breaking news
indian railway tracks
-
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!
Bullet Train Project Made In India: ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఇండియన్ రైల్వే మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఎక్విప్మెంట్ను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. అరుదైన సాంకేతిక పరిజ్ఞాన్ని దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలించేందుకు రెడీ అవుతోంది. వయడక్టు నిర్మాణంలో ముంబై-అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ టట్రైన్ పప్రాజెక్టును ఇండియన్ రైల్వే చేపట్టింది. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పర్యవేక్షిస్తోంది. ఈ ప్రాజెక్టులో కీలకమైన వయడక్టు నిర్మాణంలో భారీ క్రేన్లు, స్ట్రడల్ క్యారియర్లు, గర్డర్ ట్రాన్స్పోర్టర్లు వంటి భారీ ఎక్విప్మెంట్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ రైలు ట్రాక్ నిర్మాణంలో కీలకమైన భారీ ఎక్వీప్మెంట్ని పూర్తి దేశీయంగా తయారు చేస్తున్నారు. తమిళనాడులోని కంచిపురంలో ఉన్న ఎల్ అంట్ టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. బుల్లెట్ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా 1100 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ యంత్రాల తయారీ పనులు ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల ఇక్కడ తయారైన యంత్రాలను రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. వాటి తర్వాత ఇండియానే బుల్లెట్ ట్రైన్ ట్రాక్కి సంబంధించి వయడక్టు నిర్మాణ టెక్నాలజీ ఇప్పటి వరకు టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సౌత్ కొరియా, ఇటలీ, నార్వే, చైనా దేశాల్లోనే అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఎక్కడ బుల్లెట్ రైలు నిర్మాణం జరిగినా ఈ భారీ యంత్రాలు ఈ దేశాల నుంచి సరఫరా కావాల్సిందే. అయితే ఇండియా ఆ దేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ యంత్రాలను రూపొందిస్తోంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో నిర్మాణం జరుపుకునే బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో కీలక భూమిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. Flagged off Made in India engineering marvel, a reflection of the 21st Century Mindset. #HighSpeedRailonFastTrack pic.twitter.com/7EzkdPaWFI — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 9, 2021 చదవండి: Infosys: ఈ కామర్స్ స్పెషల్.. ఈక్వినాక్స్ సొల్యూషన్స్ -
మనం బుల్లెట్ రైళ్లను నడపడమా?
భారతీయ రైల్వే పట్టాలపై బుల్లెట్ ట్రెయిన్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే ‘ఏమీ హాయిలే హలా’ అంటూ పాడుకోవచ్చు. అమెరికా, చైనా, జపాన్లే కాదు, భారత్ కూడా గాలిలో తేలిపోయే బుల్లెట్ ట్రెయిన్లను నడుపుతుందోచ్! అంటూ గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉంటుందే తప్ప, వాస్తవానికి దగ్గరగా ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం మన ప్రభువులు దుర్మార్గాన్ని చెప్పకనే చెబుతోంది. గత రెండున్నర నెలల్లో జరిగిన ఇది మూడో పెద్ద ప్రమాదం. నవంబర్ 10వ తేదీన ఇండోర్-పట్నా రైలు పట్టాలు తప్పడంతో 150 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెల్సిందే. మృతుల రీత్యా ఆ తర్వాత సంభవించిన రెండో పెద్ద ప్రమాదం ఇదే. 2009–10 నుంచి 2015–16 మధ్య దేశంలో సంభవించిన రైలు ప్రమాదాల్లో మొత్తం 620 మంది ప్రయాణికులు మరణించారు. అధికారంలో ఉన్న మన ప్రభువులు బుల్లెట్ రైళ్ల గురించి కలగంటున్నారే తప్ప ప్రస్తుతం నడుపుతున్న రైళ్లకు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు సరైన చర్యలేవీ తీసుకోవడం లేదు. ముంబై–సూరత్ మధ్య బుల్లెట్ రైలు నడపాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేసింది. అందులో సగం నిధులను వెచ్చించినా రైలు పట్టాలను పటిష్టం చేసుకోవచ్చు. ప్రమాదాలు జరుగకుండా చూసుకోవచ్చు. చైనాలో కిలీమీటరు పట్టాలకు రైల్లో ప్రయాణిస్తున్న ప్రజల సంఖ్యలో మన రైళ్లలో కిలోమీటరుకు ప్రయాణిస్తున్న వారి సంఖ్య 68 శాతమే. అయితే మన దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో పది శాతం కూడా చైనాలో ఎందుకు జరగడం లేదు? చైనా, జపాన్ దేశాలకు బలమైన రైల్వే నెట్వర్క్ ఉంది. అవి బుల్లెట్ ట్రెయిన్లను నడుపుతాయి, అంతకన్నా వేగంగా దూసుకెళ్లే లేజర్ రైళ్లను కూడా నడుపుతాయి. మనం బ్రిటిష్ కాలంలో వేసిన రైలు పట్టాలను కూడా పూర్తిగా మార్చుకోలేదు. మనం బుల్లెట్ రైళ్లను నడిపితే అవి మృత్యు గుహలోకి దూసుకెళ్లాల్సిందే.