breaking news
Jharkhand election
-
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
ఈ ఫలితాలు చెప్పేదేమిటి?
ఆరు నెలలక్రితం దేశం మొత్తాన్ని కుదిపేసిన నరేంద్ర మోదీ ప్రభంజనం ఇంకా సజీవంగానే ఉన్నదని మంగళవారం వెలువడిన జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్ ఫలితాలు నిరూపించాయి. జమ్మూ-కశ్మీర్లో బీజేపీ ‘మిషన్ 44 ప్లస్’ పేర బ్యాలెట్ పోరుకు సమరశంఖం పూరించినా కశ్మీర్లోయలో దాని ప్రతిధ్వని వినబడలేదు. అది జమ్మూకు మాత్రమే పరిమితమైంది. అయినప్పటికీ రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. జమ్మూ-కశ్మీర్లో ఎప్పటిలాగే సంకీర్ణ ప్రభుత్వమే ఈసారి కూడా రాజ్యమేలబోతున్నది. 28 స్థానాలతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అగ్రభాగంలో ఉంటే 25 స్థానాలు గెల్చుకుని బీజేపీ ద్వితీయ స్థానంలో ఉంది. ఇంతవరకూ అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) 15, కాంగ్రెస్ 12 గెల్చుకున్నాయి. జార్ఖండ్లో బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్యూతో కలిసి స్పష్టమైన మెజారిటీ సాధించింది. రాష్ట్రం ఏర్పడి 14 ఏళ్లవుతుండగా ఇంతవరకూ ఏ రెండు పక్షాలకూ ఈ స్థాయి మెజారిటీ రాలేదు. అక్కడ బీజేపీ 37 స్థానాలు గెల్చుకోగా దాని మిత్ర పక్షం 5 స్థానాలు పొందింది. కనుక ఆ పార్టీ భవిష్యత్తులో బీజేపీని శాసించే పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదు. ఇంతవరకూ రాజకీయ అస్థిరత కారణంగా అక్కడ ఏ కూటమీ పూర్తికాలం పాలించలేకపోయింది. వరస వైఫల్యాలతో కుదేలవు తున్న కాంగ్రెస్ ఎప్పటిలానే రెండు రాష్ట్రాల్లోనూ అపజయాన్నే మూటగట్టుకున్నది. కనీసం ఇప్పటికైనా ఆ పార్టీ ఏ గుణపాఠమైనా నేర్చుకుంటుందో లేదో చెప్పలేం. జమ్మూ-కశ్మీర్లో స్థానిక పార్టీలతో అవగాహన వంటిదేమీ లేకుండా సొంతంగా పోటీ చేయాలనుకోవడం సాహసమే అయినా బీజేపీ ఆ పని చేసింది. అందుకోసం కొన్ని ‘త్యాగాలకు’ కూడా సిద్ధపడింది. జమ్మూ-కశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలని గొంతెత్తే అల వాటున్న బీజేపీ ఈసారి ఆ విషయంలో అస్పష్టంగా...ఇంకా చెప్పాలంటే మౌనంగా ఉండిపోయింది. అలాగే కొన్ని విషయాల్లో పరిమితులు ఏర్పర్చుకున్నది. అటు జమ్మూ... ఇటు కశ్మీర్లలో అన్నిటి గురించీ ఒకేలా మాట్లాడే అవకాశం లేకపోవడం ఆ పార్టీకున్న ఒక పరిమితి. ఉదాహరణకు కశ్మీర్ పండిట్లకు సంబంధించిన అంశంపై జమ్మూలో మాట్లాడినట్టు కశ్మీర్లో మాట్లాడితే ‘మిషన్ 44 ప్లస్’కు చేటు కలుగుతుం దని ఆ పార్టీ ఆచి తూచి అడుగేసింది. అలాగే, సైన్యానికి విశేషాధికారాలిస్తున్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం విషయంలోనూ తన అసలు వైఖరిని అది చెప్పలేకపోయింది. ఆ చట్టం వల్ల నిత్యమూ సమస్యలెదుర్కొనే ప్రాం తంలో దాన్ని గట్టిగా సమర్థిస్తూ మాట్లాడటం అంత సులభమేమీ కాదు. అయితే, ఇలా లెక్కలేసు కుని మాట్లాడటం ఒక్కోసారి లాభించదు. అది కశ్మీర్ ఫలితాల్లో నిరూపణ అయింది. అటు లోయలోనూ, ఇటు లడఖ్లోనూ బీజేపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపో వడం అందువల్లే! మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో లడఖ్ స్థానాన్ని గెల్చుకున్న బీజేపీ ఈసారి ఆ ప్రాంతంలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా రాబట్టుకోలేకపోయింది. లోయలోనూ, లడఖ్లోనూ మొత్తం 50 స్థానాలున్నాయి. ఈ రెండుచోట్లా బీజేపీ ఖాతా తెరవలేక పోయింది. పూర్తిగా జమ్మూ పార్టీగా మిగిలిపోయింది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసిన తీరు గురించి చెప్పుకోవాలి. కశ్మీర్లో పార్టీ జెండా రెపరెపలాడగలదన్న అభిప్రాయాన్ని శ్రేణుల్లో కలిగించడంలో ఆయన విజయం సాధించారు. నిజానికి ‘మిషన్ 44 ప్లస్’ అలాంటి ఉత్సాహాన్ని వారిలో నింపేందుకే! ముఖ్యంగా ఆయన జమ్మూ-కశ్మీర్ అభివృద్ధిని, ఉపాధిని చర్చనీయాంశం చేయగలిగారు. ఎన్నికల ప్రచారాన్ని వాటి చుట్టూ తిప్పగలిగారు. ఇప్పుడు జమ్మూ-కశ్మీర్లో ఓటర్లు వెలువరించిన తీర్పు అటు పీడీపీకి, ఇటు బీజేపీకి పెద్ద పరీక్షే పెట్టింది. ఎన్నికల సభల్లో మోదీ ‘తండ్రీ కొడుకుల పాలన’, ‘తండ్రీ కూతుళ్ల పాలన’ అంటూ అటు ఎన్సీని, ఇటు పీడీపీని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు విమర్శించుకోవడం...అంతలోనే కౌగలించుకోవడం సర్వసాధారణం. కనుక ఆ రెండు పార్టీలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాబోదు. ఒకవేళ బలమైన పీడీపీతో వెళ్లడంవల్ల తనకు పెద్దగా ప్రయోజనం కలగదని బీజేపీ భావించిన పక్షంలో ఎన్సీతో జట్టుకట్టినా కట్టొచ్చు. గతంలో ఎన్సీ ఎన్డీయే భాగస్వామిగా ఉన్నది గనుక ఇది అసాధ్యమేమీ కాదు. కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ రెండు పార్టీలకూ మరికొందరి తోడ్పాటు అవసరమవుతుంది. అలాగే పీడీపీ-కాంగ్రెస్లు కలవాలనుకున్నా ఇతరుల మద్దతు తప్పనిసరి. జార్ఖండ్లో ఈసారి వోటర్లు ఉన్నంతలో స్పష్టమైన తీర్పే ఇవ్వగలిగారు. పద్నాలుగేళ్ల ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఏ పార్టీకీ విస్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఇప్పుడు బీజేపీకి 37 స్థానాలు లభించడం మోదీ ప్రభంజనం వల్లనే. అయితే ఇంత ప్రభ ంజనంలో కూడా ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకొచ్చిన సీనియర్ నేత అర్జున్ముండా ఓడిపోయారు. ఆయన గతంలో మూడుసార్లు సీఎంగా వ్యవహరించినవారు. రాష్ట్రంలో ఇంతవరకూ తొమ్మిది ప్రభుత్వాలు ఏర్పడగా మూడు సందర్భాల్లో రాష్ట్రపతి పాలన విధించాల్సివచ్చింది. జేఎంఎం-కాంగ్రెస్ అధికార కూటమి పరాజయం పాలైనా కూటమిలోని జేఎంఎం గతంకంటే అదనంగా మరో స్థానాన్ని గెల్చుకోగలగడం ఈ ఎన్నికల్లో విశేషం. ఇంతవరకూ ఆ పార్టీకి 18 స్థానాలుంటే ఇప్పుడది 19కి పెరిగింది. అయితే, అధికారానికి మాత్రం దూరమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మంత్రివర్గంలోని తొమ్మిది మంది మంత్రులు ఓటమి చవిచూశారు. ఇంతక్రితం 14 స్థానాలున్న కాంగ్రెస్ ఇప్పుడు అయిదింటితో సరిపెట్టుకోవాల్సివచ్చింది. మొత్తానికి ఈ రెండు రాష్ట్రాలూ బీజేపీకి తగినన్ని స్థానాలు అందిస్తూనే ఒక హెచ్చరిక లాంటిది చేయగలిగాయి. అభివృద్ధి ఎజెండానుంచి వైదొలగితే, ఇతరేతర అంశాలను నెత్తినెత్తుకుంటే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడక కాదని చాటి చెప్పాయి. -
పీఠం దక్కేది ఎవరికో..
నేడు కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శ్రీనగర్/రాంచీ: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. తర్వాత గంటలోనే ఫలితాల సరళి తెలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఐదు విడతలుగా నెలరోజుల పాటు ఈ ఎన్నికలు జరగడం తెలిసిందే. కాగా, కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు చెప్పారు. 87 సీట్లున్న జమ్మూ కశ్మీర్లో అధికారం చేజిక్కించుకోవడానికి చతుర్ముఖ పోటీ నెలకొంది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్, ప్రతిపక్ష పీడీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీపడ్డాయి. 821 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వేర్పాటువాదులు, మిలిటెంట్లు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినా.. దానిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోకుండా భారీగా ఎన్నికల్లో పాల్గొన్నారు. కశ్మీర్ లోయను కైవసం చేసుకోవాలని ఈసారి బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే చాలా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీరాదని తేల్చిచెప్పాయి. దీంతో ఎవరు ఎవరికి మద్దతిస్తారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎవరికీ సంపూర్ణ ఆధిక్యంరాని పక్షంలో కాంగ్రెస్ కీలకంగా మారుతుందని విశ్లేషకుల అంచనా. 81 స్థానాల జార్ఖండ్ అసెంబ్లీకి 1,136 మంది పోటీపడ్డారు. మావోయిస్టుల బెదిరింపులు ఉన్నా.. మొత్తంగా 66 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో పాటు మాజీ సీఎంలు అర్జున్ ముండా, మధుకోడా, బాబూలాల్ మరాండి పోటీలో ఉన్నారు. -
నేడు కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
-
మూడో దశలో 58 శాతం పోలింగ్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో 58 శాతం పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ లో 61 శాతం పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపింది. జమ్మూకశ్మీర్లోని 18 స్థానాలకు డిసెంబర్ 2న జరిగిన రెండో విడత ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్లోని 20 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 65.46 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్లో నవంబర్ 25న 15 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71.28 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్లో 13 సీట్లకు అదే రోజు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61.92 శాతం పోలింగ్ నమోదవడం తెలిసిందే. -
నేడు కశ్మీర్, జార్ఖండ్లలో మూడో విడత ఎన్నికలు
శ్రీనగర్/రాంచీ: జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మంగళవారం మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కశ్మీర్లో ఈ విడతలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతోపాటు ముగ్గురు కేబినెట్ మంత్రులు బరిలో ఉన్నారు. బద్గామ్, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లోని 16 సీట్లకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 144 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. శుక్రవారం కశ్మీర్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో భద్రత సమస్యలు లేకుండా భద్రతా దళాలను మోహరించారు. ఒమర్ తమ కుటుంబం ఎప్పుడూ పోటీచేసే గందర్బాల్ ీనుంచి కాకుండా ఈ సారి బీర్వా స్థానం నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. జార్ఖండ్లో 17 సీట్లకు... జార్ఖండ్లె మూడో దశలో 17 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బరిలో 289 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 103 మంది స్వతంత్ర అభ్యర్థులే కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, ముగ్గురు మంత్రులు ఈ దశలో పోటీకి దిగుతున్నారు.