breaking news
Jug
-
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
హావ్ ఇట్ నుంచి ఆల్కలైన్ జగ్..
త్వరలో మరో మూడు ఉత్పత్తులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హావ్ ఇట్ బ్రాండ్తో ఆల్కలైన్ సొల్యూషన్స్ రంగంలో ఉన్న బ్లూ వాటర్ తాజాగా ఆల్కలైన్ జగ్ను ప్రవేశపెట్టింది. ఆర్వో వాటర్ ప్యూరిఫయర్లను వాడుతున్న కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ దీనిని తీసుకొచ్చింది. నీటి నిల్వ సామర్థ్యం 2.5 లీటర్లు. రెండు నిముషాల్లో జగ్ నిండుతుంది. కార్ట్రిడ్జ్ 4,000 లీటర్లపైనే అందిస్తుందని కంపెనీ తెలిపింది. ధర రూ.4,250. ఇప్పటికే గృహ వినియోగదారుల కోసం ఆల్కలైన్ ఆర్వో, కార్యాలయాల కోసం ఆల్కలైన్ డిస్పెన్సర్ను విక్రయిస్తున్నామని బ్లూ వాటర్ ఫౌండర్ కలిశెట్టి నాయుడు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. త్వరలో మరో మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. ‘నీటిని స్వచ్ఛపరిచేందుకు ఆర్వో విధానం బాగా పనిచేస్తుంది. అయితే కాల్షియం, మెగ్నీషియం వంటి మనిషికి ఆవశ్యకమైన లవణాలన్నీ ఈ ప్రక్రియలో తొలగిపోతాయి. అదే ఆల్కలైన్ విధానంలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం తగు మోతాదులో ఉంటాయని కంపెనీ సహ వ్యవస్థాపకులు డి.పి.రాయ్ వెల్లడించారు. అలాగే పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పారు.