అంగీక రించారు. గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రాథ మిక పాఠశాలలను గుర్తించి, వాటి వద్దకు అంగన్ వాడీ కేంద్రాలను తరలించాలని... 2017–18 విద్యా సంవత్సరం నుంచే వాటిలో బోధించేలా చర్యలు చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. అంగన్ వాడీ కేంద్రాలు ఇప్పటివరకు చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మాత్రమే పనిచేశాయని, ఇక నుంచి ‘ప్లేస్కూల్’గా మార్చేందుకు ప్రతిపాద నలు రూపొందించాలని సూచించారు. సౌకర్యాలూ ఏర్పడతాయి రాష్ట్రవ్యాప్తంగా చాలా అంగన్ వాడీ కేంద్రాల కు పక్కా భవనాలు, వసతులు లేవు. దీంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని అధి కారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. అదే స్కూళ్ల ఆవరణలోకి అంగన్ వాడీ కేంద్రాలను తరలిస్తే పిల్లలకూ అన్ని వసతులు అందు బాటులోకి వస్తాయని.. పర్యవేక్షణ, నిర్వహణ సులభతరమవుతుందని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబం ధించి వచ్చే నెల 15లోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జూన్ 12 నుంచే అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల ల్లో నడిపించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఓ వైపు ఆట, పాటలతో పిల్లలకు చదువు నేర్పిస్తూ, మరోవైపు పౌష్టికా హారం అందిస్తూ అంగన్వాడీలు ప్లేస్కూళ్లుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. 6.54 లక్షల మంది విద్యార్థులు ప్రస్తుతం రాష్ట్రంలో 35,750 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో 6.54 లక్షల మంది మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలు నమోదై ఉన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 18,162 ప్రాథమిక పాఠశా లలు ఉండగా... వాటిలో 9,742,464 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం అదనపు తరగతి గదులున్న వాటిని ముందుగా గుర్తించి.. సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను వాటిలోకి తరలి స్తారు. ఈ అంగన్వాడీ కేంద్రాల్లో తెలుగు మీడియంలో ప్లేస్కూళ్లను నిర్వహిస్తారు. ఇంగ్లిషు మీడియం పాఠాలు కూడా నేర్పిం చేలా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సిలబస్ను రూపొందించింది. అనుమతి రాగానే పాఠ్య పుస్తకాలు రాయిం చి అమలు చేయనున్నారు. అంగన్వాడీ పిల్లల కోసం యూనిసెఫ్ రూపొందించిన పుస్తకాలను పరిశీలించి వీటిని సిద్ధం చేయనున్నారు. ఇక ఈ ప్లేస్కూళ్లలో విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా ఆరు వేలకు పైగా విద్యా వలంటీర్లను నియమించే అవకాశముంది. -
అంగన్వాడీ..అయోమయంలో పడి..!
పిల్లలు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తూ.. బాలింతలకు పౌష్టికాహార లోపం లేకుండా చేస్తూ.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పింది. వాటిని సమర్థంగా నిర్వహించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షిస్తూ.. మంచి ఫలితాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉన్నత విద్యార్హతలున్నా ప్రభుత్వ కొలువులు రాక ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో నెట్టుకొస్తూ బతుకీడుస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. ప్రభుత్వం మాత్రం కేజీ టూ పీజీ వరకు విద్యనందించే పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తామనే ఆలోచన చేస్తుండటంతో సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు. ఇక తమ భవిష్యత్ ఏమిటని కార్యకర్తలు, ఆయాలు ప్రశ్నించుకుంటున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనకు గురవుతున్నారు. కేజీ టూ పీజీ వరకు నిర్వహించే పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శాసన సభలో ప్రభుత్వ ఆలోచనను ప్రకటించడంతో.. ఐసీడీఎస్ పరిధిలో పనిచేసే అంగన్వాడీల్లో దీనిపై చర్చ సాగుతోంది. దీనిపై ఐసీడీఎస్కు ఎలాంటి గైడ్లైన్స్ రానప్పటికీ.. అంగన్వాడీలు మాత్రం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోననే విషయమై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,605 అంగన్వాడీ కేంద్రాలు, 291 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా 43,291 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం బాలింతలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. జిల్లాలో 20,194 మంది బాలింతలు, గర్భిణులకు ఈ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతోపాటు ప్రాజెక్టులో 1,896 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 25,725 మంది పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ద్వారా ఆటపాటలతో చదువు చెబుతున్నారు. ప్రస్తుతం 840 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా.. 