breaking news
inthiyaj
-
వరకట్న దాహానికి యువతి బలి
జమ్మలమడుగు : వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం నాలుగు నెలలైనా దాంపత్య జీవితం గడవక ముందే ఆ యువతికి నిండు నూరేళ్లు నిండాయి. భర్త, అత్తమామలు అదనపు కట్నం తీసుకుని రావాలంటూ వేధించడంతో పాటు తీవ్రంగా కొట్టి చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని నశ్యం వారి వీధికి చెందిన న్యామత్ కుమార్తె మాబుచాన్ ప్రైవేట్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదువుతోంది. బెల్లాల వీధికి చెందిన బాషా మోదీన్ కుమారుడు ఇంతియాజ్ అమ్మాయిని ప్రేమిస్తున్నాని వెంటపడుతుండటంతో తల్లిదండ్రులు ఇంతియాజ్ తండ్రి దృష్టికి తీసుకెళ్లి కుమారుడిని మందలించాలని సూచించారు. అయితే అమ్మాయి కూడా అతని ప్రేమలో పడి పారిపోయే ప్రయత్నం చేయడంతో తల్లిదండ్రులు తెలుసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 8వతేదిన వీరికి వివాహం జరిపించారు. కట్నకానుకల కింద పదితులాల బంగారంతో పాటు, నగదును కూడా సమర్పించారు. వివాహం చేసుకున్నప్పటినుంచి తమ కుమార్తెను వేధించడంతోపాటు అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్త ఇంతియాజ్, మామ బాషామొహిద్దీన్, అత్త హబీబూన్లు మాబూచాన్కు కొట్టడంతో పాటు కట్నం తీసుకుని రావాలంటూ ఇంటికి పంపించేవారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు అదనంగా మరో 50వేల రూపాయలు కుమార్తెకు ఇచ్చి పంపించారు. ఇంకా డబ్బులు తీసుకుని రావాంటూ సోమవారం రాత్రి భర్త ఇంతియాజ్, మామ అత్త హత్య చేసి ఆమెను ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి తండ్రి న్యామత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సరదా కోసం వెళితే చితకబాదారు
రాంగోపాల్పేట్ (సికింద్రాబాద్): ఆటవిడుపు కోసం తన బంధువులతో కలిసి నెక్లెస్రోడ్లోని జలవిహార్కు వెళ్లిన ఓ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది చితకబాదారు. గదిలో బంధించి తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటన రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాటిగడ్డకు చెందిన ఇంతియాజ్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్ తన కుటుంబ సభ్యులు 10 మందితో కలసి శనివారం మధ్యాహ్నం నెక్లెస్రోడ్లోని జలవిహార్కు వెళ్లాడు. 9వ తరగతి చదివే ఇంతియాజ్ అక్క కుమారుడైన మహ్మద్ సమీర్ అక్కడ స్విమ్మింగ్పూల్లో ఉండే మ్యాట్రైడ్కు వెళ్లాడు. అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు బింటూ అతన్ని అనుమతించలేదు. 45 కేజీల బరువుకు పైబడి ఉన్న వాళ్లను మాత్రమే అనుమతిస్తామని సెక్యూరిటీ గార్డు చెప్పాడు. దీంతో వారి మధ్య గొడవ జరుగుతుండగానే బింటూ సోదరుడు మహ్మద్ జుబేర్ (18) ఇక్కడికి చేరుకుని సెక్యూరిటీగార్డుని ప్రశ్నించడంతో... అతడు మరింత ర్యాష్గా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది జుబేర్ను పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్లి చితకబాది వదలి పెట్టారు. అనంతరం జుబేర్ అక్కడే ఉన్న కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపాడు. ఇంతియాజ్ రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.