breaking news
jinna
-
వందే మాతరం కంపల్సరీ పాడాల్సిందే!
ఇక నుంచి అన్ని విద్యాసంస్థల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలాపన తప్పనిసరి చేస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. లక్నో: సోమవారం ఏక్తా యాత్ర పేరిట గోరఖ్పూర్లో జరిగిన సామూహిక వందేమాతర ఆలాపన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొని మాట్లాడారు. ఐక్యత, దేశభక్తి భావనను విద్యార్థుల్లో నాటేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారాయన. ‘‘వందే మాతరానికి తగినంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే.. ప్రతి విద్యాసంస్థలో దీన్ని తప్పనిసరిగా ఆలపించాలి. దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది’’ అని అన్నారాయన. ఈ సందర్భంగా.. వందే మాతరం వ్యతిరేకతపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నేతలు మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ జౌహర్ ఈ ఇద్దరూ ఆనాడు వందే మాతరాన్ని వ్యతిరేకించారు.. తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 1923లో జౌహర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వందే మాతరం ప్రదర్శించిన సమయంలో సభను వదిలి వెళ్లిపోయారు. ఒకరకంగా.. విభజనకు దారితీసిన కారణాల్లో అది కూడా ఒకటి. విభజన భావనలకు తావు లేకుండా, మరో జిన్నా పుట్టకూడదని ప్రజలు బలంగా కోరుకోవాలి. జాతీయ ఐక్యతను సవాల్ చేయాలనే దుస్సాహం ఎవరూ చేయకూడదు. అలాంటి ఆలోచనను కూకటి వేళ్లతో పెకిలించివేయాలి అని అన్నారాయన. ఈ క్రమంలో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీకి ఆయన చురకలంటించారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఓ ఎంపీ జాతీయ గేయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వాళ్లు భారత ఐక్యతకు శిల్పి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పట్టించుకోరు. కానీ, జిన్నాను గౌరవించే కార్యక్రమాలకు మాత్రం హాజరవుతుంటారు అని అన్నారాయన. యోగి సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో వందే మాతరం పాడటం తప్పనిసరి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. వందే మాతరానికి 150 ఏళ్లుబంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఆనంద్మఠ్ నవలలోని బంగదర్శన్లో వందే మాతరం ఉంది. 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ గేయాన్ని విడుదల చేశారు. ఆ తర్వాత స్వాతంత్ర్య పోరాటానికి ఈ గేయం ప్రేరణగా నిలిచింది. 150 సంవత్సరాలు పూర్తి కావడంతో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతరం ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంలో వందే మాతరం భారత ఐక్యతకు ప్రతీక. ఇది దేశ ప్రజలకు కొత్త శక్తిని, ప్రేరణను ఇస్తుంది అని వ్యాఖ్యానించారు. 2026 నవంబర్ 7 వరకు వందే మాతరం ఉత్సవాలు కొనసాగనున్నాయి. -
మంచు విష్ణు జిన్నా మూవీ ప్రమోషన్స్(ఫొటోలు)
-
హైద్రాబాద్ విషాదం
విమర్శ ప్రపంచ చరిత్రలోనే అఖండ భారత విభజన అత్యంత విషాదకర, హింసాత్మక సంఘటన. హిందూ-ముస్లిం సమాజాలకే కాదు, కొందరికి వ్యక్తిగతంగా కూడా ఆ విభజన చేదు అనుభవాలను మిగిల్చింది. అందుకే ఆ అంశం మీద ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. భీష్మ సహానీ, అమృతా ప్రీతమ్, గుల్జార్, కుష్వంత్ సింగ్, సాదత్ హసన్ మంటో వంటి ఎందరో విభజన విషాదం గురించి గొప్ప రచనలు చేశారు. ఇవికాక డామినిక్ లాపిరె, ల్యారీ కోలిన్స్ వంటి విదేశీయుల ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ వంటి పుస్తకాలు కూడా కోకొల్లలు. ఈ విభజన విషాదంలో హైదరాబాద్ పాత్ర ప్రత్యేకమైనది. ఆ అంశాన్ని చర్చించేదే ‘హైదరాబాద్ విషాదం’. పుస్తక రచయిత మీర్ లాయక్ అలీ (అను: ఏనుగు నరసింహారెడ్డి) ఆ ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షి. ఆయన హైదరాబాద్ సంస్థానానికి ప్రధాని. జిన్నా, నిజాం సంబంధాల గురించి పూర్తిగా తెలిసినవారు. పుస్తకంలో 34 అధ్యాయాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన చివరి రెండేళ్లు, భారత విభజన, శరణార్థులు, విభజన తరువాత మహ్మదలీ జిన్నా (ఖాయిద్ ఏ ఆజమ్) వైఖరి, ఆఖరి నిజాం, రజాకార్లు వంటి కీలక అంశాలు ఇందులో చర్చకు వస్తాయి. గాంధీ హత్య, నిజాం లొంగుబాటు వంటి అంశాలను ఈ చరిత్ర నుంచి మినహాయించడం సాధ్యంకాదు. కాబట్టి రచయిత ఆ అంశాలను కూడా విశేషంగా చర్చించారు. చరిత్ర రచన పద్ధతికీ, చరిత్ర ఇతివృత్తంగా వచ్చిన సృజనాత్మక రచనా విధానానికీ మధ్య సాగే లాయక్ అలీ శైలి గురించి మొదట ఎవరైనా చెప్పుకోవాలి. గొప్ప భాషతో, గొప్ప శైలితో నడిచినా, చరిత్ర రచనలో వాస్తవాలదే ప్రధాన పాత్ర కావాలి. ఆ విధంగా చూసినప్పుడు అలీ కొన్నిచోట్ల పాక్షిక దృష్టి బారిన పడ్డారని (చాలామంది ఇతర రచయితల మాదిరిగానే) అనుకోవలసివస్తుంది. హైదరాబాద్ సంస్థానంలో హిందువులు అధిక సంఖ్యాకులు. కానీ పాలకులు మహమ్మదీయులు. ఈ రాజ్యం స్వతంత్రంగా ఉండదలిచింది. అయినా ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఆయన అనుమానపడటం గమనార్హం. ముస్లింలీగ్లో కంటే ఎక్కువ మంది ముస్లిం సభ్యులను కలిగి ఉన్న జాతీయ కాంగ్రెస్ను ఆయన హిందూమత సంస్థగానే పేర్కొనడం మరొకటి. అలాగే ఖాయిద్ ఏ ఆజమ్ (జాతిపిత) జిన్నా జీవితంలోని దశలను గురించి చెప్పి ఉంటే ఆయన మొత్తం వ్యక్తిత్వం ఆవిష్కృతమై ఉండేది. ఈ పుస్తకంలో (264వ పేజీ, మరికొన్ని చోట్ల) ‘జిన్నా శ్రీమతి’ అని పేర్కొన్నారు. 1947-48 నాటి కాలానికి సంబంధించిన చరిత్రలో ఆమెకు స్థానం లేదు. జిన్నా భార్య రతన్బాయి పెటిట్ 1929లోనే మరణించారు. ముంబై నుంచి జిన్నా వెంట పాకిస్తాన్ వెళ్లి, అక్కడే చివరి వరకు ఆయనను వెన్నంటి ఉన్న మహిళ ఫాతిమా. ఆమె జిన్నా చెల్లెలు. ‘మై బ్రదర్’ పేరుతో జిన్నా జీవిత చరిత్ర కూడా రాశారు. ఆమె దంత వైద్యురాలు. ఇక్కడ లాయక్ అలీ పొరబడి ఉంటాడని అనుకోలేం. తరువాతి ముద్రణలో ఇది సరిచూడడం అవసరం. ఈ పుస్తకంలోని అంశాలతో విభేదించడానికి చాలా ఆధారాలు దొరుకుతాయి. హైదరాబాద్లో ముస్లింలు, హిందువుల మనస్తత్వాల గురించి అలీ ప్రతిపాదించిన వాదన సంపూర్ణం కాదు. ఇది పీవీ నరసింహారావు ‘ఇన్సైడర్’ స్పష్టం చేస్తుంది కూడా. కానీ విభజన, పాక్-హైదరాబాద్ సంబంధాలు, విలీనం వంటి చారిత్రక చిత్రాలు ఎంతో అద్భుతంగా కళ్లకు కట్టారు రచయిత. అనువాదం కూడా అంతే రమణీయంగా ఉంది. -కల్హణ -
గీతోపదేశం మూవీ స్టిల్స్


