breaking news
Jindal Steel & Power
-
ఇండియాలో అత్యంత సంపన్న మహిళగా రికార్డు
Savitri Jindal - Top Richest Women In India: పురాణాల్లో సావిత్రి అంటే భర్తే లోకంగా బతికే ఓ మహిళ. భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ సావిత్రి ఏకంగా యముడితోనే పోరాటం చేసి విజయం సాధించింది. కానీ ఈ సావిత్రి భర్త ప్రాణాలతో సమానమైన అతని ఆశయాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. అంతేకాదు దేశంలో అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన జిందాల్ గ్రూపుకి చుక్కానిలా మారింది. 14 లక్షల కోట్లకు పైగా సంపదతో దేశంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా రికార్డులెక్కింది. ఇటీవల ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ధనవంతులైన మహిళల జాబితాలో సావిత్రి జిందాల్ రూ. 13.46 లక్షల కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. అంతకు ముందు ఏడాది ఆమె సంపద విలువ 9.72 లక్షల కోట్లు. ఏడాదిలో తన కంపెనీ విలువని 3.34 లక్షల కోట్ల మేరకు పెంచగలిగారు. ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థంగా నిర్వ్వహిస్తున్న సావిత్రీ ఏ బిజినెస్ స్కూల్లోనూ చదువుకోలేదు. ఆ మాటకొస్తే పెద్దగా కాలేజీకి వెళ్లింది కూడా లేదు. తొమ్మిది మంది పిల్లల తల్లిగా యాభై ఏళ్ల పాటు ఇంటికే పరిమితమైన ఆమె.. ఒక్కసారిగా 55 ఏళ్ల వయస్సులో కార్పొరేట్ వరల్డ్లోకి అడుగు పెట్టారు. ఎవ్వరూ ఊహించలేని విజయాలను సాధించారు. ఇంతకీ ఎవరీ సావిత్రి. ఆమె వెనుక ఉన్న విజయ రహస్యం ఏంటీ ? మహిళ వెనుక పురుషుడు ప్రతీ మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఈ మహిళ సాధించిన విజయాల వెనుక ఓ పురుషుడు ఉన్నాడు. సావిత్రి విజయపరంపరకు వేదికను నిర్మించింది ఆమె భర్త ఓం ప్రకాశ్ జిందాల్. అంటే జిందాల్ గ్రూపు వ్యవస్థాపకుడు. ఓం ప్రకాశ్ జిందాల్కి చిన్నతనం నుంచి మెషిన్లంటే వల్ల మానిన అభిమానం. ఏ పరికరం కనిపించినా దాని భాగాలు పరిశీలిస్తూనే ఉండేవారు. అలా ఓ సారి ఓ పైపుపై మేడ్ ఇన్ ఇంగ్లండ్ అనే అక్షరాలు కనిపించాయి. మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్తో కనీసం పైపులయినా తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ తపనతోనే ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేకుండానే కేవలం తనకున్న అనుభవంతోనే 22 ఏళ్ల వయస్సులో బకెట్ల తయారీ పరిశ్రమ ఓం ప్రకాశ్ జిందాల్ స్థాపించారు. పన్నెండేళ్ల పాటు బకెట్లు తయారు చేస్తూ.. ఆ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని పెట్టుబడిగా మార్చి 1962లో కోల్కతా దగ్గర పైపుల పరిశ్రమను స్థాపించారు. అది క్లిక్ కావడంతో 1969లో అక్కడే జిందాల్ స్ట్రిప్ని నెలకొల్పారు. అప్పుడే సావిత్రి ఆయన జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. స్టీల్, పవర్, మైనింగ్, గ్యాస్, ఆయిల్ సెక్టార్లలో జిందాల్ గ్రూప్ని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు. ఆ తర్వాత రాజకీయాలవైపు మళ్లి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. హరియాణాలోని హిసార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పరిశ్రమల మంత్రిగా పని చేశారు. పిల్లల బాగోగులు చూసుకుంటూనే భర్తలోని కార్యదక్షతను దగ్గరగా గమనించారు సావిత్రి. అదే అమెకు బలమయ్యింది. మూన్నాళ్ల ముచ్చటే తొమ్మిది సంతానంతో ఇంటి పనులకే పరిమితమైన సావిత్రి స్టీలు, పవర్ సెక్టార్లో ఉన్న జిందాల్ గ్రూపుని సమర్థంగా నిర్వహించలేదనే విమర్శలు వచ్చాయి. కేవలం ఆయన భార్యగా ఆ హోదాలో కొన్నాళ్ల పాటే ఆమె చైర్ పర్సన్గా ఉంటారని, తర్వాత స్థానం తమదే అనుకున్న జిందాల్ బోర్డు గ్రూపు సభ్యులు.. వందతులు వ్యాపింప చేశారు. ఓం ప్రకాశ్తోనే జిందాల్ గ్రూపు ప్రభ పోతుందని ఇకపై మార్కెట్లో ఆ గ్రూపు కనిపించదని ప్రత్యర్థుల ఆశలు పెట్టుకున్నారు. కానీ ఓం ప్రకాశ్ జిందాల్ని దగ్గర నుంచి గమనించిన సావిత్రికి భర్త ఆశయాలు బాగా తెలుసు. అంచనాలు తారుమారు ఇండస్ట్రియల్ సెక్టార్లో మిషన్ మ్యాన్గా ఓం ప్రకాశ్ జిందాల్కి పేరుంది. ఎవరికీ కనిపించని అవకాశాలను వెతికి పట్టుకుంటారని పేరు. అచ్చంగా దాన్ని ఆచరణలో చూపించారు సావిత్రి. వంటింట్లో ఉన్న మహిళ కార్పొరేట్ ఎత్తులను తట్టుకోలేదని, కూలబడిపోతుందని వేసిన అంచనాలను ఆమె తప్పని నిరూపించారు. తను కంపెనీ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిందాల్ గ్రూప్ సంపదను నాలుగింతలు పెంచి విమర్శకుల చేత ఔరా అనిపించారు. భర్త అడుగు జాడల్లో నడుస్తూ హిసార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రెవెన్యూ మంత్రిగా కూడా సేవలు అందించారు. స్టీల్, పవర్తో పాటు మైనింగ్, గ్యాస్, ఆయిల్ సెక్టార్లలోకి వ్యాపారాన్ని విస్తరింప చేశారు. సంపన్న మహిళ భర్త చాటు భార్యగా తొమ్మిది మంది పిల్లలకు తల్లిగా పెద్దగా ఎప్పుడూ గడప దాటని ఈ మహిళ ఈ రోజు పురుషాధిక్య ప్రపంచంలో తనదైన వెలుగులు విరజిమ్ముతోంది. ఫలితంగా ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ధనవంతుల జాబితాలో ఇండియాలోనే అత్యధిక సంపన్నురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. 71 ఏళ్ల వయస్సులోనూ జిందాల్ గ్రూపుని సావిత్రి సమర్థంగా నిర్వహిస్తున్నారు. -
గ్లెన్మార్క్ ఫార్మా- జిందాల్ స్టీల్.. బోర్లా
జనరిక్ ఔషధాల ధరలను కృత్రిమంగా పెంచిన ఆరోపణలతో యూఎస్ జిల్లా కోర్టులో దేశీ హెల్త్కేర్ కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్పై కేసు దాఖలైంది. కొలెస్టరాల్ చికిత్సతోపాటు ఇతర వ్యాధులకు వినియోగించే జనరిక్ ఔషధాల ధరల నిర్ణయంలో అపోటెక్స్ కార్ప్తో గ్లెన్మార్క్ చేతులు కలిపిన ఆరోపణలపై కేసు దాఖలైనట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనంటూ గ్లెన్మార్క్ ఫార్మా తాజాగా పేర్కొంది. ఇవి తప్పని నిరూపించే ఆధారాలు తమవద్ద ఉన్నట్లు తెలియజేసింది. 2013-15 మధ్య కాలంలో కొన్ని ఔషధాల ధరలను జనరిక్ కంపెనీలు అధికంగా నిర్ణయించిన ఆరోపణలతో ఫిలడెల్ఫియా జిల్లా కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్లెన్మార్క్ ఫార్మా షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 4.5 శాతం పతనమై రూ. 430 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 424 దిగువకు చేరింది. గత రెండు రోజుల్లో ఈ షేరు 8 శాతం నీరసించింది. జూన్ 22న సాధించిన ఏడాది గరిష్టం రూ. 573 నుంచి 25 శాతం క్షీణించింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఒమన్లోని ప్లాంటును విక్రయించేందుకు పశ్చిమాసియా బ్యాంక్ ఆల్పెన్ క్యాపిటల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) తాజాగా పేర్కొంది. బిలియన్ డాలర్ల ఎంటర్ప్రైజ్ విలువతో విక్రయ వ్యవహారాన్ని నిర్వహించేందుకు ఆల్పెన్ క్యాపిటల్ను ఎంపిక చేసుకున్నట్లు తెలియజేసింది. ఒమన్ ప్లాంటు 2.4 ఎంటీ వార్షిక సామర్థ్యంతో ఏర్పాటైంది. రూ. 5600 కోట్లమేర రుణ భారాన్ని కలిగి ఉంది. కీలకంకాని ఆస్తుల విక్రయం ద్వారా రుణ భారాన్ని తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు ఈ సందర్భంగా జేఎస్పీఎల్ వివరించింది. ఈ నేపథ్యంలో జిందాల్ స్టీల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 153 వద్ద ట్రేడవుతోంది. -
రూ.10,000 కోట్ల సమీకరించనున్న జేఎస్పీఎల్
న్యూఢిల్లీ: నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) కంపెనీ, ఎన్సీడీలు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.10,000కోట్ల నిధులు సమీకరించనున్నది. ఆగస్టులో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో ఈ నిధుల సమీకరణకు వాటాదారుల ఆమోదం కోరతామని జేఎస్పీఎల్ పేర్కొంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ) జారీ ద్వారా రూ.5,000 కోట్లు, ఇతర సెక్యూరిటీల ద్వారా రూ.5,000 కోట్లు నిధుల సమీకరించే ప్రతిపాదనకు సోమవారం జరిగిన కంపెనీ బోర్డ్ మీటింగ్ ఆమోదం తెలిపిందని జేఎస్పీఎల్ వెల్లడించింది.