-
బీసీల సంక్షేమానికి మెరుగైన చర్యలు
‘సాక్షి’తో మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధికి మెరుగైన చర్యలను చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 490 హాస్టళ్లలో విద్యార్థులందరికీ 2015-16లో మంచాలు, పరుపులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సోలార్ మోటార్లు, ఆర్వో వాటర్ప్లాంట్లు, ఉన్ని బ్లాంకెట్లు తదితర సదుపాయాలను కల్పిస్తామన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ రాబోయే బడ్జెట్లో బీసీ విద్యార్థుల స్కాలర్షిప్పుల కోసం బడ్జెట్లో రూ.2,600 కోట్ల వరకు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. -
జూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తాం
వరంగల్ పార్కుకు జయశంకర్ పేరు అటవీశాఖ మంత్రి జోగు రామన్న బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు మరిన్ని వన్యప్రాణులను తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. జూలోని వివిధ ఎన్క్లోజర్లను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ మినీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి దానికి తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామన్నారు. జూలోని ఉద్యోగులను వాచ్మెన్, లేబర్గా పిలివడాన్ని మార్చి అసిస్టెంట్ సార్జెంట్గా ఇతర పేర్లకు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. అనంతరం జూలోని జిరాఫీకి మంత్రి అరటి పండు, ఆపిల్ను తినిపించారు. కార్యక్రమంలో రాష్ట్ర జూ పార్కుల డెరైక్టర్, అడిషనల్ పీసీసీఎఫ్ పి.మల్లికార్జున్ రావు, జూ క్యూరేటర్ బి.ఎన్.ఎన్.మూర్తి, జూ ఏసీఎఫ్ పి.శామ్యూల్, జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీం, అసిస్టెంట్ క్యూరేటర్లు మోబీన్, రమేశ్, సరస్వతి, జూ పీఆర్వో హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆ పోస్టులను తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బదిలీ చేసిన నెహ్రూ జూలాజికల్ పార్కులోని 40 పోస్టులను ఉద్యోగులను వెంటనే తెలంగాణకు తీసుకొచ్చి జూలో కాంట్రాక్ట్, డెలీవైజ్గా పని చేస్తున్న ఉద్యోగులతో పర్మినెంట్ చేయాలని జూ యానిమల్ కీపర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. దేవేందర్, ఆయూబ్ కౌసర్ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
ఆదిలోనే హంసపాదు
జైనథ్, న్యూస్లైన్ : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ఆరంభంలోనే రసాభాసగా మారాయి. జైనథ్ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన పత్తిని రైతులే తమ సొంత ఖర్చుతో బేల మండల కేంద్రంలోని జిన్నింగ్ మిల్లుకు తరలించాలని, లేని పక్షంలో మార్కెట్ కమిటీ రవాణ భరించాలని కొనుగోలుదారులు పేర్కొనడంతో ఆదిలోనే కొనుగోళ్లు నిలిచాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు హడావుడిగా కొనుగోళ్లు ప్రారంభిస్తున్నామని ప్రకటించిన మార్కెట్ అధికారులు, పత్తి బండ్లను ఎక్కడ అన్లోడ్ చేయాలనే విషయంలో కొనుగోలుదారులకు, రైతులకు స్పష్టత ఇవ్వకపోవడం సమస్యకు దారితీసింది. లొల్లి ఇలా మొదలు.. జైనథ్ మార్కెట్ యార్డులో శుక్రవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మునిగెల విఠల్, ఎమ్మెల్యే జోగు రామన్న, ఆర్డీవో సుధాకర్రెడ్డి ఎలక్ట్రానిక్ కాంటాల వద్ద పూజలు చేశారు. కాంటాల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ల గదులను ప్రారంభించారు. అనంతరం సీసీఐ, వ్యాపారులు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే కొందరు రైతులు కొనుగోళ్లు సరే, పత్తిబండ్లను ఎక్కడ అన్లోడ్ చేయాలో చెప్పాలని అధికారులను ప్రశ్నించారు. మార్కెట్ అధికారులు, ఆర్డీవో కలుగజేసుకుని రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదని శాశ్వతంగా జైనథ్లోనే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. వ్యాపారుల అడ్డుపుల్ల రైతులు అమ్మిన పత్తి బండ్లను జైనథ్ మార్కెట్ యార్డులోనే అన్లోడ్ చేయాలని పేర్కొనడంతో వ్యాపారులు అడ్డుపడ్డారు. ఇక్కడే అన్లోడింగ్ చేస్తే, పత్తి బండ్లను జిన్నింగ్కి తరలించుటకు అయ్యే రవాణ ఖర్చులు తాము భరించలేమని, రైతులు లేదా మార్కెట్ కమిటీ వారే భరించాలని తెల్చిచెప్పారు. జైనథ్లో పత్తి నిల్వకు వసతులు లేవని, ముఖ్యంగా ఫైర్సేఫ్టీ లేదని వారు అధికారులకు వివరించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొనుగోళ్లు నిలిచాయి. ఎమ్మెల్యే రామన్న కలుగజేసుకుని కొనుగోలు దారులు, కలెక్టర్తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని తేల్చిచెప్పారు. అధికారుల ఆదేశా లు పెడచెవిన పెట్టి మొండిగా వ్యవహరిస్తున్న కొనుగోలుదారులపై చర్యలు తీసుకుంటామని, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆర్డీవో అన్నారు. ఈకార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి పుల్లయ్య, తహశీల్దార్ జ్యోతి, ఎంపీడీవో రామకృష్ణ, మార్కెట్ కార్యదర్శి ఫయాజోద్దీన్, జైనథ్ సర్పంచ్ ప్రమీలా పోతారెడ్డి, ఉపసర్పంచ్ గణేశ్ యాదవ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు కల్చాప్ రెడ్డి, ఏఎంసీ మాజీ అధ్యక్షుడు యాసం నర్సింగ్, ఏఎంసీ మాజీ ఉపాధ్యాక్షుడు భీమ్రెడ్డి, రైతులు కిష్టారెడ్డి, లస్మన్న, అశోక్రెడ్డి, అశోక్ యాదవ్ పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement