-
జమ్ము కశ్మీర్లో భారత వైమానిక దళ విన్యాసం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్స వద్ద భారత వైమాని దళం(ఐఏఎఫ్) 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఎయిర్ షో (వైమానిక విన్యాసం) నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా ఈ వైమానిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది.ఈ విన్యాసాల కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ‘మీ కలలకు రెక్కలు ఇవ్వండి’ అనే పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ భారత వైమానిక చరిత్ర, ప్రాముఖ్యతను యువతకు తెలియజేసే విధంగా ఉంది. చదవండి: (ప్రైమ్వీడియోస్లో డిస్కవరీ ప్లస్ ఇంకా మరెన్నో..) భారత వైమానిక దళం పట్ల యువత ఆసక్తి కలిగించడంతోపాటు జాతీయభావం పట్ల స్ఫూర్తి కలిగించడమే ఉద్దేశ్యంగా ఈ 'ఎయిర్ షో'ను ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రదర్శనలో రకరకాల వైమానిక విన్యాసాల తోపాటు స్కై డైవింగ్ కూడా నిర్వహించారు. (చదవండి: జైల్లో కరోనా కల్లోలం: 6 మంది పిల్లలతో సహా 39 మందికి పాజిటివ్) -
కశ్మీర్ అధికారులకు కీలక ఆదేశాలు
జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అనంతరం కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ప్రధాన కార్యదర్శి గురువారం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్నిస్థాయిల ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే విధులకు హాజరు కావాల్సి ఉంది. డివిజనల్, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, సివిల్ సెక్రటేరియట్ శ్రీనగర్లో పనిచేస్తున్న ఇతర వారందరూ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే రేపు (ఆగస్టు 9) సాంబాలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలను రీ ఓపెన్ చేయాలని, కార్యక్రమాలను యధావిధిగా పునః ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (ఆగస్టు 8) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నోట్ల రద్దు 2016, నవంబరు 8వ తేదీన ప్రకటించిన మోదీ, ఆగస్టు 8వ తేదీన సరిగ్గా ఎనిమిది గంటలకు తన కీలక ప్రసంగాన్ని చేయనున్నారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు ప్రతిపాదన, పార్లమెంటు ఆమోదం లాంటి పరిణామాలను చకాచకా చక్కబెట్టిన మోదీ సర్కార్ మరింత వేగంగా తదనంతర చర్యలను పూర్తి చేయాలని పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. J&K Govt: As per directions issued by Chief Secretary Jammu and Kashmir, all Government employees who are working at divisional level, district level and those serving in civil secretariat Srinagar, to report back to their duties with immediate effect. pic.twitter.com/pdn68mmRsb — ANI (@ANI) August 8, 2019 -
కుప్పకూలిన సంకీర్ణం
జమ్మూ–కశ్మీర్లో ఆదినుంచీ ఒడిదుడుకులతో నెట్టుకొస్తున్న పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుండి మంగళవారం కుప్పకూలింది. కూటమినుంచి తప్పుకుంటున్నట్టు బీజేపీ ప్రకటించ డంతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా సమర్పించారు. ఇది హఠాత్ పరిణామమే కానీ...అనూహ్యమైనదేమీ కాదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలూ భిన్న ధ్రువాలు. 2014 నవంబర్–డిసెంబర్ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండూ పరస్పరం కత్తులు నూరుకున్నాయి. 87 స్థానాలున్న అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 44 స్థానాలు కాగా, ఏ పార్టీకీ అన్ని సీట్లు లభించలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో పీడీపీ 28 స్థానాలు గెల్చుకోగా, హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూలో బీజేపీ 25 చోట్ల విజయం సాధించింది. అంతవరకూ పాలకపక్షంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఇలాంటి అనిశ్చితిలో పీడీపీ, బీజేపీలు సుదీర్ఘంగా మంతనాలు సాగించి ‘కనీస ఉమ్మడి అజెండా’ను రూపొందించుకుని ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దురదృష్టవశాత్తూ ముఫ్తీ ఏడాది గడవకుండానే కన్నుమూశారు. ఆ తర్వాత మళ్లీ రెండున్నర నెలలపాటు అనిశ్చితే రాజ్యమేలింది. మళ్లీ చర్చోపచర్చలు జరిగాయి. చివరకు పాత అజెండాతోనే ముఫ్తీ కుమార్తె మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. చైనా, పాకిస్తాన్లతో సరిహద్దులున్న జమ్మూ–కశ్మీర్ దశాబ్దాలుగా మిలిటెన్సీతో అట్టుడుకు తోంది. కనుకనే అక్కడ అత్యంత మెలకువతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల కారణం గానే కేంద్రంలో పాలకపక్షంగా ఉన్న పార్టీ, రాష్ట్రంలో మెజారిటీ తెచ్చుకున్న పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పర్చడం రివాజు. పీడీపీ, బీజేపీలు భిన్న ధ్రువాలు గనుక అది సాధ్యపడదేమోనని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలనూ ఆ పార్టీలు తలకిందులు చేసి సన్నిహితమయ్యాయి. జమ్మూ–కశ్మీర్ సమస్యకు జాతీయ పరిష్కారం కోరే దిశగా తమ అజెండాను రూపొందించుకున్నా మని రెండు పార్టీలూ చెప్పడం చాలామందికి నచ్చింది. కశ్మీర్ విషయంలో బీజేపీ అభిప్రాయాలు అందరికీ తెలుసు. అయితే 2014 ఎన్నికల్లో 370 అధికరణం అంశాన్ని ఆ పార్టీ పక్కన పెట్టింది. ఇతర అంశాల్లో సైతం తన వైఖరిని సడలించుకోబట్టే అది పీడీపీతో జత కట్టిందని అనేకులు భావిం చారు. అటు జమ్మూ, ఇటు కశ్మీర్ మత ప్రాతిపదికన చీలినట్టు ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేసిన నేపథ్యంలో ఇది శుభ పరిణామని వారు విశ్వసించారు. ఇరు పార్టీలూ ప్రత్యర్థులుగా ఉండటం మంచిదికాదని వారి భావన. కానీ పీడీపీ, బీజేపీలు తాము కూటమిగా ఉన్నామని,మంచి పాలన అందించాలని మరిచినట్టు గత రెండేళ్ల పరిణామాలు రుజువుచేశాయి. కశ్మీర్ సమస్యను ఆదినుంచీ బీజేపీ శాంతిభద్రతల సమస్యగానే చూస్తోంది. అక్కడ రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలం కావడం వల్లనే ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయన్న వాదననను ఆ పార్టీ అంగీకరించదు. ఆ సమస్య విషయంలో చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన కేంద్రం గత అక్టోబర్లో అందుకోసం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) డైరెక్టర్గా పనిచేసి రిటైరైన దినేశ్వర్ శర్మను మధ్యవర్తిగా ప్రకటించడం ఈ అవగాహన పర్యవసానమే. అంతక్రితం పలుమార్లు మధ్యవర్తుల రాయబారాలు నడిచాయి. వాజపేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఒకసారి కేంద్ర మాజీ మంత్రి కేసీ పంత్నూ, మరోసారి ప్రస్తుత గవర్నర్ ఎన్. ఎన్. వోహ్రాను నియమించింది. యూపీఏ సర్కారు ప్రముఖ పాత్రికేయుడు దిలీప్ పడ్గావ్కర్ తదితరులతో మధ్యవర్తుల కమిటీ నియమించింది. ఆ ప్రభుత్వాలు మధ్యవర్తులిచ్చిన నివేదికలపై ఏం చర్యలు తీసుకున్నాయన్న సంగతలా ఉంచితే కనీసం మాజీ పోలీస్ అధికారులను ఆ పని కోసం నియమించలేదు. దినేశ్వర్ శర్మ ఏం సాధించారో తెలియదుగానీ అప్పటికీ, ఇప్పటికీ కశ్మీర్ పరిస్థితి అయితే దారుణంగా క్షీణించింది. కనీస ఉమ్మడి అజెండాలోని 15 అంశాలనూ సమర్ధవంతంగా అమలు చేసి ఉంటే కశ్మీర్ పరిస్థితి ఇంత దిగజారేది కాదు. యువకుల్లో నైపుణ్యాభివృద్ధి, సిద్ధాంతాలు ఎలాంటివైనా అన్ని పక్షాలతో చర్చించడం, అకౌం టబిలిటీ కమిషన్ ఏర్పాటు, సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం వర్తింపుపై సమీక్ష, వాజపేయి నినాదమైన ఇన్సానియత్(మానవత్వం), జమ్రూహియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్(కశ్మీరీ సంస్కృతి, సంప్రదాయం)ల అమలు వగైరాలు ఆ అజెండాలోని ముఖ్యాంశాలు. కశ్మీర్ సమస్యపై పాకిస్తాన్తో చర్చలు ప్రారంభించడం, హుర్రియత్ నేతలతోసహా కశ్మీర్లోని సంబంధిత పక్షాలన్నిటితో మాట్లాడటం వంటి అంశాల్లో పీడీపీ, బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు న్నాయి. భద్రతా దళాలకూ, ఉద్యమకారులకూ మధ్య తరచుగా తలెత్తే ఘర్షణల్లో మెహబూబా వైఖరికీ, బీజేపీ వైఖరికీ పొంతనే లేదు. మొన్నటికి మొన్న కథువాలో ఎనిమిదేళ్ల పాప అసిఫాపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య విషయంలోనూ ఇరు పార్టీలూ వేర్వేరు వాదనలు చేశాయి. ఎన్నో ఒత్తిళ్ల తర్వాతగానీ ఆ కేసు నిందితులకు వత్తాసు పలికిన బీజేపీ మంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోలేదు. ఇక రంజాన్ మాసం సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించాలని మెహ బూబా ఒత్తిడి తెస్తే తొలుత కేంద్రం ససేమిరా అంది. చివరకు అయిష్టంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ద్వారా కాల్పుల విరమణ ప్రకటన చేయించింది. కానీ దానివల్ల ఆశించిన ఫలితం రాలేదు సరిగదా ఉగ్రవాదులు మరింత రెచ్చిపోయి హింసాకాండకు పాల్పడ్డారు. ప్రముఖ పాత్రి కేయుడు సుజాత్ బుఖారీని కాల్చిచంపారు. జవాన్ ఔరంగజేబును చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. కూటమిలో కొనసాగడం వల్ల ఇలాంటి చర్యలన్నిటికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన స్థితిలో పడ్డామని బీజేపీకి బెంగపట్టుకున్నట్టుంది. కానీ ఇకపై అన్నిటికీ తామే జవాబుదారీ అవుతామని ఆ పార్టీ గుర్తుంచుకోవాలి. కశ్మీర్ విషయంలో మరింత జాగురూకతతో మెలగాలని, దాన్ని మరింత విషాదం చుట్టుముట్టకుండా చూడాలని అందరూ కోరుకుంటారు. -
‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు’
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పీడీపీతో పొత్తు విరమించుకున్నట్లు బీజేపీ కశ్మీర్ ఇంచార్జి రాం మాధవ్ ప్రకటించగానే బీజేపీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు అంటూ’ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎక్కువకాలం నిలవదని ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడో చెప్పారన్నారు. ఒకవేళ పీడీపీతో కలిసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియకనే బీజేపీ ఈవిధంగా వ్యవహరించిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కేవలం రాజకీయ లబ్ది కోసమే పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందంటూ విమర్శించారు. ‘అవకాశవాది బీజేపీ... ముందు పీడీపీతో జతకట్టింది. ఇప్పుడు వైదొలిగింది. రెండూ కూడా రాజకీయ లబ్ది కోసమే... ఇలా అయితే దేశం ఎలా మారుతుందని’ ఆయన ట్వీట్ చేశారు. పీడీపీతో జతకట్టే ఆలోచన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. An opportunistic BJP First an opportunistic alliance with PDP Now an opportunistic breakaway Both acts of political immorality Kaise Desh badlega ? — Kapil Sibal (@KapilSibal) June 19, 2018 -
కశ్మీర్లో అభివృద్ధి ఎజెండాతో ప్రభుత్వం
బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో పీడీపీ, బీజేపీల కొత్త ప్రభుత్వం అభివృద్ధి, శాంతి, పునరావాసం ఎజెండాతో ముందుకెళ్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు చేపట్టడం, విభిన్న వర్గాల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడం, వరద బాధితులకు పునరావాసం కల్పించడమే ప్రాథమ్యాలుగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటును పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కొన్ని అంశాల్లో రెండు పార్టీల మధ్య రాజకీయ వైరుద్ధ్యాలున్నప్పటికీ, చర్చల ద్వారా ఏకాభిప్రాయంతో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ను అధికారం కోసం పక్కన పెట్టారనే విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
ఓటు వేయకపోతే ఆ దేశాల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా!
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
చీరలో ముద్దుముద్దుగా జాన్వీ.. లుక్ మార్చేసిన సీరియల్ బ్యూటీ!
హాట్టాపిక్గా ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మార్క్లే గౌను!
న్యూ ఇయర్ను మించిన మదర్స్ డే! ఎలాగో చూడండి..
Actors And Their Polling Booths: టాలీవుడ్ హీరోలు ఓటేసేది ఇక్కడే (ఫోటోలు)
కేజీ కుంకుమపువ్వు రూ.4.95 లక్షలు - ఎందుకింత రేటు తెలుసా?
ముట్టుకుంటే రూ.20 లక్షలు.. ఫొటోకి రూ.25 లక్షలు
తప్పక చదవండి
- నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement