breaking news
Intermediate 2nd year results
-
TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ను ఇలా చెక్ చేసుకోండి..
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో విద్యార్థులు చూసుకోవచ్చు. అదే విధంగా ‘ఇంటర్ ఫలితాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ఏర్పాట్లు చేసింది. www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను పొందవచ్చు. కాగా మార్చి, ఏప్రిల్ నెలలో తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ పరీక్షను 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాది ఫలితాలు జూన్లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్లో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్లో 67. 26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫస్టియర్లో 2 లక్షల 72వేల 208 మంది పాసవ్వగా, సెకండియర్లో 2 లక్షల 56వేల 241 మంది పాసైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 75. 27 శాతంలో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 85.05 శాతంలో ములుగు జిల్లా అగ్రస్థానం సాధించింది. జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. అదే సమయంలో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు మంత్రి. చదవండి: ఎంసెట్కు బయోమెట్రిక్ తప్పనిసరి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. -
పరీక్షల్లో ఫెయిల్.. ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం
బనశంకరి: ద్వితీయ పీయూసీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని ఆవేదన చెంది ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పాసైనా, 90 శాతం మార్కులు రాలేదని బాధతో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఉత్తరకన్నడ జిల్లా కుమటావాసి ప్రణమ్ ఈశ్వరనాయక్ (18), గదగ తాలూకావాసి పవిత్ర లింగదాళ (18), మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకావాసి ఎంజే స్పందన (17), కొడగు జిల్లా బసవనహళ్లివాసి సంధ్య (17) ఈ అకృత్యానికి పాల్పడ్డారు. వీరిలో అందరూ కూడా ఉరి వేసుకుని తనువు చాలించారు. విశ్రాంత జవాన్ కూతురైన సంధ్య 77 శాతం మార్కులతో ఫస్ట్క్లాస్లో పాసైంది. కానీ 90 శాతం పైగా వస్తాయని ఆశించి నిరాశకు గురైంది. ఈ బాధతో ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా) ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com -
తెలంగాణ: మొదటిసారి 100 శాతం పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారందరికి ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కుల ఆధారంగా ద్వితీయ సంవత్సరంలో మార్కులను ఇంటర్మీడియట్ బోర్డు కేటాయించింది. ఈ ఫలితాలను తెలంగాణ విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన వారిలో రెగ్యులర్ విద్యార్థులు 4,51,585 మంది ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల ఫలితాలను బోర్డు వెబ్సైట్ (https:// tsbie. cgg. gov. in, http:// examresults.ts nic. in, http:// results. cgg. gov. in) లో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ప్రథమ సంవత్సర హాల్ టికెట్ నంబర్ను పొందుపరిచి ద్వితీయ సంవత్సర ఫలితాలను పొందవచ్చని, గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు తమ పాత హాల్ టికెట్ నంబర్ ద్వారా మార్కులు పొందవచ్చని మంత్రి వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన మొత్తం రెగ్యులర్ విద్యార్థుల్లో 1,76,722 మంది ఏ గ్రేడ్ వారున్నారు. బీ గ్రేడ్లో 1,04,891 మంది, సీ గ్రేడ్లో 61,889 మంది, డి గ్రేడ్లో 1,08,083 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. ప్రాక్టికల్స్లో 100 శాతం... కరోనా కారణంగా ఈసారి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. విద్యార్థులకు ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే ద్వితీయ సంవత్సరంలో ఆయా సబ్జెక్టులకు కేటాయించింది. ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ఏవైనా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయి ఉంటే.. వాటికి 35 శాతం పాస్ మార్కులను కేటాయించింది. ద్వితీయ సంవత్సరంలోనూ ఆ సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయించింది. అలాంటి విద్యార్థులు 1,99,019 మంది ఉన్నారు. వారందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం చొప్పున మార్కులను కేటాయించి పాస్ చేసింది. ఈసారి ప్రాక్టికల్స్ కూడా నిర్వహించని కారణంగా విద్యార్థులందరికి అందులో 100 శాతం మార్కులను కేటాయించింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారికి 35 శాతం పాస్ మార్కులను ఇచ్చింది. ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన వొకేషనల్ బ్రిడ్జికోర్సు, అదనపు సబ్జెక్టుల్లో 35 శాతం పాస్ మార్కులు వేసింది. ప్రస్తుతం కేటాయించిన మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక రాత పరీక్షలకు హాజరుకావచ్చని పేర్కొంది. జూలై 1 నుంచి మార్కుల మెమోలు... మార్కుల మెమోలను (కలర్ షార్ట్ మెమో) విద్యా ర్థులు బోర్డు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. జూలై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తరువాత http://tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల పాస్ మెమోల్లో ఏమైనా తప్పులు దొర్లితే 040–24600110 ఫోన్ నంబర్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే ఆన్లైన్లోనూ (www. bigrs. telangana. gov. in), బీఐజీఆర్ఎస్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసేలా బోర్డు ఏర్పాట్లు చేసింది. కాలేజీల వారీగా ఫలితాలను కాలేజీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి పొందవచ్చు. కాలేజీల వారీగా మార్కుల రిజిస్టర్లను జూలై 5 నుంచి కాలేజీ లాగిన్ ద్వారా పొందవచ్చు. మొదటిసారి 100 శాతం పాస్.. కరోనా కారణంగా ఈసారి పరీక్షలు లేనందున విద్యార్థులంతా పాస్ అయ్యారు. ఈసారి 4,73,850 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, గతేడాది 4,85,166 మంది (62.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 2018–19 విద్యా సంవత్సరంలో 4,90,308 (59.37%), 2017–18లో 5,07,906 మంది (60.97%), 2016–17లో 5,01,119 మంది (59.91%) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థుల వివరాలివే.. స్ట్రీమ్ విద్యార్థులు రెగ్యులర్ జనరల్ 4,28,921 4,07,684 వొకేషనల్ 44,929 43,901 మొత్తం 4,73,850 4,51,585 పాసైన వారిలో బాలురు-2,36,409 బాలికలు-2,37,441 ప్రధాన గ్రూపుల వారీగా విద్యార్థుల వివరాలు.. గ్రూపు విద్యార్థులు ఎంపీసీ 1,74,945 ఎంఈసీ 20,716 బైపీసీ 1,00,547 సీఈసీ 1,18,750 హెచ్ఈసీ 12,954 -
ద్వితీయ ఇంటర్ ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు 10 లక్షల మంది రాసిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు వర్గాలు గురువారం వెల్లడించాయి. ఫలితాల వెల్లడికి సంబంధించిన పనులు చివరి దశకు చేరుకున్నాయని, అయితే ఫలితాల వెల్లడి సమయం శుక్రవారం ఖరారు అవుతుందని పేర్కొన్నాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు.