-
జీతూ గురి అదిరె...
షూటింగ్లో భారత స్టార్స్ మళ్లీ మెరిశారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో జీతూ రాయ్ స్వర్ణం... ఓం మితర్వల్ కాంస్యం గెలిచారు. ఫైనల్లో జీతూ రాయ్ 235.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఓం మితర్వల్ 214.3 పాయింట్లు సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ (247.2 పాయింట్లు) రజతం, అపూర్వీ చండిలా (225.3 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. రజతంతో ముగించిన లిఫ్టర్లు.. వెయిట్లిఫ్టింగ్ పోటీల చివరి రోజు భారత్కు రజతం లభించింది. పురుషుల 105 కేజీల విభాగంలో ప్రదీప్ సింగ్ మొత్తం 352 కేజీల (స్నాచ్లో 152+క్లీన్ అండ్ జెర్క్లో 200) బరువెత్తి రజత పతకం గెలిచాడు. ఓవరాల్గా ఈ గేమ్స్లో వెయిట్లిఫ్టింగ్లో భారత్కు ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించడం విశేషం. -
కామన్వెల్త్లో భారత్ గోల్డెన్ రన్!
గోల్డ్కోస్ట్: ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. తాజాగా భారత షూటర్ జీతు రాయ్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించాడు. సోమవారం జరిగిన ఈ పోటీల్లో రికార్డు పాయింట్లతో అతను గోల్డ్ మెడల్ను కొల్లగొట్టాడు. కాగా, ఇదే పోటీలో మరో భారత షూటర్ ఓంప్రకాశ్ మిథర్వాల్ కాంస్యం పతకాన్ని సాధించాడు. సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ పోటీలో 235.1 పాయింట్లు సాధించి.. జితు రాయ్ మొదటిస్థానాన్ని సాధించగా.. ఆస్ట్రేలియా షూటర్ కెర్రీ బెల్ 233.5 పాయింట్లతో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 214.3 పాయింట్లతో ఓంప్రకాశ్ కాంస్యాన్ని సాధించాడు. దీంతో భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో పతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 84 పతకాల (31 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు)తో మొదటిస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ 48 పతకాల(19 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు)తో రెండోస్థానంలో ఉంది. -
రికార్డు స్కోరుతో స్వర్ణం
తిరువనంతపురం: జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ షూటర్ జీతూరాయ్ పసిడి గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఫైనల్ పోరులో రికార్డు స్థాయిలో 233 పాయింట్లు సాధించి పసిడితో మెరిశాడు. ఈ ఫైనల్ ఈవెంట్లో జీతూరాయ్ సాధించిన 233 స్కోరే అత్యధికం కావడం ఇక్కడ విశేషం. మరొకవైపు ఓంకార్ సింగ్ (222.4), జై సింగ్ (198.4) వరుసగా రజతం, కాంస్యం దక్కించుకున్నారు. జట్టు విభాగంలో జీతూ, ఓం ప్రకాశ్, జై సింగ్ల బృందం 1658 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. ఎయిర్ ఫోర్స్ జట్టు (1626)కు రజతం, పంజాబ్ (1624) కాంస్యం దక్కాయి. జూనియర్ పురుషుల విభాగంలో అర్జున్ సింగ్ చిమా 226.5 పాయింట్లతో స్వర్ణం గెలిచాడు. సురీంద్ సింగ్ (221.9), అమోల్ జైన్ (205.1) తో రజత, కాంస్యాలు సాధించారు. -
జీతూరాయ్ కు కాంస్యం
న్యూఢిల్లీ:అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య(ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్ లో భారత్ షూటర్ జీతూరాయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో జీతూరాయ్ మూడోస్థానంలో నిలిచి కాంస్యాన్ని సాధించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో జీతూరాయ్ 216.7 పాయింట్లతో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఈవెంట్ తొలి కాంపిటేషన్ రౌండ్ ముగిసిన తరువాత ఏడో స్థానంలో నిలిచిన జీతూరాయ్.. ఆ తరువాత సత్తా చాటుకుంటూ క్రమేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. రజత పతకాన్ని సాధించడానికి జీతూరాయ్ తీవ్రంగా యత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఇందులో జపాన్ కు చెందని తముయుకి మత్సుద 240.1 పాయింట్లతో పసిడిని సాధించగా, వియత్నాంకు చెందిన విన్హ హాంగ్ 236.6 పాయింట్లతో రజతం సాధించాడు. జీతూరాయ్ తాజా పతకంతో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది.అంతకుముందు జీతూరాయ్-హీనా సిద్ధూ జోడి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లో పసిడి సాధించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అంకుర్ మిట్టల్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్ లో రజత పతకాన్ని సాధించాడు. -
రియో నుంచి భారత స్టార్ షూటర్ ఔట్
భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ మరోసారి నిరాశపరిచాడు. బుధవారం జరిగిన 50 మీటర్ల పిస్టర్ విభాగంలో ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. చివరి రౌండ్ లో 8, 8 తో స్టార్ట్ చేసిన జీతూ.. కేవలం 554 పాయింట్లు స్కోర్ చేసి 12వ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయాడు. మరో షూటర్ ప్రకాశ్ నంజప్పా 547 పాయింట్లు స్కోరు చేసి 25వ స్థానంలో నిలిచి దారుణ ప్రదర్శన చేశాడు. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా టాప్ 8 లో నిలవాల్సిన ఈవెంట్లో భారత షూటర్లు గురి తప్పారు. రియోలో పోటీపడ్డ తొలి ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో నిరాశపరిచిన జీతూ.. అతి కష్టం మీద ఫైనల్కు అర్హత సాధించినా పతకం నెగ్గలేకపోయిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా ఆర్చర్ బొంబేలా దేవి బాణం గురితప్పలేదు. రౌండ్-64, రౌండ్-32లలో ఏకాగ్రతతో బాణాలు సంధించి విజయాన్ని నమోదుచేసి రౌండ్-16(ప్రీ క్వార్టర్స్) కు చేరుకుని భారత శిబిరంలో ఆశలు నింపింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement