-
కేజీ డీ6 ఎంజే ఫీల్డ్లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: కేజీ డీ6 పరిధిలోని అత్యంత లోతైన సముద్రపు బ్లాక్ ఎంజే ఫీల్డ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ సహజ వాయువుని ఈ త్రైమాసికంలోనే ఉత్పత్తి చేయనుంది. ఏకైక డీప్ వాటర్ బ్లాక్ అయిన కేజీ డీ6 దేశ గ్యాస్ అవసరాల్లో 15 శాతాన్ని తీరుస్తుండడం విశేషం. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 20 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్స్ రోజువారీ (ఎంఎంఎస్సీఎండీ) ఉత్పత్తి సగటున ఇక్కడ నమోదైంది. ఎంజే డీప్ వాటర్ ప్రాజెక్ట్లో ఉత్పత్తి మొదలైతే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్కు చెందిన బీపీతో కలసి ఇక్కడ ఉత్పత్తిని ఆరంభించనుంది. వాస్తవానికి గడిచిన డిసెంబర్ త్రైమాసికంలోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా, మూడు నెలల జాప్యం నెలకొంది. కేజీ డీ6లో మూడు ప్రాజెక్టుల ద్వారా గ్యాస్ ఉత్పత్తిపై రిలయన్స్, బీపీ 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మూడు ప్రాజెక్టులకు గాను ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్లో ఇప్పటికే ఉత్పత్తి ఆరంభమైంది. ఎంజే ఫీల్డ్లో ఉత్పత్తి మొదలు కావాల్సి ఉంది. ‘‘ఎంజే ఫీల్డ్లో పరీక్షలు, ఉత్పత్తి మొదలు పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి మొదలైతే కేజీ డీ6 పరిధిలో మొత్తం గ్యాస్ ఉత్పత్తి 30 ఎంఎంఎస్సీఎండీకి చేరుకుంటుంది’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించింది. -
రిలయన్స్పై 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానా
లక్ష్యానికి అనుగుణంగా గ్యాస్ను ఉత్పత్తి చేయకపోవడమే కారణం పెట్రోలియం శాఖ మంత్రి ప్రధాన్ వెల్లడి న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రాల్లో లక్ష్యాల కంటే తక్కువగా సహజవాయువును ఉత్పత్తి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)పై కేంద్రం 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానాను విధించింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని సోమవారం లోక్సభకు తెలిపారు. ఏప్రిల్ 1, 2010 నుంచి నాలుగేళ్ల కాలంలో ఉత్పత్తి లక్ష్యాలను అందుకోవడంలో ఆర్ఐఎల్ విఫలమైందని.. తాజా జరిమానాతో కలిపితే ఈ మొత్తం 2.376 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.14,250 కోట్లు) చేరినట్లు ఆయన పేర్కొన్నారు. కంపెనీ వెనక్కితీసుకునే పెట్టుబడి వ్యయాల్లో కోత రూపంలో ఈ జరిమానా ఉంటుంది. గ్యాస్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం నుంచి నిర్వహణ, పెట్టుబడి వ్యయాలన్నింటినీ ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం(బీపీ), నికో రిసోర్సెస్లు వెనక్కి తీసుకునేందుకు ఉత్పత్తి పంపకం కాంట్రాక్టు అనుమతిస్తోంది. ఆతర్వాతే ప్రభుత్వంతో లాభాలను పంచుకోవాలని నిర్దేశిస్తోం ది. గత, తాజా జరిమానాల విధింపు నేపథ్యంలో 2010-11 నుంచి 2013-14 మధ్య ప్రభుత్వానికి 19.5 కోట్ల డాలర్ల మేర అధికంగా లాభాల వాటా లభించనుందని ప్రధాన్ చెప్పారు. ఈ నెల 10న నోటీసు...: 2013-14 ఏడాదిలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోనందుకు తాజా జరిమానా విధించినట్లు చమురు శాఖ మంత్రి వెల్లడించారు. ఆర్ఐఎల్ పెట్టుబడుల వ్యయంలో 57.9 కోట్ల డాలర్లు వెనక్కితీసుకునేందుకు నిరాకరిస్తూ ఈ నెల 10న నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక(ఎఫ్డీపీ) ప్రకారం కేజీ-డీ6లోని డీ1, డీ3 ప్రధాన క్షేత్రాల నుంచి ప్రస్తుతం గ్యాస్ ఉత్పత్తి రోజుకు 80 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లు(ఎంసీఎండీ)గా ఉండాలని.. అయితే, వాస్తవ ఉత్పత్తి 2011-12లో 35.88 ఎంసీఎండీ, 2012-13లో 20.88 ఎంసీఎండీ, 2013-14లో 9.77 ఎంసీఎండీలకు పరిమితమైనట్లు ప్రధాన్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ఏడాది(2014-15)లో ఉత్పత్తి కేవలం 8.05 ఎంసీఎండీ స్థాయిలోనే ఉందని కూడా తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడం వైఫల్యానికిగాను గతంలో ప్రభుత్వం 1.797 బిలియన్ డాలర్ల మొత్తాన్ని(2010-11 నుంచి 2012-13 కాలానికి) జరిమానాగా విధించిందని.. ప్రస్తుతం ఈ అంశం మధ్యవర్తిత్వం(ఆర్బిట్రేషన్) ప్రక్రియలో ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement