-
మౌనంగానే ఎదగమని..
అడగకముందే మనకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అప్పుడప్పుడూ పొరపాటుపడి ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా.. ఇచ్చి తీసేసుకున్నా మనం ఏం చేయగలం! ప్చ్.. మన రాత ఇంతేనని నిట్టూర్చి మిన్నకుండిపోతాం. కానీ మన ‘కౌసర్భాను’ అలా ఊరికే ఉండిపోలేదు. దేవుడి నుంచి మరోటి లాగేసుకుంది. ‘గీత’ నేర్చుకుంది.. రాత మార్చుకుంది. వైకల్యాన్ని అధిగమించేందుకు కాస్తంత ప్రోత్సాహం ఉంటే చాలుననీ, ఆ ఆసరాతో పోగొట్టుకున్న దాని కంటే ఎక్కువ సాధించవచ్చని నిరూపిస్తున్నారు. ఆమెనే కౌసర్బాను. కడప కల్చరల్ : కడప నగరానికి చెందిన కౌసర్బానుది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ముర్తుజాకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కౌసర్ చిన్న కుమార్తె. అందరిలాగానే ఆడుతూ, పాడుతూ ఎంతో సరదాగా ఉండేది. అందరితో వస పిట్టలా మాట్లాడుతూ ఉండేది. సరిగ్గా అక్కడే ఆమె జీవితం పెద్ద మలుపు తిరిగింది. నాలుగున్నరేళ్ల చిన్నారి కౌసర్కు జ్వరం. తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. ఒకచోట వైద్యం వికటించింది. గలగలా మాట్లాడుతూ తిరిగే తమ చిన్నారి ఉన్నట్లుండి ‘మౌనమే నా భాష’ అన్నట్లుగా ఉండిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పాడుజ్వరం తన మాటను తీసుకెళ్లిందని, తను మాట్లాడలేకపోతోందని ఆ చిట్టి మనసు అర్థం చేసుకుంది. తనకు ప్రాణప్రదమైన అమ్మానాన్నల కళ్లల్లో నీటితడికి బదులుగా ఆనందం చూడాలని గట్టిగా నిర్ణయించుకుంది. రంగుల లోకంలో... కౌసర్కు బొమ్మలు గీయడమంటే చాలా ఇష్టం. నచ్చిన ప్రతి బొమ్మను గీసేది. మూడున్నరేళ్ల వయసులోనే చక్కని చిత్రాలు గీస్తున్న కుమార్తెను చూసి అమ్మానాన్న ప్రోత్సహించారు. చెప్పదలుచుకున్న విషయాన్ని బొమ్మల ద్వారా చెప్పడం గమనించారు. ప్రోత్సాహాన్ని కొనసాగించారు. అక్క అర్షియ ఏదైనా పోటీలకు వెళ్లేటపుడు తానూ వస్తానని కౌసర్ మారాం చేసేది. కాస్త మార్పుగా ఉంటుందని తీసుకెళ్లేది. పోటీల్లో పాల్గొని చెల్లి బహుమతులు సాధిస్తుండడంతో అక్క ఆమెకు తన డ్రాయింగ్ సామగ్రి ఇచ్చి ప్రోత్సహించేది. ఈ ప్రత్యేకతను గమనించిన తల్లిదండ్రులు రషీదా, ముర్తుజా, అన్న అసదుల్లా కౌసర్కు అవసరమైన డ్రాయింగ్ సామగ్రిని సమకూరుస్తూ ఉత్సాహ పరిచారు. పర్యాటకం సీతారామయ్య, అక్క స్నేహితులు నాగవేణి, అఖిల ఆమె గీసిన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహింపజేశారు. ఆలోచనాత్మకం కౌసర్ సమకాలీన సమస్యలపై పలు పెయింటింగ్లు గీశారు. ముఖ్యంగా మహిళా సాధికారత, భ్రూణహత్యలు, మసిబారుతున్న పసితనం ప్రధాన అంశాలుగా ప్రతిభావంతమైన చిత్రాలు గీశారు. ఎందరో ప్రముఖ వ్యక్తులు, దేశభక్తుల చిత్రాలు కూడా గీశారు. ముఖ్యంగా సింహం చిత్రంలో సూక్ష్మ మైన అంశాలను కూడా వదలకుండా గీసిన తీరు ఆమె సునిశిత పరిశీలనాశక్తికి నిదర్శంగా నిలుస్తోంది. పలు చిత్రాలు విమర్శకులను సైతం మెప్పించాయి. కౌసర్లో మరో ప్రత్యేకత కూడా ఉంది. పనికిరాని వస్తువులతో కళ్లు చెదిరే ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తుంది. కోడిగుడ్ల డొల్లలు, పాత సీసాలు, ఐస్క్రీమ్ కప్లు, స్ట్రాలు ఇలా అన్నింటినీ కళాత్మకంగా రూపొం దిస్తోంది. ముఖ్యంగా ఆమె తయారు చేసిన కాగితం నగలు అందరినీ ఆకర్శిస్తున్నాయి. అంతర్జాతీయ అవార్డులు కౌసర్ స్థానికంగా వందలాది పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. గండికోట ఉత్సవంలో స్పాట్ పెయింటింగ్ చేసి బహుమతి సాధించి సత్తా చాటారు. పికాసో ఆర్ట్ సంస్థ వారు ఆన్లైన్ ద్వారా నిర్వహించే పోటీల్లో ఆమెకు రెండు మార్లు వరుసగా బహుమతులు లభించాయి. 2016లో ఆమె ఈ పోటీల్లో ద్వితీయ బహుమతి, 2017లో ప్రథమ బహుమతి సాధించారు. కంగ్రాట్స్.. అంటూ అభినందిస్తే కౌసర్ మెత్తగా నవ్వేస్తుంది.. ప్రస్తుతం స్పీచ్ థెరఫీ తీసుకుంటున్న కౌసర్భాను త్వరలో ‘సాక్షి’కి స్వయంగా ధన్యవాదాలు చెప్పగలదని ఆశిద్దాం! -
వేధింపులకు వివాహిత బలి
మండ్య : భర్త, అత్త, అడపడుచు వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి పట్టణంలోని గాంధీనగర్లోని 5వ క్రాస్లో చోటు చేసుకుంది. పోలీసు కథనం మేరకు.. మండ్యలోని బీడీ కార్మికుల కాలనీకి చెందిన షఫీవుల్లా, జాకీర్బాను దంపతుల కుమార్తె కౌసర్బాను (20)కు ఇదే పట్టణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన నాసీమ్ పాషాతో ఏడాది క్రితం వివాహమైంది. ఆ సమయంలో అత్తింటివారు రూ. 10 వేల నగదు, బంగారంయ కట్నంగా సమర్పించారు. అయితే అదనపు కట్నం తేవాలని కొంతకాలంగా నాసీమ్పాషా, అతని తల్లి అబీబున్నిసా, ఆడపడుచు సీమా కౌసర్బానును వేధించేవారు. విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. చేతిలో డబ్బు లేదని, కొన్ని రోజుల తర్వాత అడిగినంత ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కౌసర్బాను తన భర్త, అత్త, ఆడపడచుకు తెలిపింది. అయినా వేధింపులు ఆగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన కౌసర్బాను శనివారం రాత్రి ఇంటిలో చీరతో ఫ్యాన్కు ఉరివేసుకుంది. గమనించిన భర్త ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తను వీడి పుట్టింటిలో ఉంటున్న నాసీమ్ పాషా చెల్లెలు సీమను కాపురానికి పంపేందుకు అవసరమైన డబ్బు కోసం తన కుమార్తెను అల్లుడు, ఆమె తల్లి, ఆడపడచూ వేధింపులకు పాల్పడ్డారని, వాటిని తాళలేక ఆత్మహత్య చేసుకుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు కౌసర్బాను భర్త, అతని తల్లి, ఆడపడచను అరెస్ట్ చేశారు. కౌసర్బాను మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (02-05-2024)
Swapna Kondamma: బుల్లితెర నటి సీమంతం.. ఎంతో సింపుల్గా ఇంట్లోనే.. (ఫోటోలు)
హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)
నితీష్ ఊచకోత.. 8 సిక్స్లతో వీర విహారం! వీడియో వైరల్
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement