-
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్కు చెందిన కేతావత్ శంకర్నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డి, సీఐలు మల్లికార్జున్రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ బీమా పేరిట మోసం
కడప అర్బన్: వైఎస్సార్ బీమా పేరుతో మోసానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని వైఎస్సార్ జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో రెండు నెలలుగా ఓ అంతర్రాష్ట్ర ముఠా పథకం ప్రకారం కోవిడ్ సందర్భంగా మరణించిన మృతుల వివరాలను సేకరిస్తున్నది. వాటి ఆధారంగా ఆయా మృతుల బంధువులకు ఫోన్లు చేసి.. తాము కలెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని, వైఎస్సార్ బీమా పథకం కింద నష్టపరిహారం వస్తుందని మభ్యపెడుతోంది. అయితే అంతకుముందు.. కొంతమొత్తం ప్రభుత్వానికి చెల్లిస్తేనే ఆ మేరకు నష్టపరిహారం మంజూరవుతుందని అమాయక ప్రజలను నమ్మిస్తున్నది. అనంతరం ఫోన్–పే తదితర మనీ వ్యాలెట్ల నుంచి లక్షల రూపాయలను స్వాహా చేస్తోంది. కడపకు చెందిన బీరం రమణారెడ్డి, నిర్మల, ఎం.వి. సునీత, ఖాజీపేటకు చెందిన నాగవేణి, పెండ్లిమర్రికి చెందిన విఘ్నేశ్వరి, విజయకుమారి, బి.మఠానికి చెందిన కృష్ణచైతన్య, ప్రొద్దుటూరుకు చెందిన జింక హారతి, బద్వేల్కు చెందిన పి.ఆదిలక్ష్మి సదరు ముఠా చేతిలో చిక్కి సుమారు రూ.9 లక్షల మేరకు సమర్పించుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేసి కడప వన్టౌన్ సీఐ ఎన్.వి.నాగరాజు దర్యాప్తు చేపట్టారు. కేసు పరిశోధనలో భాగంగా కడప సైబర్ క్రైం టీం సహాయంతో యూపీఐల ఆధారంగా 9 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. వీటిలోని రూ.7,34,964 ఫ్రీజ్ చేశారు. ముఠాలో సభ్యుడైన ఖాజీపేట మండలం మిడుతూరు గ్రామానికి చెందిన మీనుగ వెంకటేష్ను ఇర్కాన్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. కొంతమంది వ్యక్తులతో కలిసి వెంకటేష్ ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి బీమా పేరిట దందాను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) తుషార్ డూడీ పాల్గొన్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. -
నకిలీ కరెన్సీ చలామణీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేస్తున్న పది మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠాను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట పోలీస్లు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.90 లక్షల ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు, రూ.60 వేల నగదు, ఒక కారు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫన్టైం రోడ్డులోని విజయవాడ సెంట్రల్ ఏసీపీ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ వర్మ ఈ కేసు వివరాలను బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు..ఈ నెల 19న పటమట పోలీస్ పరిధిలోని మారిస్ స్టెల్లా కాలేజీ సమీపంలోని యాక్సిస్ బ్యాంకులో ఎనిమిది రూ.500 నకిలీ ప్లాస్టిక్ కట్టలను అంతర్రాష్ట్ర ముఠా ఏటీఎం డిపాజిట్ మిషన్లో వేసింది. నకిలీ నోట్లు అన్ని మిషన్లోకి రావడాన్ని గమనించిన బ్యాంకు అధికారులు పటమట పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులను పట్టుకునేందుకు విజయవాడ సీపీ రాణా 3 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న విజయవాడ భారతీనగర్కు చెందిన తాతపూడి రాజు, జి.కొండూరు మండలం వెలగలేరుకి చెందిన రమేష్బాబు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకి చెందిన ఆంజనేయులు, సుజాత, సాయిమణికంట, రాజు, బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన అబ్రహం, పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన హనుమంతరావు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మధుమంచి ప్రసాద్, చిలుకూరి మరియదాస్ను బుధవారం పటమట పోలీస్ స్టేషన్ పరిధి భారతీనగర్లో టాస్క్ఫోర్స్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లను అసలు నోట్లుగా మార్చి, తక్కువ నగదుకు ఎక్కువ నగదు పొంది వాటితో జల్సాలు చేద్దామనే ఉద్దేశంతో నిందితులు ఈ వ్యవహారానికి పాల్పడ్డారు. వీరిలో ఆంజనేయులు, రమేష్బాబు, అబ్రహం, రాజు నకిలీ నోట్ల చలామణీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
గన్తో బెదిరించి దోపిడీలు.. వాళ్ల టార్గెట్ తెలిస్తే ఆశ్చ ర్యపోతారు!
