breaking news
Joe Burns
-
ఫుట్బాల్లో డీలా... క్రికెట్లో ఇటలీల...
ఫుట్బాల్కు పెట్టింది పేరైన ఇటలీలో ఇప్పుడు మరో క్రీడ ప్రేక్షకాదరణ పొందుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్లో నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006) చాంపియన్గా... మరో రెండుసార్లు (1970, 1994) రన్నరప్గా నిలిచిన ఇటలీ... ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. 2018, 2022లో జరిగిన ‘ఫిఫా’ వరల్డ్కప్ టోర్నీకి అర్హత పొందలేకపోయిన ఆ జట్టు... వచ్చే ఏడాది జరగనున్న ఫుట్బాల్ విశ్వ సమరంలో బరిలోకి దిగడం కూడా అనుమానంగా మారింది. ఘన చరిత్ర... అంతకుమించిన వారసత్వం... అపార నైపుణ్యం... దేశవ్యాప్తంగా ఫుట్బాల్కు మెరుగైన మౌలిక వసతులు ఉన్నా ఈ క్రీడలో తిరోగమనం దిశలో పయనిస్తున్న ఇటలీ... కనీస సౌకర్యాలు లేని క్రికెట్లో మాత్రం సత్తా చాటుతోంది. ప్రాక్టీస్ చేసేందుకు కనీసం పచ్చిక పిచ్లు కూడా లేకున్నా... ప్రపంచకప్నకు తొలిసారి అర్హత సాధించి భళా అనిపించింది. యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటడం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్కప్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న నేపథ్యంలో ఇటలీ క్రికెట్పై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగంఫుట్బాల్ను విపరీతంగా అభిమానించే దేశంలో క్రికెట్కు క్రేజ్ దక్కుతుందా అనే స్థాయి నుంచి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించే స్థాయికి ఇటలీ చేరుకుంది. క్లబ్లు, ఏజ్ గ్రూప్ మ్యాచ్లు, ప్రత్యేక టోర్నీలు, సన్నాహక మ్యాచ్లు ఇలా అన్నీ ఉన్న ఫుట్బాల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్న ఇటలీ... ప్రాక్టీస్ చేసేందుకు సరైన మైదానాలు, మెరుగయ్యేందుకు అవసరమైన కనీస వసతులు లేని క్రికెట్లో మాత్రం రాణిస్తోంది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం వలస వచ్చిన ప్లేయర్లతో నిండిన జట్టు... వారం మొత్తం ఉద్యోగాలు చేసుకుంటూ వారాంతాల్లో వీలు చిక్కినప్పుడు మాత్రమే సాధన చేసే ప్లేయర్లతో ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందడం అంటే మామూలు విషయం కాదు. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ఇటలీ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్లో పటిష్ట టీమిండియాతో ఆడాలనుకుంటున్నట్లు ఆ జట్టు సారథి జో బర్న్స్ వెల్లడించాడు. ఆరస్టేలియా నుంచి ఇటలీకి... ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ కొన్నేళ్ల క్రితం ఇటలీకి వలస వెళ్లాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బర్న్స్ పూర్వీకులుఆ్రస్టేలియాకు వెళ్లగా... ఇప్పుడు మెరుగైన కెరీర్ కోసం అతడు తిరిగి ఇటలీకి చేరుకున్నాడు. అప్పటికే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా... వారికి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోగా... బర్న్స్ రాకతో ఆ ఇబ్బంది తీరింది.అతడితో పాటు ఆ్రస్టేలియాలో దేశవాళీ క్రికెట్ ఆడిన హ్యారీ మనెంటి, బెన్ మనెంటి... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడిన గే, స్టివర్ట్ వంటి ప్లేయర్లు... జాతీయ జట్ల తరఫున అవకాశం దక్కని ఉపఖండ ఆటగాళ్లతో ఇటలీ జట్టులో ప్రతిభకు కొదవ లేకుండా ఎదిగింది. బర్న్స్ సారథ్యంలో ఎప్పటికప్పుడు మెరుగవుతున్న ఇటలీ జట్టు... నెదర్లాండ్స్ తర్వాత ఐసీసీ టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించిన యూరప్ జట్టుగా నిలిచింది. కెవిన్ ఒబ్రియాన్ కోచింగ్లో... ఐర్లాండ్కు చెందిన ఆల్రౌండర్ కెవిన్ ఒబ్రియాన్ ఓసారి ఇటలీలో పర్యటిస్తున్న సమయంలో అక్కడి యువ ఆటగాళ్ల నైపుణ్యం చూసి ముచ్చట పడ్డాడు. మెరుగైన వసతులు లేకపోయినా... ప్లేయర్లలో ఏదో సాధించాలనే తపనను గమనించాడు. అలాంటి పరిస్థితులను దాటుకొని ప్రపంచకప్ స్థాయిలో మెరుపులు మెరిపించిన ఒబ్రియాన్.. అనంతరం కాలంలో ఇటలీ క్రికెట్ జట్టు సహాయక కోచ్గా బాధ్యతలు చేపట్టడంతో ఆ జట్టు దశ తిరిగింది. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్లో ఇంగ్లండ్పై ఐర్లాండ్ రికార్డు లక్ష్యఛేదనతో ఒక్కసారిగా స్టార్గా మారిన ఒబ్రియాన్... ఇటలీ ప్లేయర్లకు గొప్పగా శిక్షణనిచ్చాడు. ఇటలీ జట్టు టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించడంతో తను పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లు అయిందని ఒబ్రియాన్ అన్నాడు. ‘కోచ్గా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా. అసలు కోచింగ్ వైపు అడుగులు వేసినప్పుడు ఇదంతా ఊహించలేదు. కానీ ప్లేయర్లు నిబద్దతతో కృషి చేసి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఎంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలో 2007 వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్లపై ఐర్లాండ్ జట్టు విజయాలు సాధించడంలో ప్లేయర్గా ఒబ్రియాన్ కీలక పాత్ర పోషించాడు. సహాయక కోచ్గా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే ‘ఏజ్ గ్రూప్ క్రికెట్’కు ప్రాధాన్యత ఇచ్చి వాటి ఫలితాలు బోర్డుకు అందించాడు. ప్రపంచకప్తో ఆదరణ దక్కేనా! యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్రారంభానికి రెండు వారాల ముందు... ఇటలీ జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఒలింపిక్స్లో క్రికెట్ను క్రీడాంశంగా ప్రవేశపెట్టడంతో... ఇకపై మరింత తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో షెడ్యూల్లో మార్పులు చేసింది. ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. ఇటలీలో పచ్చిక పిచ్లు అందుబాటులో లేకపోవడంతో... కృత్రిమ పిచ్లపై సాధన చేసేలా జట్టును సిద్ధం చేసింది. ఇతర జట్లతో మ్యాచ్లసంఖ్యను సైతం పెంచింది. ‘టి20 ప్రపంచకప్నకు అర్హత సాధించడం ఒక కీలక మలుపు. మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. సౌకర్యాలు మెరుగైనప్పుడే యువత ఇటువైపు అడుగులు వేస్తుంది.ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో పాల్గొంటే... ఎక్కువ ఆదరణ దక్కుతుంది. తద్వారా దేశంలో ఆటకు ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే స్పాన్సర్లు, ఎండార్స్మెంట్ల రూపంలో ఆదాయం పెరుగుతుంది’ అని ఇటలీ క్రికెట్ జట్టు మేనేజర్ పీటర్ డి వెనుటో అన్నాడు.కలుగమగె కథే వేరు...శ్రీలంకకు చెందిన క్రిషన్ కలుగమగె 15 ఏళ్ల వయసులో ఇటలీకి వలస వెళ్లాడు. మొదట అథ్లెట్ కావాలనుకున్న క్రిషన్ ఆ తర్వాత క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో... ఒక రెస్టారెంట్లో పిజ్జా మేకర్గా పనికి కుదిరాడు. జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు ఒకవైపు పని కొనసాగిస్తూనే... వ్యక్తిగత ఆసక్తిని చంపుకోలేక క్రికెట్ను కొనసాగించాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ 2022లో ఇటలీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటలీలో క్రికెట్కు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో... ఆ తర్వాత కూడా అతడు రెస్టారెంట్ ఉద్యోగం కొనసాగించాల్సిన పరిస్థితి. ఇలాంటి దశలో వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం చేసే పనిని పక్కన పెట్టిన క్రిషన్... ఇటలీ జట్టు వరల్డ్కప్నకు అర్హత సాధించిన తర్వాత వచ్చిన స్పందనతో ఆశ్చర్యపోయాడు. ‘క్వాలిఫయింగ్ టోర్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ వందలాది మంది పూలు, స్వీట్లతో నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఏమాత్రం ఊహించనిది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యా’ అని కలుగమగె అన్నాడు. స్టీరింగ్ పక్కన పెట్టి... 2006లో కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్ప్రీత్ సింగ్... అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఇటలీ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్ మాదిరిగా అక్కడ క్రికెట్కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ పొట్ట కూటి కోసం క్యాబ్ డ్రైవర్గా కొనసాగుతున్నాడు. 2024 టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సమయంలోనే ఇటలీ జట్టు త్రుటిలో మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం కోల్పోవడంతో... ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో... స్టీరింగ్ను పక్కన పెట్టిన జస్ప్రీత్ పూర్తిగా క్రికెట్పై దృష్టి పెట్టాడు. అందుకు తగ్గ ఫలితం దక్కడం ఆనందంగా ఉందని అతడు వెల్లడించాడు. ‘వరల్డ్కప్కు తొలిసారి అర్హత సాధించిన ఇటలీ జట్టులో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్లమయ్యాక ముందు తరాలకు చెప్పుకునేందుకు ఇంతకు మించి ఇంకేం కావాలి’ అని అన్నాడు. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్
ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాటర్ జో బర్న్స్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు (ఆస్ట్రేలియా, ఇటలీ) చేసిన ఆరో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే ఇటలీకి వలస వెళ్లిన బర్న్స్.. టీ20 వరల్డ్కప్ 2026 యూరోపియన్ క్వాలిఫయర్లో భాగంగా రొమేనియాతో జరిగిన మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు.ఈ మ్యాచ్లో 55 బంతులు ఎదుర్కొన్న బర్న్స్ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. బర్న్స్ శతక్కొట్టుడుతో పాటు జస్టిన్ మోస్కా (30 బంతుల్లో 72; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రొమేనియా 17.4 ఓవర్లలో 84 పరుగులకే చాపచుట్టేసి 160 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.అంతర్జాతీయ క్రికెట్లో రెండు దేశాల తరఫున సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..కెప్లెర్ వెసెల్స్- ఆస్ట్రేలియా (5 సెంచరీలు), సౌతాఫ్రికా (2 సెంచరీలు)ఇయాన్ మోర్గాన్- ఐర్లాండ్ (1), ఇంగ్లండ్ (15)ఎడ్ జాయ్స్- ఐర్లాండ్ (5), ఇంగ్లండ్ (1)గ్యారీ బ్యాలెన్స్- ఇంగ్లండ్ (4), జింబాబ్వే (1)మార్క్ చాప్మన్- హాంగ్కాంగ్ (1), న్యూజిలాండ్ (2)జో బర్న్స్- ఇంగ్లండ్ (4), ఇటలీ (1) -
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జో బర్న్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సొంతదేశాన్ని వీడి ఇటలీ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. ఇటలీని టీ20 వరల్డ్కప్ 2026కు అర్హత సాధించేలా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ ఏడాది తనువు చాలించిన తన సోదరుడు డొమ్నిక్ బర్న్స్కు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. డొమ్నిక్ గౌరవార్ధం తన జెర్సీపై 85 నంబర్ను ధరించనున్నట్లు వెల్లడించాడు. డొమ్నిక్ తన చివరి మ్యాచ్లో ఇదే సంఖ్య గల జెర్సీని ధరించినట్లు చెప్పుకొచ్చాడు. తన తల్లి ఇటలీ పౌరసత్వం కలిగి ఉండటంతో బర్న్స్ ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు అర్హత సాధించాడు. పై పేర్కొన్న కారణాలే కాకుండా బర్న్స్ ఆస్ట్రేలియాను వీడేందుకు మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అతనికి ఈ ఏడాది (2024-25) తన సొంత దేశవాలీ జట్టైన క్వీన్స్లాండ్ జట్టు కాంట్రాక్ట్ లభించలేదు. అలాగే బిగ్బాష్ లీగ్తోనూ బర్న్స్ కాంట్రాక్ట్ ముగిసింది. పై పేర్కొన్న కారణాలన్నిటినీ చూపుతూ బర్న్స్ ఆస్ట్రేలియాకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టా వేదికగా తన సందేశాన్ని పంపాడు. 34 ఏళ్ల బర్న్స్ 2014-2020 మధ్యలో ఆస్ట్రేలియా తరఫున 23 టెస్ట్లు, 6 వన్డేలు ఆడి 1608 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు (టెస్ట్లు), 8 హాఫ్ సెంచరీలు (7 టెస్ట్, ఒకటి వన్డే) ఉన్నాయి.ఇదిలా ఉంటే, ఇటలీ ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ ప్రపంచకప్కు అర్హత సాధించలేదు. ఈ దేశానికి 2026 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. జూన్ 9 నుంచి జరిగే వరల్డ్కప్ రీజియనల్ క్వాలిఫయర్స్లో ఇటలీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ పోటీల్లో ఇటలీ.. ఫ్రాన్స్, ఐసిల్ ఆఫ్ మ్యాన్, లక్సంబర్గ్, టర్కీ జట్లతో పోటీపడుతుంది. -
స్మిత్ పుండుమీద కారం చల్లిన అభిమాని!
క్రైస్ట్ చర్చ్: ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం ఎంత మామూలు విషయమో!.. వారిపై అభిమానులు విమర్శలకు దిగడం అంతే సహజం! తాజాగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, జోస్ బర్న్స్పై న్యూజిలాండ్కు చెందిన ఓ క్రికెట్ అభిమాని వినూత్న రీతిలో విమర్శలు చేశాడు. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ను వీక్షిస్తున్న సదరు కివీస్ అభిమాని ‘పెద్దగా ఉపయోగంలో లేని క్రికెట్ బ్యాట్లు అమ్మబడును’ అనే ప్లకార్డు ప్రదర్శించాడు. బ్యాట్లు కావాల్సిన వారు స్మిత్, బర్న్స్ను సంప్రదించాలని పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన రెండు టెస్టుల్లోనూ స్మిత్, బర్న్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అర్థ సెంచరీ చేసిన బర్న్స్, రెండో టెస్టులో తేలిపోయాడు. కేవలం 0,4 పరుగులే చేశాడు. ఇక టెస్టుల్లో కీలక ఆటగాడు స్మిత్ తాజా సిరీస్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్లలో కేవలం 1,1*,8,0 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు పేవల ప్రదర్శన కారణంగా బర్న్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా చివరి రెండు టెస్టులకు ఇప్పటికే పక్కన పెట్టేసింది. అసలే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు ఆటగాళ్లకు చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ అభిమాని విమర్శ పుండుమీద కారం చల్లినట్టుగా మారింది. (చదవండి: అతడి తర్వాత మళ్లీ బుమ్రానే: అక్తర్) -
డేవిడ్ వార్నర్ ఇన్.. బర్న్స్ అవుట్
సిడ్నీ : టీమిండియాతో జరగనున్న మూడో టెస్టుకు ఆసీస్ విధ్వంసక ఆటగాడు డేవిడ్ వార్నర్ అందుబాటులోకి రానున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో ఆడిన ఓపెనర్ జో బర్న్స్ స్థానంలో వార్నర్ను ఎంపిక చేసినట్లు ఆసీస్ జట్టు సెలెక్టర్ ట్రేవర్ హోన్స్ తెలిపాడు. ఈ మేరకు మూడు, నాలుగు టెస్టులకు 18 మందితో ఆసీస్ జట్టును ప్రకటించింది. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే.గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్కు దూరమయ్యాడు. (చదవండి : ‘స్టీవ్ స్మిత్పై నాకు నమ్మకం ఉంది’) అయితే వార్నర్ టెస్టు సిరీస్కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు.. కానీ గాయం తీవ్రతపై స్పష్టం లేకపోవడంతో మొదటి రెండు టెస్టులకు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. వాస్తవానికి జో బర్న్స్ మొదటి రెండు టెస్టుల్లో పర్వాలేదనిపించే ప్రదర్శన నమోదు చేశాడు. బర్న్స్ నాలుగు ఇన్నింగ్స్ల్లో 8,51*, 0,4 కలిపి 125 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. అయితే మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ప్రదర్శన స్థిరంగా ఉండడంతో వార్నర్ కోసం బర్న్స్ను పక్కడపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. మరోవైపు త్యాగి బౌన్సర్తో గాయపడ్డ పుకోవిస్కిని ఎంపిక చేసినా తుది జట్టులోకి వచ్చే దానిపై స్పష్టత లేదని తెలిపింది. కాగా వార్నర్ రాకతో ఆసీస్ కాస్త బలంగా తయారైనట్లు కనిపిస్తుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియాపై ఘన విజయం సాధించిన ఆసీస్కు మెల్బోర్న్లో షాక్ తగిలింది. టీమిండియా సమిష్టి ప్రదర్శనతో రెండో టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగనుంది. ఆస్ట్రేలియా జట్టు డేవిడ్ వార్నర్, విల్ పుకోవిస్కీ, మార్కస్ హారిస్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రేవిస్ హెడ్, మాట్ హెన్రిక్స్, టిమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమిన్స్, కెమెరాన్ గ్రీన్, సీన్ అబాట్,నాథన్ లైయన్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, జోష్ హాజిల్వుడ్, జేమ్స్ ప్యాటిన్సన్, మైఖేల్ నాజర్ -
నాన్నకు చెబితే నమ్మలేదు
ఆసీస్ జట్టులో చోటుపై జో బర్న్స్ మెల్బోర్న్: ఆల్రౌండర్ మిషెల్ మార్ష్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్న 25 ఏళ్ల బ్యాట్స్మన్ జో బర్న్స్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘బాక్సింగ్ డే’ టెస్టు కోసం జట్టులోకి ఎంపికయ్యాననే వార్తను తన తండ్రికి చెబితే ఏమాత్రం నమ్మలేదని అన్నాడు. ‘నా తండ్రి ఈ వార్తను అస్సలు పట్టించుకోలేదు. దీంతో కాస్త నిరాశకు గురయ్యాను. నేను ఆసీస్ క్రికెట్కు వీరాభిమానిని. ప్రతీ మ్యాచ్ను ఫాలో అవుతాను. నేను అభిమానించే లీమన్ ఆధ్వర్యంలో జట్టుకు ఆడేందుకు ఎదురుచూస్తున్నాను. ఓరకంగా నా కల నిజమైంది’ అని బర్న్స్ ఆనంద ం వ్యక్తం చేశాడు.