754 అద్దె భవనాలు, 302 అద్దె చెల్లించని భవనాల ద్వారా కేంద్రాలను నడుపుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార లోపం లేకుండా చేసే ప్రధాన ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాలను సుమారు 25 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల వీటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అన్ని కేంద్రాలను విలీనం చేస్తారా..? ప్రస్తుతం జిల్లాలో 1,896 మంది అంగన్వాడీ టీచర్లు, 1,605 మంది ఆయాలు కేంద్రాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంగన్వాడీ టీచర్లకు రూ.7వేలు వేతనం, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.4,500 వేతనం అందిస్తున్నారు. ఆయాలకు రూ.4,500 వేతనం అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తే ఎక్కువ విద్యార్హతలున్న టీచర్లకు ఫస్ట్ క్లాస్ బోధించే అవకాశం కల్పిస్తారని, తక్కువ విద్యార్హత కలిగిన వారికి ఎల్కేజీ, యూకేజీ వరకు బోధించే అవకాశం కల్పిస్తారని చర్చ సాగుతోంది. దీంతోపాటు అర్హతలు తక్కువ ఉన్న వారికి ఉద్వాసన చెబుతారనే నేపథ్యంలో అటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం తలపెట్టిన అన్ని పనుల్లో తమ సహకారం అందిస్తున్న అంగన్వాడీలు.. వాటిని రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని మనోవేదన చెందుతున్నారు. అంగన్వాడీల లక్ష్యం ఎటు సాగేను.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించి.. అనారోగ్యానికి గురికాకుండా చూసేందుకు అంగన్వాడీ కేంద్రాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. వీటిని ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల ఆ లక్ష్యం ఎటు పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అసలు ఏయే అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తారనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. దీంతో అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. -
కేజీ టు పీజీని అమలుచేస్తాం: కడియం
న్యూఢిల్లీ: కేజీ టు పీజీని అమలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అందులో భాగంగానే ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నట్లు చెప్పారు. దశలవారీగా ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎడ్యూకేషన్ సెస్ ను పెంచాలని, త్వరలో అన్ని పాఠశాలల్లో వంద శాతం బయోమెట్రిక్ విధానం తీసుకోస్తామని కడియం శ్రీహరి తెలిపారు. -
నాణ్యమైన విద్యనందించేందుకే కేజీ టు పీజీ
నకిరేకల్ : పేదవర్గాల వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టారని.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 350 గురుకుల పాఠశాలలను మంజూరు చేశారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. నకిరేకల్లో రూ.2.25కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జెడ్పీహైస్కూల్లో రూ.52లక్షలతో అదనపు గదుల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెయిన్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. తాజాగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ గురుకులాన్ని కేటాయిస్తూ మొత్తం 119 గురుకుల పాఠశాలలను మంజూరు చే శారన్నారు. జానారెడ్డిపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్రెడ్డి రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో ఈ జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేత జానారెడ్డిపై నిప్పులు చెరిగారు. 30ఏళ్లుగా ఈ జిల్లా జానారెడ్డి పాలనలో ఉందని.. కనీసం ఆయన నియోజకవర్గానికి రెండు రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా మంజూరు చేయించలేదని విమర్శించారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ సభలో జెడ్పీచై ర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్రెడ్డి, నార్కట్పల్లి ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మొగిలి సుజాత, అల్గుబెల్లి అమరేందర్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పూజర్ల శంభయ్య, పల్రెడ్డి నర్సింహారెడ్డి, వీర్లపాటి రమేష్, సోమ యాదగిరి, సిలివేరు ప్రభాకర్, మంగినపల్లిరాజు తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement