'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు' | I have not spoken to my mother for one month, says Jitu Rai | Sakshi
Sakshi News home page

'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు'

Sep 21 2014 8:34 PM | Updated on Sep 2 2017 1:44 PM

'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు'

'నెల రోజులుగా అమ్మతో మాట్లాడలేదు'

దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో కాంస్యం గెలిచిన జీతూ రాయ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు.

ఇంచియూన్: దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ లో కాంస్యం గెలిచిన జీతూ రాయ్ ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు. తాజాగా 10 మీ. ఎరుుర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యంతో కలుపుకుని 2014లో ఏడు పతకాలు సాధించాడు. ఈ సీజన్‌లో విజయువంతం కావడంపై ఈ భారత షూటర్ తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఇదే జోరును 2016 రియో ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తానని ధీమాగా చెబుతున్నాడు.  ఇక ఆసియూ క్రీడల్లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్న జీతు తాను అనుకున్నది సాధించడం కోసం కనీసం తన తల్లితో కూడా ఫోన్‌లో మాట్లాడలేదట.

 

‘గత నెల్లో ప్రపంచ చాంపియున్‌షిప్ కోసం స్పెయిన్‌కు వెళ్లినప్పటి నుంచి అమ్మతో మాట్లాడలేదు. నేను స్వర్ణం గెలిచిన విషయుం అమ్మకు ఇంకా తెలియులేదు. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి అమ్మతో మాట్లాడతా'అని జీతూ రాయ్ తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement