humiliated
-
ఆలయంలో దళిత నవదంపతులకు అవమానం : వీడియో వైరల్
తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోమల్లన్న జాతరలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది. మరోవైపు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కుల వివక్షకు సంబంధించిన మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక దళిత కుటుంబాన్ని అవమానించి, ఆలయం నుండి బహిష్కరించిన ఘటన ఘర్షణకు దారి తీసింది. ఈఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతంప్రత్యక్ష సాక్షుల ప్రకారం గోని గ్రామంలోని అరసమ్మ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన దళిత జంట ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వచ్చినప్పుడు నారాయణప్ప అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఆధిపత్య కులానికి చెందిన నారాయణప్ప, ఎలాగైనా వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నానాయాగీ చేశాడు. తనకు దేవత సోకిందంటూ నాటకం ఆడాడు. మెకాళ్లపై అమ్మవారికి అడ్డంగా కూర్చొని, వారిని దర్శనం చేసుకోనీయకుండా అడ్డుపడటం ఫుటేజ్లో ఉంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి వెంటనే వెళ్లి పోవాలంటూ గట్టిగా అరుస్తూ ఊగిపోయాడు."Dalits can't enter Hindu temple." 🚨A newly married Dalit couple was humiliated and forced out of temple in Karnataka.Where are those "South Indians" who mock "North" over such acts? Speak up, saar..😭Be it North or South, when it comes to caste, entire nation is doomed.… pic.twitter.com/RtJ2ol9Zub— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) February 24, 2026 దీంతో ఆవేదనకు గురైన వరుడు జగదీష్ న్యాయం కోసం అధికారులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద తురువేకెరె పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ కేవీ అశోక్ తురువేకెరె పోలీస్ స్టేషన్లో తమకు అందిన ఫిర్యాదు మేరకు ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం! -
దారుణంగా అవమానించారు
రాంచీ: ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచి్చందని జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం సీనియర్ నాయకుడు చంపయ్ సోరెన్ అన్నారు. బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపయ్ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కలి్పంచారని చంపయ్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారు: హేమంత్బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేస్తోందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. బీజేపీ గుజరాత్, అస్సాం, మహారాష్ట్ర నుంచి నాయకులను జార్ఖండ్కు తెచ్చి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీల్లో విషం నింపుతోందని, ఒకరిపైకి మరొకరిని ఉసిగోల్పుతోందని అన్నారు. ‘సమాజాన్ని విభజించడం మాట అటుంచితే.. వీళ్లు కుటుంబాలకు, పారీ్టలను కూడా చీల్చుతారు. ఎమ్మెల్యేలకు ఎర వేస్తారు. డబ్బు నాయకులను పార్టీలు మారేలా చేస్తుంది’ అని హేమంత్ పరోక్షంగా చంపయ్ను విమర్శించారు. -
బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్..
లక్నో: యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్ ఒక ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన సంఘటన పెను సంచలనంగా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటుంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గి రాజుకుంది. ఉత్తర్ప్రదేశ్ ముజఫ్ఫర్నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ అమానుషంగా వ్యవహరించి పసి మనసుల్లో మత విద్వేషాలను నాటే ప్రయత్నం చేసిందని తెలిపారు యూపీ పోలీసులు. వీడియో ఆధారంగా యూపీ పోలీసులు టీచర్పైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. How humiliating for a small child to be put through this at a young age. Making the Muslim boy stand in front of the whole class and getting the Hindu kids to come and slap him. That teacher needs a slap tbh pic.twitter.com/n1KDWtTTwQ — Abu Hafsah (@AbuHafsah1) August 25, 2023 పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. టీచర్ కొట్టించిన బాలుడు ముస్లిం. టీచర్ కచ్చితంగా మతపరమైన దూషణలు చేసినట్టు వీడియోలో స్పష్టమైందని అయితే ఆమె నైజం ఏమిటన్నది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముస్లిం విద్యార్థి గణిత పట్టికలను నేర్చుకోలేదని మతపరమైన దూషణ చేస్తూ తోటి విద్యార్థులను ఆ బాలుడిపై దాడి చేయమని ఉసిగొల్పారన్నారు. బాలల హక్కుల సంఘం కూడా టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యం రాజీకి వచ్చిందని తాము కట్టిన ఫీజును కూడా తిరిగి చెల్లించిందని ఇకపై తమ బిడ్డను ఆ పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై స్పందించే ఉద్దేశ్యం తనకు లేదని దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవిత్రమైన పాఠశాలలో పిల్లల మనసుల్లో విద్వేషాలను నాటడం కంటే దేశద్రోహం మరొకటుండదు. ఇది దేశాన్ని బుగ్గిపాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పోసిన ఆజ్యమే. చిన్న పిల్లలు దేశ భవిష్యత్తు. వారిని ద్వేషించకుండా ప్రేమతత్వాన్ని నేర్పాలని అన్నారు. मासूम बच्चों के मन में भेदभाव का ज़हर घोलना, स्कूल जैसे पवित्र स्थान को नफ़रत का बाज़ार बनाना - एक शिक्षक देश के लिए इससे बुरा कुछ नहीं कर सकता। ये भाजपा का फैलाया वही केरोसिन है जिसने भारत के कोने-कोने में आग लगा रखी है। बच्चे भारत का भविष्य हैं - उनको नफ़रत नहीं, हम सबको मिल… — Rahul Gandhi (@RahulGandhi) August 25, 2023 మరో ఎంపీ జయంత్ సింగ్ స్పందిస్తూ.. హింసను రెచ్చగొడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా మతవిద్వేషాలు ఎంత లోతుగా పాతుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూడాలని.. పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. Muzaffarnagar school video is a painful warning of how deep rooted religious divides can trigger violence against the marginalised, minority communities. Our MLAs from Muzzafarnagar will ensure that UP Police files a case suomoto & the child’s education is not disrupted! — Jayant Singh (@jayantrld) August 25, 2023 ఇది కూడా చదవండి: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు -
రైతు ప్రతీకారం అదిరింది.. సినిమాలోని ట్విస్ట్ మాదిరిగా ఉంది!
Karnataka Farmer Was Humiliated At Mahindra Car Showroomఒక మనిషి ఆహార్యాన్ని బట్టి లేదా వేషధారణ చూసో తక్కువగా అంచనా వేయకూడదు. కొంతమంది ఇతరుల సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడటమే కాక అవమానించాలనుకుంటారు. నిజానికి ఆ విధంగా చేస్తున్న వాళ్లే అందరిలోనూ నవ్వులు పాలవ్వడమే కాక క్షమాపణ కోరే పరిస్థితిని తెచ్చుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే..కర్ణాటకలో తుమకూరులోని మహీంద్రా షోరూమ్కి కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. ఆ రైతు ఆ షోరూమ్లోని సేల్స్మేన్ చేత అవమానింపబడ్డాడు. అతని వేషధారణ చూసిన సేల్స్మేన్ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని వెటకారంగా చెప్పాడు. పైగా నీ జేబులో కనీసం రూ. 10 కూడా ఉండకపోవచ్చు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ కెంపె గౌడని చాలా అవమానించి మాట్లాడాడు. Karnataka farmer's sweet revenge on the Mahindra showroom: దీంతో ఆ సేల్స్మేన్కి రైతు కెంపెగౌడకి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువస్తే గనుక నువ్వు ఎస్యూవీ కారుని ఈ రోజే డెలివరీ చేయాలి" అని సేల్స్మేన్కి ఒక చాలెంజ్ కూడా విసిరాడు. ఈ క్రమంలో రైతు సినిమాలోని హీరో మాదిరిగా ఒక గంటలో రూ.10 లక్షలు తీసుకువచ్చి సేల్స్మేన్కి చూపించాడు. దీంతో సేల్స్మేన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ సేల్స్మేన్ వెంటనే డెలీవరీ చేయడంలో విఫలమయ్యాడు, ఎందుకంటే వెయిటింగ్ లిస్టింగ్ ఉంటుంది కదా. దీంతో రైతు కెంపెగౌడ ఒక్కసారిగా ఆ సేల్స్మేన్ పై మండిపడటమే కాక అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది. కానీ ట్విస్ట్ ఏంటంటే తనకు ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాక నెటిజన్లు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఈ వీడియోని విస్తృతంగా ట్వీట్ చేశారు. (చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు!) -
అమరీందర్ నిబద్ధతపై సందేహం: రావత్
డెహ్రాడూన్/చండీగఢ్: బీజేపీకి చెందిన అమిత్షా తదితర నేతలతో మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంతనాలు జరుపుతుండటంపై పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జి హరీశ్ రావత్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు అమరీందర్ లౌకికతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు. పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు. సైద్ధాంతికంగా ఏమాత్రం పొసగని నాయకులతో అంటకాగవద్దనీ, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్ నాయకత్వానికే మద్దతు ఇవ్వాలని కెప్టెన్ను రావత్ కోరారు. బీజేపీ వలలో పడవద్దని హితవు పలికారు. పంజాబ్ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన వ్యక్తి పార్టీ అవమానించిందని భావించడం సరికాదని చెప్పారు. ఆయనకు ఎటువంటి అవమానం జరగలేదని స్పష్టం చేశారు. సీఎంగా విద్యుత్, డ్రగ్స్ వంటి కీలకమైన అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కెప్టెన్ విఫలమయ్యారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సహా తనకు ఎవరి సలహా అక్కర్లేదన్న అహంభావంతో వ్యవహరించారని ఆరోపించారు. స్పందించిన కెప్టెన్ తన నిబద్ధతపై హరీశ్రావత్ సందేహాలు వ్యక్తం చేయడంపై కెప్టెన్ అమరీందర్ తీవ్రంగా స్పందించారు. తన బద్ధశత్రువులు, తీవ్రంగా విమర్శించే వారు సైతం లౌకికత విషయంలో తనను అనుమానించలేరన్నారు. ఇన్నేళ్లుగా విశ్వాసంగా పనిచేసిన తనకు ఆ పార్టీలో గౌరవం లేదని ఆయన వ్యాఖ్యలతో పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు. సిద్దూ నేతృత్వంలోని తిరుగుబాటుదారులకు మద్దతు పలకడంతోపాటు తనను విమర్శించే స్వేచ్ఛ ఇచ్చారన్నారు. ‘సీఎల్పీ సమావేశంలో నన్ను దాదాపుగా తొలగించేందుకు రంగం సిద్ధం అయింది. ఆ అవమానం పొందడం ఇష్టంలేక ముందుగానే వైదొలిగాను. ఇది అందరికీ తెలిసిన విషయమే’అని ఆయన తెలిపారు. వాస్తవాలిలా ఉంటే, హరీశ్రావత్ మాత్రం ఇందుకు విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. -
పంజాబ్ సీఎం అమరీందర్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్(79) రాజీనామా చేశారు. అవమానభారంతో పదవి నుంచి వైదొలుగుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను తదుపరి సీఎంగా ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించనని కుండబద్దలు కొట్టారు. కొత్త సీఎంను ఎన్నుకునే అధికారాన్ని అధినేత్రి సోనియాకు అప్పగిస్తూ పంజాబ్ సీఎల్పీ నిర్ణయించింది. సింగ్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్లో అసమ్మతికి తెరదించినట్లయింది, కానీ రాబోయే ఎన్నికల్లో ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్న మొదలైంది. పంజాబ్లో పతనావస్థలో ఉన్న పారీ్టకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తినివ్వడంలో అమరీందర్ పాత్ర చాలా ఉంది. కానీ చివరకు అసమ్మతి రాజకీయాలకు తలొగ్గి, సోనియాతో చర్చల అనంతరం సీఎల్పీ సమావేశానికి ముందు రాజీనామాను సమర్పించారు. ఇప్పటికి ఇది మూడో సీఎల్పీ సమావేశమని, తాజా సమావేశంపై తనకు కనీస సమాచారం లేదని ఆయన చెప్పారు. తనపై అపనమ్మకాన్ని అవమానంగా భావిస్తున్నట్లు రాజీనామాను గవర్నర్కు సమర్పించిన అనంతరం అమరీందర్ వ్యాఖ్యానించారు. 50కిపైగా కాంగ్రెస్ ఎంఎల్ఏలు కెప్టెన్ను మార్చాలంటూ సోనియాకు లేఖ రాశారు. అమరీందర్ రాజీనామాతో సిద్ధూకు, తనకు జరుగుతున్న పోరులో సిద్దూదే పైచేయి అయినట్లయింది. అమరీందర్ ఇష్టానికి వ్యతిరేకంగా సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ను చేయడం తెల్సిందే. సమయం వచ్చినప్పుడు చెప్తా రాజీనామా అనంతరం భవిష్యత్ ప్రణాళికలపై అమరీందర్ స్పందించారు. అన్నింటికీ ఒక ఆప్షన్ ఉంటుందని, తనకు సమయం వచి్చనప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులతో కలిసి భవిష్యత్పై సమాలోచన జరుపుతానని చెప్పారు. అధిష్టానం ఎవరిని కావాలనుకుంటే వారిని సీఎం చేయవచ్చన్నారు. కానీ తనను ఎందుకు తొలగించాలని నిర్ణయించుకున్నారో అర్ధం కావడం లేదని వాపోయారు. కాంగ్రెస్లో తాను 52 సంవత్సరాలున్నానని, ముఖ్యమంత్రిగా 9ఏళ్లకు పైగా పనిచేశానని గుర్తు చేశారు. ఎంఎల్ఏలు డిమాండ్ చేసిన సమావేశానికి అజయ్ మాకెన్, హరీష్ చౌదరీలను అధిష్టానం పరిశీలకులుగా పంపింది. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ప్రతినిధి హరీష్ రావత్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్లో కాంగ్రెస్ కుమ్ములాటలు పారీ్టకి చేటు చేస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పోరాటాల కెప్టెన్ పాటియాలా రాజవంశానికి చెందిన అమరీందర్ సింగ్ తొలుత సైన్యంలో పనిచేశారు. వారిది సైనిక కుటుంబం, 1965, 1971 యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. డెహ్రాడూన్, ఎన్డీఏల్లో విద్యాభ్యాసం చేశారు. రిటైర్మెంట్ తర్వాత అప్పటి కాంగ్రెస్ యువ నేత రాజీవ్కు సన్నిహితుడయ్యారు. తర్వాత ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు, కానీ బ్లూస్టార్ ఆపరేషన్కు నిరసనగా రాజీనామా చేశారు. 1985లో అకాళీదళ్లో చేరి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. 1998లో కాంగ్రెస్ గూటికి చేరారు. 2002–07లో పంజాబ్ సీఎం అయ్యారు. 2014లో బీజేపీకి చెందిన అరుణ్జైట్లీని ఓడించి ఎంపీ అయ్యారు. 2017 పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ను బలంగా తీర్చిదిద్ది అకాళీదళ్ ఓటమిలో కీలకపాత్ర పోషించారు. పదేళ్ల తర్వాత పంజాబ్లో గెలిపించినందుకు ఆయన్నే అధిష్టానం సీఎంగా చేసింది. సీఎం అయ్యాక రైతు రుణమాఫీ చేసి రైతాంగంలో ఇమేజ్ పెంచుకున్నారు. సిద్దూ కాంగ్రెస్లో చేరిన తర్వాత సింగ్కు పార్టీపై పట్టు తగ్గుతూ వచ్చింది. సిద్దూను మచ్చిక చేసుకునేందుకు తనకు కేబినెట్ పోస్టును సింగ్ ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. 2019లో సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి అమరీందర్పై విమర్శలు పెంచారు. సింగ్ రాజీనామా అనంతరం పంజాబ్ సీఎల్పీ సమావేశం జరిగింది. ‘సిద్ధూ పాక్ తొత్తు’ తన పదవికి ఎసరు పెట్టిన సిద్ధూపై కెప్టెన్ విమర్శలు చేశారు. సిద్దూను సీఎంగా అంగీకరించనన్నారు. సిద్ధూ దేశానికే వ్యతిరేకమని, పాకిస్తాన్ తొత్తు అని తీవ్రంగా నిదించారు. సిద్ధూ అంటేనే సంక్షోభమని, అతను ప్రమాదకారి, అసమర్ధుడు, అస్థిరత్వానికి కారకుడని ధ్వజమెత్తారు. పాకిస్తాన్తో కలిసిపోయినవాడు దేశానికి, పంజాబ్కు ప్రమాదకరమన్నారు. అలాంటివాడు దేశాన్ని నాశనం చేస్తానంటే అంగీకరించనని, ప్రజలకు చెడు చేసే అంశాలపై పోరాటం చేస్తానని తెలిపారు. పాక్ నాయకత్వంతో సిద్దూకు సత్సంబంధాలున్నాయంటూ.. ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి సిద్దూ హాజరవడ్డాన్ని, ఇమ్రాన్ను, పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాను సిద్ధూ గతంలో ఆలింగనం చేసుకోవడాన్ని, వారిని ప్రశంసించడాన్ని గుర్తు చేశారు. పంజాబ్ అంటే దేశ రక్షణ అని, అలాంటి రాష్ట్రానికి సిద్ధూ లాంటివాడు సీఎం కావడాన్ని అంగీకరించనని చెప్పారు. ఒక్క మంత్రిత్వ శాఖనే సరిగ్గా నిర్వహించలేని అసమర్థుడు మొత్తం పంజాబ్ను నడిపించడం జరగని పని అని ఎద్దేవా చేశారు. సిద్ధూకు ఎలాంటి సామర్ధ్యం లేదని, తన మాట కాదని సిద్ధూని సీఎంగా చేస్తే అన్ని విధాలుగా వ్యతిరేకిస్తానని హెచ్చరించారు. సిద్ధూ శకుని పాత్ర పోషిస్తున్నందున తాను సీఎంగా ఉండడని గతంలోనే సోనియాకు చెప్పానని, అప్పుడు రావత్ కూడా అక్కడే ఉన్నారని అమరీందర్ వెల్లడించారు. కానీ అప్పుడు ఆమె తన అభ్యర్ధన మన్నించలేదన్నారు. కాంగ్రెస్కు తాను శక్తిమేర పనిచేశానని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలను విరమించే ప్రసక్తి లేదని అమరీందర్ స్పష్టం చేశారు. సోనియా, రాహుల్తో ఉన్న అనుబంధం దృష్ట్యా తనకు ఇంత అవమానం జరుగుతుందని ఊహించలేదని, కానీ చివరకు తనను తప్పించాలని ఎందుకు నిర్ణయించారో తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యమేస్తోంది’
చంద్రగిరి: దళితుడిని మాతో పాటు సమానంగా వేదికపై ఎలా కూర్చోబెడతారు? వారి పక్కన కూర్చోవాలంటేనే అసహ్యం వేస్తుంది.. మరోసారి ఇలా జరిగితే రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ తెలుగుదేశం మద్దతుదారుడైన ఓ ఉపసర్పంచ్ తన కులపిచ్చిని ఇలా బహిరంగంగా వ్యక్తపరిచిన ఘటన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత పంచాయతీలో శుక్రవారం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రైతు చైతన్యయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా బి.కొంగరవారిపల్లి, భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ లక్ష్మీ, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి, బాధితుడు దళిత నేత, ఎంపీటీసీ అభ్యర్థి రాజయ్యలతో పాటు అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఉప సర్పంచ్ రాకేష్చౌదరి కార్యక్రమం వద్దకు వచ్చి, హాజరుకాకుండా వెనుదిరిగారు. కార్యక్రమం అంతా సజావుగా సాగి, అధికారులు తిరుగు ప్రయాణమయ్యే సమయంలో రాకేష్చౌదరి వేదిక వద్దకు వచ్చి.. మీరు అధికారులేనా.. ఎవరిని వేదికపైకి కూర్చోబెట్టాలో.. పెట్టకూడదో కూడా తెలియదా?.. ఒక దళితుడిని వేదికపై ఎలా కూర్చోబెడతారంటూ అధికారులపై జులుం ప్రదర్శించాడు. వారి పక్కన మాలాంటి వారు (అగ్రకులాల) కూర్చోవాలంటేనే అసహ్యంగా ఉందంటూ ఆయన ప్రవర్తించిన తీరు అక్కడి అధికారులతో పాటు స్థానిక ప్రజలను విస్మయానికి గురిచేసింది. మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంటే సహించేదిలేదని, రైతుభరోసా కేంద్రానికి తాళాలు వేస్తానంటూ అధికారులను హెచ్చరించారు. అనంతరం బాధితుడు రాజయ్య కలుగజేసుకుని దళితులను ఇలా అవమానించి మాట్లాడటం సరికాదని రాకేష్చౌదరికి హితవు పలికారు. అగ్రవర్ణాలతో పాటు దళితులు కూడా ఓటు వేస్తేనే మీరు ఉపసర్పంచ్ అయ్యారని, దళిత జాతిని కించపర్చి మాట్లాడటం సబబు కాదని తెలిపారు. దళితుడైన నేను వేదికపై కూర్చోకూడదని రాజ్యాంగంలో ఉందా అని ఆయన్ను ప్రశ్నించారు. దళితులంటే ముందు నుంచి చిన్నచూపు చూస్తున్నారంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. మరోసారి రాజయ్యపై ఉపసర్పంచ్ అసభ్యకరంగా మాట్లాడటంతో ఆయన తీవ్ర కలత చెందారు. అగ్రకులానికి చెందిన రాకేష్చౌదరి వ్యాఖ్యలతో దళిత నేతలు, కుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు దళితజాతిని కించపరిచేలా మాట్లాడిన రాకేష్చౌదరిపై రాజయ్యతో పాటు దళిత సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
ట్విటర్ వేదికగా సాయం చేసిన మంత్రి
లక్నో, ఉత్తరప్రదేశ్ : కేంద్ర విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. ట్విటర్ వేదికగా సాయం కోరితే వెంటనే స్పందిస్తారు. ఇందకు నిదర్శనంగా లక్నోలో మరో సంఘటన జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న కారణంగా ఓ జంటకు పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు లక్నో పాస్పోర్ట్ అధికారులు. అంతేకాక అన్య మతస్తున్ని పెళ్లి చేసుకున్నందుకు సదరు మహిళను తీవ్రంగా అవమానించారు. దాంతో తమకు సాయం చేయండంటూ ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ను కోరారు. వీరి అభ్యర్ధనకు స్పందించిన సుష్మా స్వరాజ్ వీరికి పాస్ పోర్టు వచ్చేలా చేసారు. వివరాల ప్రకారం...నోయిడాకు చెందిన తన్వి సేత్ అనే మహిళ ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బుధవారం తన్వి కొత్త పాస్పోర్ట్ తీసుకోవడానికి స్థానిక పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లింది. అయితే అక్కడ వికాస్ మిశ్రా అనే అధికారి తాను ముస్లింను వివాహం చేసుకున్నానే కారణంతో తనతో అవమానకరంగా ప్రవర్తించాడని తెలిపింది తన్వి. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా సుష్మా స్వరాజ్కు వివరించింది. ఈ విషయం గురించి తన్వి ‘సుష్మా మేడమ్.. పాస్పోర్ట్ కార్యాలయంలోని అధికారులు ప్రజల పట్ల ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారని నేను అసలు ఊహించలేదు. నేను ముస్లింని పెళ్లి చేసుకున్నానని ఓ అధికారి నన్ను అవమానించాడు. అంతేకాక మా ఇద్దరిలో ఎవరో ఒకర్ని పేరు మార్చుకోవాలని అంటున్నాడు. అందరు చూస్తుండగానే నా మీద కేకలు వేసాడు. ఇంతటి అవమానాన్ని నా జీవితంలో ఎప్పుడు ఎదుర్కోలేదు. ప్రస్తుతం అతడు నా పాస్పోర్ట్తో పాటు నా భర్త పాస్పోర్ట్ను కూడా హోల్డ్లో పెట్టాడు. అతని ప్రవర్తన చూసి షాకయ్యా. నాకు వివాహం అయ్యి 12 ఏళ్ల అవుతుంది. ఇప్పటికి నా సర్టిఫికెట్లలో నా పేరు తన్వీ సేత్గానే ఉంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లు పేరు మార్చుకోవాలనే నియమం ఎక్కడ లేదు. అయినా ఏ పేరు పెట్టుకోవాలన్నది నా వ్యక్తిగత విషయం. ఇది మా కుటుంబానికి సంబంధించినది. మాకు పాస్పోర్ట్ వచ్చేలా సాయం చేయండి’ అని ట్వీట్ చేసింది. దీనిపై సుష్మా స్పందించారు. ఈ కేసును పీయూష్ వర్మ అనే పాస్పోర్ట్ అధికారికి అప్పగించి తన్వి దంపతులకు పాస్పోర్ట్ వచ్చేలా చేసారు. అంతేకాక తన్వి దంపతుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారిని బదిలీ చేశారు. -
కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారని..
జబల్పూర్ : కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారన్న బాధతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్పూర్లో ఏడోతరగతి చదువుతున్న బాలికను గత కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన యువకుడు వెంటపడి వేధిస్తున్నాడు. శనివారం ఆ యువకుడు బాలిక చేతిలో బలవంతంగా ఫోన్ పెట్టి.. తనకు కాల్ చేయాలని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు బాలిక తల్లిదండ్రులు అతడి ఇంటికి వెళ్లారు. తమ కూతురిని వేధిస్తున్న సంగతి వారు యువకుడి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ.. ఈ విషయాన్ని నమ్మకపోగా బాలిక కళ్లముందే ఆమె కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేని బాలిక ఆవేదనకు గురై ఇంటికి వెళ్లిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో వారు గుండెలు బాదుకున్నారు. యువకుడిపై, అతడి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్టు ఏఎస్పీ అల్పానారాయణ్ మిశ్రా తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడైన యువకుడి వయస్సు 17 ఏళ్లు అని, అతడు మైనర్ తల్లిదండ్రులు చెప్తుండగా... ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
నేటి విద్యా వ్యవస్థను ఆవిష్కరించే తలైకీళ్
ఉన్నత విద్యనభ్యసించి కుటుంబానికి, దేశానికి బాధ్యత గల పౌరులుగా సేవలందించాలని ఆశిస్తూ గ్రామాల నుంచి విద్యార్థులు నగరానికి వస్తుంటారు. తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పిల్లలను చదివిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు దండు కోవడమే లక్ష్యంగా పనిచేసే కొన్ని కళాశాలలు, సీనియర్ల పేరుతో విద్యార్థుల ర్యాగింగ్, అవమానాలు తదితరాలను మార్చాలని ప్రయత్నించే ఓ యువ విద్యార్థి కథే తలై కీళ్ చిత్రమని దర్శకుడు రెక్స్రాజ్ తెలిపారు. లండన్కు చెందిన ఈయన కథ, కథనం, మాటలు, పాటలు రాసి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాతా క్రియేషన్ పతాకంపై ధరణియన్ నిర్మిస్తున్నారు.నవ నటుడు రాకేష్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో తేజామై, నివేదా హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువతను దృష్టిలో పెట్టుకుని జనరంజకంగా తెరకెక్కించిన తలైకీళ్ చిత్రాన్ని లియో ఇంటర్నేషనల్ పతాకంపై జేవీ రుక్మాంగదన్ విడుదల చేయనున్నారని దర్శకుడు తెలిపారు.


