-
నిత్యవసరాల ధరలను అందుబాటులో ఉంచాలి
జాయింట్ కలెక్టర్ యాకూబ్నాయక్ ఆదేశం ఒంగోలు కలెక్టరేట్ : నిత్యవసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్నాయక్ ఆదేశించారు. స్థానిక తన చాంబ ర్లో బుధవారం సాయంత్రం నిర్వహించి న జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం ధర సామాన్య ప్రజలకు అందుబాటులో లేదని, పౌరసరఫరాలశాఖ ద్వారా రైతు బజార్లలో బియ్యం విక్రయ కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటికే కందుకూరు రైతు బజార్లో నెల్లూరు సన్నాలు బియ్యాన్ని కిలో 30 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపా రు. ఒంగోలులోని రైతు బజార్లలో కూడా ఆ రకం బియ్యాన్ని అదే ధరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రైస్మిల్ల ర్ల యజమానులతో సమావేశాన్ని ఏర్పా టు చేసి ప్రత్యేక కౌంటర్ల ద్వారా సాధారణ ధరకే బియ్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతు బజార్లలో కూడా కొన్నిరకాల నిత్యవసర సరుకుల ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ జేసీ అసహనం వ్యక్తం చేశారు. టమోటా కిలో 32, కందిపప్పు 62, మినుములు 44, ఉల్లిపాయలు కిలో 17 రూపాయల ధర ఉందన్నారు. ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను జేసీ ఆదేశించారు. ప్రజల జీవితాలతో చెలగాటం : మాగులూరి వ్యాపారస్తులు కల్తీ మినరల్ వాటర్ విక్రయిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మాగులూరి నాగేశ్వరరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు తనిఖీలు నిర్వహించి లెసైన్స్ లేని మినరల్ వాటర్ కంపెనీలను మూసివేయించాలని కోరారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ హోదాను ఒంగోలు దక్కించుకున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్కు 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని మరో సభ్యుడు ఫిర్యాదు చేశారు. అధికంగా వసూలు చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రంగాకుమారి, సివిల్ సప్లయిస్ డీఎం కొండయ్య, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఉద్యానవనశాఖ ఏడీలు రవీంద్ర, జెన్నమ్మ, తూనికలు, కొలతలశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ శేషయ్య తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ ఫైళ్లపై దృష్టి సారించండి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్ : పెండింగ్ ఫైళ్లపై దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్ నాయక్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం తన చాంబర్లో కలెక్టరేట్లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ కారణాలతో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫైళ్ల వివరాలు అందించాలన్నారు. మండలాల వారీగా పెండింగ్ ఫైళ్లను సిద్ధం చేసి వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదికలు అందించాలని ఆదేశించారు. మండలాల వారీగా ఏ మండలంలో ఎన్ని ఫైళ్లు ఉన్నాయి, వాటి స్థితిగతులు ఏమిటి, ఎప్పటిలోగా పరిష్కరిస్తారన్న అంశాలపై తహశీల్దార్లతో ప్రతి వారం సమీక్షించనున్నట్లు వెల్లడించారు. వరుసగా ఎన్నికలు రావడం కూడా ఫైళ్ల పెండింగ్పై ప్రభావం చూపిందన్నారు. మున్ముందు పెండింగ్ ఫైళ్లు.. అనేవి లేకుండా చూడాలని చెప్పారు. అందుకుగాను ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేయడం, సంబంధిత అధికారులకు పం పించడం, వాటి స్థితిగతులను తెలుసుకొని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి మిడసల జ్వాలానరసింహం పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement