breaking news
Internet cafe
-
ఇంటర్నెట్ కేఫ్కు అని వెళ్లి..
హైదరాబాద్: ఇంటర్నెట్ కేఫ్కు అని వెళ్లిన ఓ యువతి తిరిగి కనిపించకుండా పోయిన సంఘటన కేపీహెచ్బీ కాలనీలోని నిజాంపేట పరిధి రాజీవ్గృహకల్పలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కృష్ణ కూతురు లావణ్య(21) ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించటం లేదు. బంధువులు, మిత్రులను ఆరా తీసినా లాభం లేకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జనగా మురళి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెట్ సెంటర్ పై దాడి, నీలి చిత్రాలు సీడీలు స్వాధీనం
హైదరాబాద్ : ఇంటర్నెట్ నుంచి నీలి చిత్రాలు డౌన్లోడ్ చేసి...వాటిని మెమరీ కార్డుల్లోకి ఎక్కించి సొమ్ము చేసుకుంటున్న ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహకుడిని పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కంప్యూటర్తో పాటు మెమరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ సర్దార్ స్థానికంగా 'యూనివర్సల్ ఇంటర్నెట్' సెంటర్ను నిర్వహిస్తున్నాడు. సెంటర్లో ఉన్న కంప్యూటర్లో నీలి చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని వినియోగదారుల మెమరీ కార్డులలో డౌన్లోడ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. విషయం తెలసుకున్న పోలీసులు నిన్న మధ్యాహ్నం ఇంటర్నెట్ సెంటర్పై దాడి చేశారు. నీలి చిత్రాలను స్వాధీనం చేసుకుని సర్దార్ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు. -
నేటి నుంచి డైట్సెట్ కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ, న్యూస్లైన్ : జిల్లాలో సోమవారం నుంచి డైట్సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏ కేంద్రానికీ వెళ్లాల్సిన అవసరం లేదు. సొంత కంప్యూటర్లు, ఇంటర్నెట్ కేఫ్ల నుంచి ఆప్షన్లు ఎం చుకోవచ్చు. కోరుకున్న మూడు కళాశాలలను వరుస క్రమంలో పొందుపరుచుకోవాల్సి ఉంది. 15వ తేదీ వరకు వె బ్ ఆప్షన్లకు గడువు ఉంది. ప్రతిభ, ర్యాంకుల ఆధారంగా ఈ నెల 1న సీటు కేటాయిస్తారు. సీటు పొందినవారికి సమాచారం ఇస్తారు. వారు మాత్రమే 23న ఇందుకూరుపేట మం డలం పల్లిపాడులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అన్నిసెట్లకు భిన్నంగా.. అన్ని ప్రవేశపరీక్షలకు భిన్నంగా డైట్సెట్ కౌన్సెలింగ్లో తొలుత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సాధరణంగా కౌన్సెలింగ్లలో ముందుగా సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ఆప్షన్ల ప్రక్రియ, కళాశాలల కేటాయింపు... ఇలా ఉంటుంది వరుసక్రమం. డైట్సెట్లో మాత్రం సీటు లభించాకే, జిల్లావ్యాప్తంగా ఒక్క పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నారు. స్వీకరించిన సర్టిఫికెట్లు, ఇతర వివరాలను సంబంధిత కళాశాలలకు పంపుతారు. జిల్లాలో 6500 మంది డైట్సెట్ పరీక్షకు హాజరై ర్యాంకులు సాధించి ఉన్నారు. జిల్లాలో 12 ప్రైవేట్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉన్నాయి. వీటిలో 40 సీట్లు కన్వీనర్ కోటా కింద, పది సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. పల్లెపాడులో ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో మాత్రం 150 సీట్లు ఉన్నాయి. గతేడాది వరకు జిల్లాలో 11 ప్రైవేటు కళాశాలల్లో కలిపి 550 సీట్లు ఉండేవి. ఈ ఏడాది శ్రీహర్ష ఎడ్యుకేషనల్ సొసైటీకి కొత్తగా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో మరో 50 సీట్లు అదనంగా అభించాయి.