నాగోలు: టైర్ల లోడ్తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి.. తుపాకితో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పహడీషరీఫ్ పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44,77,760 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం..హర్యానా రాష్ట్రం, మేనాత్ జిల్లాకు చెందిన జంషీద్ ఖాన్, రహెల్ ఖాన్, ఆజాద్లు ముఠాగా ఏర్పడ్డారు. లోడ్ చేసిన కంటైనర్లతో వెళ్లే లారీలను దోచుకోవాలని పథకం వేశారు. జనవరి 18న అపోలో లారీ టైర్లు (220) దోచుకున్నారు. లిఫ్ట్ అడిగి..లారీలోకి ఎక్కి గన్తో బెదిరించి..డ్రైవర్, క్లీనర్ను కట్టివేసి టైర్లు చోరీ చేశారు. ఈ నెల 15వ తేదీన తమిళనాడు నుంచి బయలుదేరిన కంటైనర్ నుంచి మరో కంపెనీ టైర్లను ఇదే పద్ధతిలో చోచుకున్నారు. లిఫ్ట్ అడిగి కంటైనర్ ఎక్కిన వీరు...ఈ నెల 17న నల్గొండ జిల్లా తిప్పర్తి సమీపంలోకి కంటైనర్ రాగానే జంషీద్ ఖాన్, రహీల్ ఖాన్లు క్లీనర్ను గన్తో బెదిరించి కంటైనర్ను రోడ్డు పక్కన ఆపి, డ్రైవర్, క్లీనర్లను తాడుతో కట్టి క్యాబిన్లో పడివేశారు. హైదరాబాద్కు చెందిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ ఆలీ ఖాన్ల సాయంతో కాటేదాన్లో ఉన్న కమల్ కబ్రా టైర్ల గోదాములో దోచుకున్న టైర్లను తక్కువ ధరకు అమ్మివేసి తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై కంటైనర్ వదిలేసి పారిపోయారు. కంటైనర్ రోడ్డుపై ఎక్కవ సేపు ఆగి ఉండడంతో స్థానికులు గమనించి లారీ క్యాబిన్లో కట్టిపడేసి ఉన్న డ్రైవర్, క్లీనర్లను రక్షించారు. లారీ డ్రైవర్ పహడీషరీష్ పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుల ఆటకట్టించారు. జంషీద్ ఖాన్ ఇటీవల ఢిల్లీకి విమానంలో వెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకుని అక్కడి పోలీస్లకు సమాచారం ఇచ్చి, సీఐఎస్ఎఫ్ పోలీసుల సహాయంతో నిందితుడిని అరెస్టు చేసి విచారించారు. చోరీకి సహకరించిన సయ్యద్ బాసిత్ హుస్సేన్, అఫ్రోజ్ అలీఖాన్, టైర్లు కొనుగోలు చేసిన కమల్ కబ్రాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 152 టైర్లు, రూ.20 వేల నగదు, కారు, బైకు, నాలుగు మొబైల్ ఫోన్లు, 8ఎంఎం లైవ్ రౌండ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. రహీల్ ఖాన్, ఆజాద్ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీలు సన్ప్రీత్సింగ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
'అడ్డు వస్తే హత్యలకు కూడా వెనుకాడరు'
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement