-
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. ఉమ్రాన్, అర్ష్దీప్లకు తొలి అవకాశం
ముంబై: ఐపీఎల్లో సత్తా చాటిన ఇద్దరు యువ పేస్ బౌలర్లకు భారత జట్టు పిలుపు లభించింది. ఫాస్ట్ బౌలింగ్తో అదరగొట్టిన ఉమ్రాన్ మలిక్, పొదుపైన బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టడి చేసిన అర్ష్దీప్ సింగ్లకు మొదటిసారి టీమిండియా అవకాశం దక్కింది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ కోసం 18 మంది సభ్యుల భారత జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లి, బుమ్రాలకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ ఈ టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. కొంత విరామం తర్వాత హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 9న (ఢిల్లీ), 12న (కటక్), 14న (విశాఖపట్నం), 17న (రాజ్కోట్), 19న (బెంగళూరు) ఐదు టి20 మ్యాచ్లు జరుగుతాయి. వేగం...పొదుపు... ప్రస్తుత ఐపీఎల్ ప్రదర్శనను కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు ఉమ్రాన్, అర్‡్షదీప్ ఎంపిక చూపిస్తోంది. జమ్మూ కశ్మీర్కు చెందిన ఉమ్రాన్ తన అసలు సిసలు ఫాస్ట్ బౌలింగ్తో అందరి దృష్టిలో పడ్డాడు. ప్రతీ మ్యాచ్లోనూ కనీసం 150 కి.మీ. వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తూ వచ్చిన అతను ఈ సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ (156.9 కి.మీ.)ను నమోదు చేశాడు. వేగంతో కొన్నిసార్లు గతి తప్పినా... ఎక్కువ భాగం నియంత్రణతో కూడిన బౌలింగ్ను ప్రదర్శించిన ఉమ్రాన్ 22 వికెట్లు పడగొట్టాడు. అర్‡్షదీప్ ఖాతాలో 10 వికెట్లే ఉన్నా పొదుపైన బౌలింగ్ (7.70 ఎకానమీ)తో ఆకట్టుకున్నాడు. వారిద్దరూ వచ్చారు... 2021 టి20 ప్రపంచకప్లో ఆడినా ఎక్కువ భాగం బ్యాటింగ్కే పరిమితమైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కోలుకున్న తర్వాత ఐపీఎల్లో పూర్తి స్థాయి ఆల్రౌండర్గా సత్తా చాటుతున్న అతనికి సహజంగానే భారత జట్టులో చోటు లభించింది. 2019 తర్వాత భారత జట్టుకు ఆడని దినేశ్ కార్తీక్ కూడా ఐపీఎల్ ప్రదర్శనతోనే తిరిగి రావడం విశేషం. ఈ సీజన్లో 191.33 స్ట్రయిక్రేట్తో 287 పరుగులు చేసిన అతను డెత్ ఓవర్లలో మరింత చెలరేగిపోయాడు. గాయాల నుంచి ఇంకా కోలుకోని దీపక్ చహర్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ పేర్లను సెలక్టర్లు పరిశీలించలేదు. భారత జట్టు చివరిగా శ్రీలంకతో టి20 సిరీస్ ఆడగా... అందులో భాగంగా ఉన్న సంజు సామ్సన్, మొహమ్మద్ సిరాజ్ మాత్రం జట్టులో చోటు కోల్పోయారు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: హిట్మ్యాన్ ఖాతాలో మరో రెండు చెత్త రికార్డులు -
‘నా శైలి అందరికీ తెలుసు’
రాజ్కోట్: భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడైన చతేశ్వర్ పుజారా పలు సందర్భాల్లో బాగా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. గతంలో ఒక సారి జట్టు కోచ్, కెప్టెన్ కూడా అతని స్ట్రయిక్రేట్ను ప్రశ్నించారు. దూకుడుకు చిరునామాగా మారిన ఈతరం క్రికెట్లో పుజారా బ్యాటింగ్ శైలి చాలా మందిని ఆకట్టుకోదు. ఇటీవల బెంగాల్తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో కూడా అతను ఇదే తరహాలో ఆడాడు. జ్వరంనుంచి కోలుకొని ఇన్నింగ్స్ కొనసాగించిన అతను 237 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో సగటు క్రికెట్ అభిమానులు మళ్లీ పుజారా ఆటతీరును విమర్శించారు. దీనిపై ఇప్పుడు స్వయంగా పుజారానే స్పందించాడు. ‘నా ఆటతీరు గురించి మీడియాలోనే అనేక రకమైన వార్తలు కనిపిస్తాయి. అయితే జట్టు అంతర్గత చర్చల్లో మాత్రం దీని గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ నాకు పూర్తిగా మద్దతిస్తోంది. వేగంగా ఆడాలంటూ కెప్టెన్నుంచి గానీ కోచ్నుంచి గానీ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు’ అని పుజారా వివరణ ఇచ్చాడు. కరోనా కారణంగా ప్రస్తుతం ఎక్కడికీ వెళ్లకుండా పుజారా కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ‘మీ అందరికీ ఒక విషయం చెప్పదల్చుకున్నా. నా స్ట్రయిక్రేట్ గురించి చర్చ రాగానే అంతా టీమ్ మేనేజ్మెంట్ నాతో ఎలా వ్యవహరిస్తోందో అని ఆలోచిస్తారు. అయితే వారందరికీ నా శైలి బాగా తెలుసు. నా ఆట ప్రాధాన్యత కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచలేదు’ అని పుజారా అన్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది తనను పరుగులు చేసేందుకు అన్నేసి బంతులు ఎందుకు తీసుకుంటావని అడుగుతుంటావని, అయితే తాను వాటిని పట్టించుకోనని చింటూ చెప్పాడు. ‘అసలు అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. జట్టు మ్యాచ్లు గెలిచేలా నా వంతు పాత్ర పోషించడమే నా పని. చాలా మందికి ఒక వ్యక్తిలో తప్పును గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇది నా ఒక్కడికే పరిమితం కాదు. నేను ఆడిన టెస్టులు, వాటిలో చేసిన పరుగులు, క్రీజ్లో గడిపిన సమయం చూస్తే ప్రత్యర్థి జట్టులో కూడా ఎక్కువ మంది ఇదే తరహాలో ఆడారని అర్థమవుతుంది’ అని ఈ సౌరాష్ట్ర బ్యాట్స్మన్ వ్యాఖ్యానించాడు. అయితే తన గురించి తాను వాస్తవంగా ఆలోచిస్తానని, మరీ దూకుడుతనంతో ఆడలేనని ప్రత్యేకంగా విషయం తనకు తెలుసని కూడా పుజారా వివరించాడు. ‘నేను డేవిడ్ వార్నర్లా, వీరేంద్ర సెహ్వాగ్లా ఆడలేనని నాకు తెలుసు. కానీ ఒక సాధారణ బ్యాట్స్మన్ క్రీజ్లో ఎక్కువ సమయం తీసుకుంటే తప్పేమీ లేదు’ అని అతను చెప్పాడు. న్యూజిలాండ్తో ఇటీవల జరిగిన సిరీస్లో ఒకే ఒక అర్ధ సెంచరీ చేసిన పుజారా ఈ ఏడాదిలో ఒక్క శతకం కూడా కొట్టలేకపోయాడు. ఇది తనను కొంత నిరాశకు గురి చేసిందని భారత టెస్టు స్పెషలిస్ట్ చెప్పాడు. ‘అభిమానులు నేను భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటారు. నేనూ సెంచరీ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. అయితే ఓవరాల్గా టెస్టుల్లో దాదాపు 50 సగటు ఉందంటే ప్రతీ రెండో ఇన్నింగ్స్లో నేను అర్ధ సెంచరీ చేసినట్లే. సీజన్ గొప్పగా సాగలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. నా ఫామ్ దిగజారిందని అంగీకరించను. ప్రతీ ఇన్నింగ్స్కు తనదైన విలువ ఉంది’ అని పుజారా వెల్లడించాడు. ఈతరం క్రికెటర్లు టెస్టులపై ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది. డబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కుర్రాళ్లు టెస్టులకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఇందులో తప్పేమీ లేదు కానీ టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ఆటగాడి అసలు సత్తాను ఐదు రోజుల మ్యాచ్లే బయటపెడతాయి’ అని పుజారా అన్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ తమకు అత్యంత కీలకమన్న భారత టెస్టు మూడో నంబర్ ఆటగాడు... మన పేసర్లు పూర్తి ఫిట్నెస్, తగినంత విరామంతో సిద్ధంగా ఉంటే మళ్లీ సిరీస్ గెలవవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 సిరీస్ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. -
ప్రతీకారం తీర్చుకుంటారా!
మైసూర్: వన్డేల్లో వెస్టిండీస్ ‘ఎ’చేతిలో అనూహ్యంగా ఓడిన భారత్ ‘ఎ’ ఇప్పుడు ప్రతీకార పోరుకు సిద్ధమైంది. చతేశ్వర్ పుజారా నేతృత్వంలోని భారత జట్టు, మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ప్రారంభమయ్యే తొలి అనధికారిక టెస్టులో వెస్టిండీస్తో తలపడనుంది. ఇటీవల దక్షిణాఫ్రికాలో భారత్ ‘ఎ’ను విజయవంతంగా నడిపించిన చతేశ్వర్ పుజారా నాయకత్వంలోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. వెస్టిండీస్తో భారత సీనియర్ జట్టు సిరీస్ ఉండటంతో ఈ సిరీస్లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్న అనేక మంది యువ ఆటగాళ్లకు ఇదో చక్కటి అవకాశం. పటిష్టమైన లైనప్: భారత టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా మారిన పుజారా ‘ఎ’ సిరీస్లో భారీగా పరుగులు సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతంగా రాణించిన అతను అదే జోరు ప్రదర్శిస్తే విండీస్కు కష్టాలు తప్పవు. ఇటీవల కివీస్పై రాణించిన మన్ప్రీత్ జునేజా కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. జీవన్జ్యోత్ సింగ్, కేఎల్ రాహుల్, రజత్ పాలివాల్, హర్షద్ ఖడీవాలే రూపంలో జట్టులో ఇతర ప్రధాన బ్యాట్స్మెన్ ఉన్నారు. బ్యాటింగ్తో పోలిస్తే బౌలింగ్లో చక్కటి అనుభవం భారత్ సొంతం. అశోక్ దిండా, మొహమ్మద్ షమీ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ఆడగా, పర్వేజ్ రసూల్, ఈశ్వర్ పాండే చక్కటి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా మూడు టెస్టులకూ ఎంపికైన ఏకైక ఆటగాడైన రసూల్ తన ఆల్రౌండ్ నైపుణ్యంతో తొలి అవకాశం దక్కించుకోవాలని భావిస్తున్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement