-
అమెరికా వెళ్తే అంతే మరి..
హూస్టన్: వలసదారుల్ని వెనక్కి పంపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ ఎత్తుగడలతో ఎన్నో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరవుతున్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిందనే కారణంగా తన ముగ్గురు పిల్లలకు దూరం అయిన ఒక తల్లి దీనగాథ ఇది. బతుకుదెరువు కోసం సుమారు 3 వేల మైళ్లు ప్రయాణం చేసి భర్తను కలుసుకునేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికాకు బయలుదేరింది సిల్వానా. అప్పటికే తన భర్త దుండగుల చేతిలో చిక్కి చావు నుంచి తప్పించుకుని అఙ్ఞాతంలో నివసిస్తున్నాడని ఆమెకు తెలియదు. మధ్య అమెరికాలోని ఈఐ సెల్వడార్కు చేరుకుంది. గన్ కల్చర్కు చిరునామాగా ఉన్న అమెరికా దేశాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని ఎందుకు చంపుతారో కూడా తెలియదు. సిల్వానా కూడా సరిగ్గా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టాక్సీ దిగగానే వారిని అడ్డుకున్న ఓ గ్యాంగ్ ఆమె పెద్ద కుమారుడికి తుపాకీ గురిపెట్టింది. కానీ అదృష్టవశాత్తూ అందులోని బుల్లెట్లు అయిపోవడంతో నిన్ను వదిలేస్తున్నామంటూ గ్యాంగ్స్టర్ వెళ్లిపోయాడు. కానీ వారిలో భయం మాత్రం పోలేదు. అదే తన పిల్లలతో గడిపే చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు. గ్యాంగ్ నుంచి ఎలాగోలా తప్పించుకుని తనవారిని కాపాడుకుంది. మెక్సికో సరిహద్దులో వలసదారులతో కలిసి చేసిన ప్రయాణం ఆమెకు తన పిల్లల్ని దూరం చేసింది.. ఆమెను జైలు పాలు చేసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులను చూడగానే వలసదారులు అక్కడ ఉన్న ఎత్తైన గోడను దాటి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, సిల్వానా కూడా తన పిల్లలిద్దరినీ గోడ అవతలి వైపు పంపివేసింది. మూడేళ్ల కుమారున్ని గోడపై నుంచి విసిరివేయగా అవతలవైపు ఉన్నవారు బ్లాంకెట్ సాయంతో అతన్ని పట్టుకున్నారు. ‘ఎప్పుడైతే పిల్లలు దూరమయ్యారో అప్పుడే నా ఆత్మ నన్ను వదిలిపోయిందని’ ఒక ఇంటర్వ్యూలో తన చేదు ఙ్ఞాపకాలను గుర్తుచేసుకుంది సిల్వానా. ఆమెను అక్రమవలసదారుగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికా చట్టాల ప్రకారం ఆమెను నిర్బంధించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు అధికమయ్యాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేయడం అన్యాయమని, అమెరికా కుటుంబ చట్టాల ప్రకారం ఇది విరుద్దమని డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధులు దేశ భద్రత విభాగానికి లేఖ రాశారు. తాజాగా ఓ ఏడేళ్ల అమ్మాయిని తల్లికి దూరం చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారులపై ఆరోపణలు రావడంతో.. పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇటువంటి విధానాల వల్ల ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులకు దూరమవుతున్నారని అమెరికన్ సివిల్ లిబర్టీ యూనియన్ డిప్యూటీ డైరెక్టర్ లీ గెలెంట్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి దూరమై.. వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు ఒక హోటల్కి తీసుకువెళ్లేందుకు వ్యాన్ ఎక్కించారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. వారిలో సిల్వానా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న తమ్ముడిని ఒడిలో పెట్టుకుని, చెల్లిని ఓదారుస్తూ, నాన్న కనిపిస్తాడేమోనన్న ఆశతో ఆ రాత్రంతా నిద్రపోలేదు సిల్వానా పెద్ద కొడుకు. హోటల్కు చేరుకోగానే తమ తండ్రి వద్దకు తీసుకువచ్చారేమో అని సంబరపడింది సిల్వానా కూతురు. కానీ ఆమె ఆనందం అంతలోనే ఆవిరైంది. అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు గదులు కేటాయించడంతో సోదరులకు కూడా దూరం అయింది. కేవలం భోజన సమయాల్లో వారిని చూసేందుకు వీలయ్యేది. అన్నను కలిసిన ప్రతీసారీ ఆమె అడిగే ఒకే ఒక ప్రశ్న అమ్మ ఎక్కడా అని. అమ్మ కావాలి అంటూ ఏడ్చే చిన్నారి తమ్ముడిని ఎలా ఓదార్చాలో అర్థంకాక.. చెల్లికి సమాధానం చెప్పలేక ఎంతో కుమిలిపోయేవాడు ఆమె పెద్ద కొడుకు. తల్లి ఇచ్చిన ఫోన్ బుక్ను పోగొట్టుకున్నాడు. తండ్రిని కలుసుకునేందుకు మార్గాల కోసం అన్వేషించాడు. ఫేస్బుక్ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దామనుకుంటే అక్కడ యాక్సెస్ లేదని అధికారులు చెప్పడంతో నిరాశ చెందాడు. చేసేదేమీలేక చుట్టూ ఉన్న వారితో కొత్త స్నేహాలు ఏర్పరచుకున్నారు. కొద్దిరోజులకే వారిని కూడా ఎప్పటికపుడు తమ దేశాలకు తిరిగి పంపించేయడంతో మళ్లీ ఒంటరివారిగా మిగిలేవారు సిల్వానా పిల్లలు. తల్లి కోసం ఏడ్చిన ఆమె కూతురు.. మరో నాలుగేళ్ల చిన్నారిని తల్లిలా లాలించడం నేర్చుకుంది. రోజులు గడుస్తున్నా తల్లిజాడ తెలియక వెక్కి వెక్కి ఏడ్చే ఆ చిన్నారులది అరణ్యరోదనగానే మిగిలింది. 21 రోజుల నిరీక్షణ అనంతరం.. తండ్రి యులియో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పిల్లలతో ఫోన్లో మాట్లాడిన అనంతరం సిల్వానాలో ఆశలు చిగురించాయి. కానీ చిన్న కొడుకు మాత్రం ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడకపోవడం ఆమెను ఎంతగానో బాధించింది. హుస్టన్ ఎయిర్పోర్టులో పిల్లల్ని రిసీవ్ చేసుకోవాలని అధికారులు సమాచారంతో అందిచడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తల్లి కూడా ఎయిర్పోర్టుకు వస్తుందని ఎదురుచూసిన చిన్నారులకు నిరాశే ఎదురైంది. నిర్బంధం నుంచి విముక్తి.. అరిజోనాలో సిల్వానాను నిర్బందించారు అధికారులు. తన పిల్లల గురించి అడిగిన ప్రతిసారీ ఆమెకు ఎటువంటి సమాధానం లభించేది కాదు. కొన్నాళ్ల తర్వాత ఆమెను తిరిగి పంపించేందుకు, వలసదారులతో కలిసి విమానం ఎక్కించారు. ‘మిగతావారంతా సంతోషంగానే ఉన్నారు. నేను మాత్రమే పిల్లలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నానని కుమిలిపోయింది సిల్వానా. నిర్భంధంలో ఉన్నప్పటికీ భర్తను కలుసుకోగలిగింది కానీ.. పిల్లల జాడ మాత్రం తెలుసుకోలేపోయింది. తనలాగే పిల్లలకు దూరమైన 8 మంది తల్లుల్ని కలుసుకుంది సిల్వానా. సెల్వడార్లో తమను బెదిరించి, తమ జీవితాలు చెల్లాచెదురవడానికి కారణమైన దుండగులను గుర్తుపట్టి పోలీసులకు సాయం చేసింది. 2000 డాలర్ల పెనాల్టీ విధించి ఆమెకు విముక్తి కలిగించారు అధికారులు. అంతులేని ఆనందంతో.. రిలీజ్ అయిన వెంటనే పిల్లల్ని చూసేందుకు ఆత్రుతగా బయలుదేరింది. కానీ తనను పిల్లలు క్షమిస్తారా.. మూడేళ్ల పసివాడు కనీసం గుర్తిస్తాడా అనే సందేహాలతో సతమతమైంది. పెద్ద వాళ్లిద్దరూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చిన్న కుమారుడు మాత్రం ఎంతగా ప్రయత్నించినా తల్లి దగ్గరకు రాలేదు. సోదరుడి వద్దే ఉండిపోయాడు. ఆ చిత్రాన్ని చూసిన యులియో కూడా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. -
గల్ఫ్ ఏజెంట్లలో వణుకు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 66 మంది ఏజెంట్ల అరెస్ట్ సిరిసిల్ల: అరచేతిలో స్వర్గం చూపించి నిరుద్యోగ యువతను గల్ఫ్ దేశాలకు పంపించే ఏజెంట్ల గుండెల్లో వణుకు మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పక్షం రోజుల్లో 66 మందిని జిల్లా పోలీసులు అరెస్ట్లు, బైండోవర్లు చేశారు. ట్రావెల్ ఏజెన్సీలపై టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించి నకిలీ దందాకు ఉచ్చు బిగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా వంద మందికిపైగా అనధికారిక గల్ఫ్ ఏజెంట్లు ఉన్నారు. ముంబై, హైదరాబాద్ కేంద్రాలుగా వీరు గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపిస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అనుమతి పొందిన ఏజెంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు ఉండగా.. వారి అధీనంలో అనధికారిక ఏజెంట్లు వందలాది మంది ఉన్నారు. గల్ఫ్ దేశాల్లోని వివిధ కంపెనీల వీసాలను రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి ధరలను పెంచి అంటగడుతున్నారు. దుబాయికి చెందిన పేరున్న కంపెనీ వీసా అన్ని ఖర్చులు కలుపుకొని రూ. 30వేలు ఉంటే.. దాన్ని రూ. 50 నుంచి రూ.60వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లో చేయాల్సిన పనిని చెప్పకుండా హోటల్లో పని అని, గార్డెన్లో, పెట్రోల్ బంకుల్లో, విమానాశ్రయాల్లో, కంపెనీల్లో సెక్యూరిటీ గార్డు, ఇంటి కారు డ్రైవర్ అంటూ సులభమైన పనిని చెప్పి పంపిస్తున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి అధికవడ్డీలకు అప్పులు చేసి వెళ్తున్న యువ కులు తీరా అక్కడికి వెళ్లాక మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమంటున్నారు. సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా సుమారు 25వేల మంది యువకులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏజెంట్ చేసిన మోసంతో ఇంటికి రాలేక.. అక్కడే ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. గల్ఫ్బాటలో ఏజెంట్ల మాటలే కీలకంగా మారాయి. అలాంటి ఏజెంట్లపై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 66 మంది ఏజెంట్లను పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకుని అరెస్ట్, బైండోవర్ చేశారు. అన్ని మండలాల్లోనూ ఇంకా అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. అంతేకాకుండా పోలీసులు గ్రామాల వారిగా వివరాలు సేకరించి వారిపై నిఘా ఉంచారు. దుబాయ్ వెళ్లి వచ్చిన మంత్రి కేటీఆర్ వలస జీవుల కష్టాలను విన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రవాసీ తెలంగాణ శాఖ మంత్రి కె.తారకరామారావు మంత్రి హోదాలో దుబాయ్ వెళ్లి పరిశీలించారు. గుర్తింపు లేని ఏజెన్సీలు, విజిటింగ్ వీసాలపై వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. తెలంగాణలో గల్ఫ్ వలసజీవుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చేందుకు చర్యలు తీసు కుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తం గా పోలీసు దాడులు జరగడం విశేషం. గల్ఫ్ బాటలో మోసాలను అరికట్టే పక్రియకు సిరిసిల్ల నుంచే శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇరాక్లో ఉన్న రాష్ట్ర కార్మికులకు సుష్మా భరోసా మోర్తాడ్: ఇరాక్లో ఇక్కట్లు పడుతున్న రాష్ట్ర కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సానుకూలత వ్యక్తం చేసింది. ఇరాక్లోని వివిధ ప్రాంతాల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది కార్మికులున్నారు. వారిని కంపెనీ వీసాలపై కాకుండా విజిట్ వీసాలపై ఏజెంట్లు ఇరాక్కు పంపించారు. వీసాల గడువు ముగియ డంతో వారికి ఇరాక్లోని కంపెనీలు పని ఇవ్వడం లేదు. దీంతో కార్మికులు ఇరాక్లో ఉండలేమని ఎలాగైనా ఇంటికి చేరుకోవా లని ఆశిస్తున్నారు. అయితే విజిట్ వీసా గడువు ముగిసి పోవడంతో కార్మికులు ఇంటికి వెళ్లాలంటే జరిమానా చెల్లించాలని ఇరాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాక్ వెళ్లడానికి అప్పు చేసిన తాము మళ్లీ ఇంటికి రావడానికి అప్పు చేయాల్సి రావడంతో కార్మికుల పరిస్థితి దిక్కుతోచకుంది. ఈ క్రమంలో అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్న జన్నారం వాసి కొమురయ్య ఎప్పటికప్పుడు తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బసంత్రెడ్డికి సమాచారం అందిస్తు న్నారు. బసంత్రెడ్డి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ద్వారా కార్మికుల ఇబ్బందులను విదేశాంగ శాఖకు విన్నవించారు. వీరి చొరవ వల్ల 33 మంది ఎలాంటి జరిమానా చెల్లించకుండా ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా వందలాది మంది కార్మికులు ఇరాక్లో ఉన్నారని విదేశాంగ శాఖకు బసంత్రెడ్డి సమాచారం ఇవ్వడంతో విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. జరిమానా చెల్లించ కుండా ఇళ్లకు చేర్పించడానికి చర్యలు తీసు కుంటామని సుష్మా స్వరాజ్ ట్వీటర్ ద్వారా తెలిపారు. ఇరాక్లో ఉన్న కార్మికులు బాగ్దాద్ లోని రాయబార కార్యాలయంలో సంప్ర దించాలని లేదా ఎర్బీల్లోని కాన్స్ లేట్ కార్యాలయం 009647517402100 నంబర్ లో సంప్రదించాలని సుష్మా స్వరాజ్ ట్వీటర్లో సూచించారు. అనుమతి లేకుంటే చర్యలు విదేశాలకు చట్టపరమైన అనుమతులు లేకుండా పంపించడం నేరం. ఇమిగ్రేషన్ యాక్టు ప్రకారం అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ట్రావెల్ ఏజన్సీలు నిర్వహించడం చట్టవిరుద్దం. పాస్పోర్టులు కలిగి ఉండడం నేరం. జిల్లాలో ఏజెంట్లను మొదటి తప్పిదంగా భావించి బైండోవర్ చేశాం. మళ్లీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – విశ్వజిత్ కాంపాటి, జిల్లా ఎస్పీ. -
సింగపూర్లో భారతీయులు అరెస్ట్
సింగపూర్: వీసా కాలపరిమితి ముగిసిన ఇంకా దేశంలోనే నివసిస్తున్న 26 మందిని ఇమ్మిగ్రేషన్ చట్టం కింద అరెస్ట్ చేసినట్లు సింగపూర్ ఇమ్మిగ్రేషన్ మరియు చెక్ పాయింట్ అథారటీ (ఐసీఏ) ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు మంగళవారం సింగపూర్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 26 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో అత్యధికులు భారత్కు చెందిన వారు కాగా మిగత వారు చైనా దేశస్థులని వారు పేర్కొన్నారు. వీరికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల యూఎస్ డాలర్లు జరిమాన విధించ వచ్చని అన్నారు. లేకుంటే జైలు శిక్ష, జరిమాన రెండు విధించే అవకాశాలు కూడా ఉన్నాయని ఐసీఏ ఉన్నతాధికారులు చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో 26 నుంచి 62 ఏళ్ల వయస్సు గల వారున్నారని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement