-
ఈమె తెలుగు హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం?
సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా హీరోయిన్ల కెరీర్ సాగుతూ ఉంటుంది. అలాంటిది నటిగా మంచి స్థితిలో ఉన్నప్పుడే ఈమె పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. ఆ వెంటనే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం కొడుకుతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు సనా ఖాన్. అవును మీరు ఊహించింది కరెక్టే. కల్యాణ్ రామ 'కత్తి', నాగ్ 'గగనం', 'మిస్టర్ నూకయ్య' తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించింది ఈమెనే. తండ్రి మలయాళీ, తల్లిది ముంబయి. అలా ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. 2005లో బాలీవుడ్లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. (ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) హిందీ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. దాదాపు 14 ఏళ్లపాటు నటించింది. ఇక 2019లో కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్తో రిలేషన్ మొదలుపెట్టింది. ఏడాది తిరగకుండానే విడిపోయింది. ఇది జరిగిన కొద్దిరోజులకు యాక్టింగ్ వదిలేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. కట్ చేస్తే 2020 నవంబరులో ఇస్లామిక్ స్కాలర్ మఫ్టీ అనాస్ సయ్యద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్ల బంధానికి గుర్తుగా ఈ ఏడాది జులైలో అబ్బాయి పుట్టాడు. రీసెంట్గా భర్త, కొడుకుతో కలిసి మక్కా వెళ్లిన సనాఖాన్ అందుకు సంబంధించిన ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈమెని తొలుత గుర్తుపట్టలేకపోయిన నెటిజన్స్.. గుర్తొచ్చిన తర్వాత ఈమెనా అని కామెంట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) -
హ్యాట్రిక్ కాంబినేషన్
తుపాకీ, కత్తి లాంటి ఘనవిజయాలు సాధించిన విజయ్, మురగదాస్ల కాంబినేషన్లో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ మొదలైంది. మరోసారి ఓ సామాజిక సమస్య నేపథ్యంలో విజయ్ హీరోగా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫొటోషూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇప్పుడు సినిమా సెట్స్ మీదకు రావటంతో ఇళయదళపతి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం సినిమా ఓపెనింగ్ విషయంలో హింట్ ఇస్తూ దర్శకుడు మురుగదాస్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ దీపావళి గైస్’ అంటూ మురుగదాస్ ట్వీట్ చేసిన వెంటనే ఇది విజయ్ సినిమా ఓపెనింగ్ గురించి చేసిన ట్వీట్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టారు. అభిమానుల అంచనాలను నిజం చేస్తూ విజయ్, కీర్తి సురేష్లు హీరోహీరోయిన్లుగా కొత్త సినిమాను ప్రారంభించాడు మురుగదాస్. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. -
సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హిట్ కాంబినేషన్
కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా రెండు సార్లు వందకోట్ల కలెక్షన్లు సాధించిన కాంబినేషన్ దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్లది. తుపాకి, కత్తి సినిమాలతో రెండు భారీ విజయాలను అందుకున్న ఈ కాంబినేషన్లో ఇప్పుడు మూడో చిత్రం తెరకెక్కనుందట. ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్ను సాధించాలని భావిస్తున్నారు. అందుకే పక్కా కథా కథనాలతో పాటు సెంటిమెంట్ను కూడా రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండు సినిమాలు దీపావళి కానుకగా రిలీజ్ అయ్యాయి. తుపాకీ సినిమా 2012 దీపావళికి రిలీజ్ కాగా., కత్తి సినిమా 2014 దీపావళి సమయంలో రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో ఈ కాంబినేషన్లో రూపొందబోయే హ్యాట్రిక్ సినిమాను కూడా అదే సమయంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భారీ యాక్షన్ థ్రిల్లర్ను తెరకెక్కిస్తున్న మురుగదాస్, ఆ సినిమా పూర్తయిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కబోయే సినిమాల పనులు ప్రారంభించనున్నాడు. విజయ్ కూడా ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసి మురుగదాస్ సినిమాకు డేట్స్ కేటాయించేలా ప్లాన్ చేస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2018 దీపావళి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
అది బాబాయ్ మీద ఆధారపడి ఉంది!
‘‘ఎవరైనా ఎక్కడైనా మంచి పని చేస్తే.. దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. మంచి పనులు చేసినవాళ్లను ఎంపిక చేసి నాన్నగారి 150వ సినిమా సెట్లో కలిసే అవకాశం కల్పిస్తాం. సమాజానికి ఉపయోగపడేలా మంచి పనులు ఏం చేస్తే బాగుంటుందో? మాకు సలహా ఇవ్వండి’’ అని రామ్చరణ్ అన్నారు. గురువారం ఫేస్బుక్లో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు చరణ్ సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని విశేషాలు... నాన్నగారి 150వ చిత్రం టైటిల్ ‘కత్తిలాంటోడు’ కాదు. మంచి టైటిల్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఆగస్టులో ఆ టైటిల్ ప్రకటిస్తాం. ఒకవేళ నాన్నగారు, దర్శకుడు వీవీ వినాయక్ నటించమంటే.. 150వ చిత్రంలో ఏదైనా పాటలో కనిపిస్తాను. మంచి కథ దొరికితే కల్యాణ్ బాబాయ్తో కలసి నటించడానికి నేనెప్పుడూ రెడీ. బాబాయ్ నిర్మాణ సంస్థలో నేను హీరోగా నటించే చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అవకాశముంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హిమ్.. సురేందర్రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘ధ్రువ’ ఫస్ట్ లుక్ను ఆగస్టు 15న, చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం. కాశ్మీర్లో నాన్నగారి నలభై సినిమాల షూటింగులు జరిగాయి. ‘ధ్రువ’ కోసం కాశ్మీర్లో షూటింగ్ చేయడం హ్యాపీగా అనిపించింది. వీలయితే కుటుంబంతో కాశ్మీర్ వెళ్లండి. బాగా ఎంజాయ్ చేస్తారు. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే చిత్రాన్ని అక్టోబర్లో ప్రారంభించాలని అనుకుంటున్నాం. గౌతమ్ మీనన్ చిత్రాలంటే బాగా ఇష్టం. ఆయనతో ఓ చిత్రం చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఏఆర్ మురుగదాస్తోనూ సినిమా చేయాలనుంది. కచ్చితంగా ఇద్దరితోనూ పని చేస్తా. నాకు అభిమాన నటుడంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి నటన నచ్చుతుంది మహేశ్ బాబు అద్భుతమైన నటుడు, వెరీ గుడ్ లుకింగ్ పర్సన్. ప్రభాస్.. మంచి స్నేహితుడు, లవింగ్ పర్సన్. -
ఆ విషయం ఏమో చెప్పలేను: రాంచరణ్
చెన్నై: మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా 'కత్తి' రీమేక్ ద్వారా 150వ చిత్రంతో ఆయన మళ్లీ ప్రేక్షకులను పలుకరించనున్నాడు. గురువారం సాయంత్రం ఫేస్బుక్ లైవ్ చాటింగ్లో అభిమానులతో ముచ్చటించిన మెగా హీరో రాంచరణ్ తన తండ్రి 150వ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముందని చెప్పారు. చిరు 150వ సినిమాకు 'కత్తిలాంటోడు' టైటిల్ పెట్టారని వార్తలు వస్తుండగా.. చరణ్ ఆ వార్తలను తోసిపుచ్చాడు. ఇంకా సినిమాకు పేరు పెట్టలేదని తెలిపాడు. ప్రస్తుతం 'ధ్రువ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్ 15నిమిషాల పాటు లైవ్ చాటింగ్లో ముచ్చటించాడు. బాబాయి పవన్ కల్యాణ్తో సినిమా చేయడం తనకు ఇష్టమేనని, అయితే, ఇందుకు మంచి కథ దొరకాల్సిన అవసరముందని చెప్పాడు. ఇక చిరు 150వ సినిమాలో నటించే విషయమై రాంచరణ్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలో తాను నటిస్తానో లేదోనని అన్నాడు. 'ఈ సినిమాలో నేను నటిస్తానా అన్నది కచ్చితంగా చెప్పలేను. ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉన్నాను. దర్శకుడు వినాయక్, మా నాన్నగారు సినిమాలో నేను నటించాలని కోరుకుంటే.. నేను ఒక పాటలో కనిపించే అవకాశముంది' అని చరణ్ చెప్పాడు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement