-
ఆన్లైన్లో సర్వే సమాచారం
- అర్హులకే సంక్షేమ ఫలాలు - ప్రతిపక్షాల తీరు దారుణం - మంత్రి హరీష్రావు సిద్దిపేట టౌన్: తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు వెల్లడించారు. సిద్దిపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపీడీఓ, తహశీల్దార్, అన్ని ప్రభుత్వ శాఖల ఆఫీసులు, మీసేవ కేంద్రాలు, ఇంజనీరింగ్ కళాశాలలను సర్వే సమాచారం ఆన్లైన్లో నమోదు చేయడానికి వినియోగిస్తామన్నారు. ఎంత వేగంగా ఈ పని పూర్తిచేస్తే అంతే వేగంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి నిజమైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు, పింఛన్ తది తర పథకాలను అందించడం సర్వే లక్ష్యమన్నారు. దీనిని ప్రతిపక్షాలు స్వాగతించాల్సింది పోయి కోర్టులకు వెళ్లి, దుష్ర్పచారం చేసి అడ్డుకోవడానికి విఫలయత్నం చేశాయని ఆరోపించారు. ప్రతిపక్షాల తీరు సరైనది కాదన్నారు. సంక్షేమ ఫలాలను అడ్డుకునే పార్టీల అడ్రస్లను ప్రజలు గల్లంతు చేస్తారని హెచ్చరించారు. సర్కార్ సంక్షేమ పథకాలతో తమకు నూకలు చెల్లుతాయనే భయంతో కొన్ని పార్టీలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. సర్వేలో బ్యాంక్ ఖాతా నంబర్లు అడిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. నేరుగా సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. 19 లక్షల మంది రైతులకు 465కోట్ల ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లోకి చేరడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడడం సరైంది కాదన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ సర్వేను అమలు చేయడానికి ఆలోచిస్తున్నాయన్నారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని, మాటలకు పరిమితం కామని చేతలతోనే తమ పనులను చూపిస్తామని స్పష్టం చేశారు. సర్వేకు ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలకడం, పండుగలా మార్చడం తమ ప్రభుత్వంపై వారికున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. టీఏ, డీఏలు తీసుకోకుండా ఉద్యోగులు సర్వే చేయడం అభినందనీయమన్నారు. దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తుంటే ఆనందబాష్పాలు రాల్చడం తమ పాలన పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలు బాగుంటే ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్లో మంచి పథకాలను అమలు చేస్తే తాము కూడా వాటిని అధ్యయనం చేసి అమలు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు. -
సర్వేకు చక్కటి స్పందన
వివరాలు నమోదు చేసుకున్న ఇన్చార్జి కలెక్టర్ - పట్టణంలో కర్ఫ్యూ మాదిరి వాతావరణం - నిర్మానుష్యంగా సంగారెడ్డి - స్వచ్ఛందంగా సినిమా హాళ్లు, - పెట్రోల్ బంకుల మూత సంగారెడ్డి మున్సిపాలిటీ/క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సర్వే సందర్భంగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు సైతం తిరగకపోవడంతో స్వగ్రామాలకు వెళ్లే గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారడంతో కర్ఫ్యూ వాతావరణం తలపించింది. ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొని వివరాలను తెలియజేశారు. ఏఎస్పీ మధుమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ తదితరులు సంగారెడ్డిలో కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి సోమేశ్వర వాడలో పేర్లు నమోదు చేయించుకున్నారు. మాజీ ప్రభుత్వ విప్ జయప్రకాశ్రెడ్డి స్థానికంగా లేకపోవడంతో సర్వేలో పాల్గొనలేకపోయారు. మున్సిపల్ వైస్చైర్మన్ గోవర్దన్ నాయక్ సర్వేలో పాల్గొని కుటుంబ వివరాలను తెలియజేశారు. సర్వే కోసం వచ్చిన సిబ్బందికి ఇంటి నంబర్లు దొరకక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంజీరా నగర్లోని 7-8-686/4/6 నంబరు గల ఇంటిలో యజమాని రాజయ్య పేరు ఉందని 739వ ఎన్యూమరేటర్కు మున్సిపల్ అధికారులు సమాచారం ఇచ్చారు. అదే ఇంటి నంబరు ప్రభుగౌడ్ పేరును మరో ఎన్యూమరేటర్కు ఇవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రశాంత్నగర్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్లు సర్వేలో పేర్లను నమోదు చేయించుకోగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు సర్వేకు అంతరాయం కలిగింది. తమకు ఆధార్, ఓటరు కార్డుతో పాటు సొంత ఇల్లు ఉన్నందున ఇక్కడే నమోదు చేయించుకుంటామని చెప్పగా, స్థానికులు అడ్డుకొని తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి పేర్లను ఇక్కడ నమోదు చేయించవద్దని స్థానికులు అధికారులను కోరారు. సర్వేకు ముందుగా రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రీ సర్వే సమయంలో కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సర్వే ఫారాలను తీసుకువచ్చిన సిబ్బందికి సర్వే చేసే రోజు వారి సంఖ్య పెరగడంతో ఫారాలు లేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే విజయవంతమైంది. సర్వేను ఇన్చార్జి కలెక్టర్ శరత్తో పాటు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తహశీల్దార్ రాధాబాయి, మున్సిపల్ ఇన్చార్జి కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. పట్టణం నుంచి పల్లెలకు... సర్వేలో పాల్గొనేందుకు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పట్టణంలోని వివిధ పరిశ్రమలు, అడ్డా కూలీలు, వ్యాపార సంస్థలో పనిచేస్తున్న కార్మికులు స్వగ్రామాలకు తరలివెళ్లారు. దీంతో పట్టణంలోని కొత్త సంగారెడ్డి ప్రాంతంలో మెజార్టీ ఇళ్లకు తాళాలు వేసి ఉండడం కనిపించింది. ఇంటి యజమానులు హైదరాబాద్లో స్థిరపడగా స్థానికంగా ఉన్న ఇండ్లను అద్దెకు ఇచ్చారు. అద్దెకుంటున్న వారు సైతం సర్వేలో పాల్గొనేందుకు ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. పట్టణంలోని పలు కాలనీలు జన సంచారం లేక వెలవెలబోయాయి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు సిద్దిపేట టౌన్: సర్వే సందర్భంగా తప్పుడు సమాచారమిస్తే తిప్పలు తప్పవని సర్వే మెదక్ స్పెషలాఫీసర్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ బుర్ర వెంకటేశం, ఇన్చార్జి కలెక్టర్ శరత్ హెచ్చరించారు. సిద్దిపేట రెవెన్యూ గెస్ట్ హౌస్లో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. మన ఊరు- మన ప్రణాళిక పక్కాగా రూపొందించుకొని అర్హులైన వారందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామన్నారు. ఇందుకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న స్పందన అభినందనీయమన్నారు. జిల్లాలో 8.48 లక్షల కుటుంబాలు ఉండగా 32 వేల మంది సిబ్బందిని సర్వే కోసం ఏర్పాటు చేశామన్నారు. సర్వే కన్నా ముందు ఇళ్ల సంఖ్యను లెక్కించామని, ఇందుకు అనుగుణంగా నంబర్లు కేటాయించి ఎన్యూమరేటర్లను నియమించామని, రిజర్వ్లో సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని, సపోర్ట్ ఎన్యూమరేటర్లను ఏర్పాటు చేశామని, సర్వేలో అవాంతరాలు చోటు చేసుకోకుండా వివిధ స్థాయిలో అధికారులను ఏర్పాటు చేశామని వివరించారు. అయితే కొందరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వేర్వేరు కుటుంబాల పేరుతో నమోదు చేయించుకోవడంతో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగాయన్నారు. కుటుంబాల సంఖ్య కన్న 15 శాతం ఎక్కువ సర్వే ఫారాలను ఏర్పాటు చేసినప్పటికీ స్వల్ప కొరత ఏర్పడిందన్నారు. వెంటనే అదనపు సర్వే ఫారాలను ఏర్పాటు చేశామని ఎంత రాత్రి అయినా సర్వేను పూర్తి చేస్తామని, అన్ని కుటుంబాల వివరాలను నమోదు చేస్తామన్నారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా క్రాస్ చెక్ చేయాలో, ఎవరికి సంక్షేమ ఫలాలు అందించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉందని ప్రజలు కూడా పారదర్శకంగా ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. సమావేశంలో గడా స్పెషల్ ఆఫీసర్ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి పాల్గొన్నారు. -
‘తెలంగాణ’ D/O నాగేశ్వర్
మెదక్ రూరల్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న అధికారులకు ఓ గ్రామంలో వింత సంఘటన ఎదురైంది. మెదక్ మండల పరిధిలోని పిల్లికొటాల్ గ్రామంలో అధికారి చంద్రశేఖర్, వీఆర్ఓ కిషన్లు సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేకల నాగేశ్వర్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించగా, నాగేశ్వర్ తన భార్య పేరు పద్మావతి అని, కూతురు పేరు తెలంగాణ అని అధికారులకు తెలిపాడు. దీంతో ఆశ్చర్యపోయిన అధికారులు పాప పేరు తెలంగాణ ఏమిటని ప్రశ్నించారు. ఇందుకు నాగేశ్వర్ సమాధానమిస్తూ తనకు తెలంగాణ ఎంటే ఎనలేని గౌరవమన్నారు. అందువల్లే 2004లో పుట్టిన తన కూతురికి తెలంగాణ అని నామకరణం చేశానని చెప్పాడు. అంతేకాకుండా తన కూతురు బోనాఫైడ్తో పాటు ఆధార్కార్డులను కూడా అధికారులకు చూపించారు. అందులో కూడా పాప పేరు తెలంగాణగా నమోదై ఉండడంతో, అధికారులు సర్వేలో కూడా ఆ పాప పేరు తెలంగాణగా నమోదు చేశారు. -
19న హైకోర్టుకు సెలవు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టుకు ఆ రోజున సెలవు ప్రకటించారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సర్వే సందర్భంగా తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారని, అందరూ ఇందులో పాల్గొనాలని ప్రభుత్వం సూచించినందున హైకోర్టుకు సెలవు ఇవ్వాలని న్యాయవాదుల సంఘం ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి 19న హైకోర్టుకు సెలవు ప్రకటించారు. ఓయూ, జేఎన్టీయూ పరీక్షలు వాయిదా హైదరాబాద్: సర్వే నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగే వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఈ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. అదే విధంగా ఈనెల 18, 19వ తేదీల్లో జేఎన్టీయూహెచ్ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వరప్రసాద్ గురువారం తెలిపారు. 20వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement