home services
-
ఒక్క మిస్డ్ కాల్ జీవితాన్ని మార్చేసింది!
సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం ‘జనరేటివ్ ఏఐ’ హవా నడుస్తోంది. అద్భుతమైన చాట్బాట్లు, ఆకట్టుకునే చిత్రాలను సృష్టించే ఏఐ టెక్నాలజీపై కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్నాయి. కానీ, ఈ హడావుడికి భిన్నంగా సాధారణ మిస్డ్ కాల్ సమస్యను పరిష్కరించడం ద్వారా ఒక భారతీయ సంతతి ఇంజినీర్ చరిత్ర సృష్టించారు. ఆయనే అపూర్వ శ్రీవాస్తవ. ఆయన టైసన్ చెన్తో కలిసి ప్రారంభించిన ‘అవోకా’ స్టార్టప్ ఇప్పుడు ఏకంగా 1 బిలియన్ డాలర్ల (యూనికార్న్-సుమారు రూ.9300 కోట్లు) విలువను చేరుకుని ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.అక్కడే మొదలైందిమిచిగాన్లో పెరిగిన అపూర్వ శ్రీవాస్తవకు చిన్నప్పటి నుంచే వ్యాపారాల్లోని కష్టనష్టాలపై అవగాహన ఉంది. మొదటి తరం భారతీయ-అమెరికన్గా తన కుటుంబం నడుపుతున్న చిన్న వ్యాపారం కోసం వచ్చే ఫోన్ కాల్స్ను ఆయన స్వయంగా నిర్వహించేవారు. ఆ సమయంలో ఆయన ఒక చేదు నిజాన్ని గ్రహించారు. సాధారణంగా మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వారు ఎత్తకపోతే ‘సరే, తర్వాత చేస్తాలే’ అనుకుంటాం. కానీ, ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ లాంటి వారి విషయంలో పరిస్థితి వేరు. ఏసీ ఆగిపోయినా లేదా ఇంట్లో పైపు లీకై నీళ్లు వస్తున్నా ఆ కస్టమర్కు అది అత్యవసర పరిస్థితి. ఆ సమయంలో ఫోన్ ఎత్తకపోతే కస్టమర్ వెంటనే వేరే వారికి ఫోన్ చేస్తారు. వ్యాపారస్థులకు ఒక్క ఫోన్ కాల్ మిస్ అవ్వడం అంటే ఒక కస్టమర్ చేజారడమే కాదు.. ఆ కస్టమర్ ద్వారా వచ్చే వేల రూపాయల పని (ఉదాహరణకు కొత్త ఏసీ ఇన్స్టాలేషన్ లేదా పెద్ద రిపేర్ వర్క్) మరొకరికి వెళ్లిపోయినట్లు లెక్క.ఐడియా పుట్టిందిక్కడే..మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పూర్వ విద్యార్థి అయిన శ్రీవాస్తవ మొదట రెస్టారెంట్ల కోసం ఏఐ ఆధారిత ఆన్సరింగ్ సేవలను రూపొందించడంపై ప్రయోగాలు చేశారు. అయితే, ఆ తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఒక రెస్టారెంట్లో ఫోన్ కాల్ మిస్ అయితే 40 డాలర్ల నష్టం జరగవచ్చు, కానీ ఒక హెచ్వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్) అత్యవసర పరిస్థితిలో కాల్ మిస్ అయితే అది 40 వేల డాలర్ల భారీ కాంట్రాక్టును పోగొట్టుకోవడంతో సమానం. ఈ కోణాన్ని గుర్తించిన శ్రీవాస్తవ టైసన్ చెన్తో కలిసి ‘అవోకా’కు శ్రీకారం చుట్టారు.అవోకా ప్రత్యేకత ఏమిటి?చాలా ఏఐ సంస్థలు డెస్క్ వర్క్ ఆటోమేషన్ మీద దృష్టి పెడితే అవోకా మాత్రం క్షేత్రస్థాయిలో పనిచేసే సాంకేతిక నిపుణుల కష్టాలను తీరుస్తోంది. అవోకాలోని ఏఐ ఏజెంట్లు మనుషుల లాగే స్పష్టంగా మాట్లాడగలవు. ఏ సమయంలో కాల్ వచ్చినా సెకన్ల వ్యవధిలో సమాధానం ఇస్తాయి. ఇవి కేవలం సందేశాలను తీసుకోవడమే కాకుండా కంపెనీ క్యాలెండర్లను తనిఖీ చేసి నేరుగా అపాయింట్మెంట్లను బుక్ చేస్తాయి. పాత ఆర్డర్లను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తాయి.అవోకా పనితీరు పట్ల మార్కెట్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే 800కు పైగా ప్రముఖ కంపెనీలు వీరి సేవలను వాడుకుంటున్నాయి. 2025లో ఈ సంస్థ వార్షిక ఆదాయం ఎనిమిది అంకెల స్థాయిని దాటేసింది. ఈ పురోగతికి గుర్తింపుగా మెరిటెక్ క్యాపిటల్, జనరల్ క్యాటలిస్ట్, క్లీనర్ పెర్కిన్స్ వంటి సంస్థల నేతృత్వంలో జరిగిన తాజా ఫండింగ్ రౌండ్లో కంపెనీ 125 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సేకరించింది. తద్వారా కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్ల(సుమారు రూ.9300 కోట్లు)కు చేరింది. జనరల్ పర్పస్ ఏఐ కోసం ప్రపంచం పోటీ పడుతుంటే శ్రీవాస్తవ, చెన్ మాత్రం హోం సర్వీసుల ఆర్థిక వ్యవస్థలోని ఫోన్ కాల్లను నమ్ముకుని యూనికార్న్ స్థాయికి చేరుకోవడం విశేషం.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
స్టార్ హెల్త్ నుంచి ‘హోమ్ హెల్త్కేర్’ సేవలు
చెన్నై: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించింది. ‘హోమ్ హెల్త్కేర్ సర్వీస్’ పేరుతో తీసుకొచి్చన ఈ సేవలను రానున్న రోజుల్లో మిగిలిన పట్టణాలకు సైతం విస్తరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కస్టమర్ల ఇంటివద్దే ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు వీలుగా కేర్24, పోరి్టయా, కాల్హెల్త్, అతుల్య హోమ్కేర్, అర్గాలాతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. కోయింబత్తూర్, పుణె, ఢిల్లీ, కోల్కతాలో ఈ సేవలను పరీక్షించి చూశామని, ఆ తర్వాతే ఇతర పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించినట్టు ఆనంద్రాయ్ వెల్లడించారు. జ్వరం, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు 044–69006900 నంబర్కు లేదా స్టార్ హెల్త్ మొబైల్ అప్లికేషన్ నుంచి అభ్యర్థన పంపి, ఇంటి వద్దే వైద్య సేవలను అందుకోవచ్చు. కస్టమర్ నుంచి అభ్యర్థన వచి్చన వెంటనే వైద్య బృందం స్టార్ హెల్త్ కస్టమర్ ఇంటికి చేరుకుని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు సూచిస్తారు. ఐదు రోజుల చికిత్సకు (వైద్యులు, నర్సుల ఫీజులు సహా) ఒక్క రోగి రూ.7,000–7,500 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్టార్ హెల్త్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిహర సూదన్ తెలిపారు. తదుపరి చికిత్స అవసరం పడితే సమీపంలోని హాస్పిటల్ను సూచిస్తామని చెప్పారు. -
ఇంటి వద్దకే ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు
ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే, చేతిలో ఇమిడిపోయే మొబైల్ హ్యాండ్హెల్డ్ పరికరాల ద్వారా కూడా సేవలు అందించే విధానాన్ని ఆవిష్కరించింది. నేరుగా ఖాతాదారుల ఇంటి ముంగిట్లోకే కియోస్క్ బ్యాంకింగ్ సరీ్వసులను తీసుకెళ్లేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులు మొదలైన వారికి ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సరీ్వసులు అందించడంలో కస్టమర్ సరీ్వస్ పాయింట్ ఏజెంట్లకు వీటితో వెసులుబాటు లభిస్తుందన్నారు. నగదు విత్డ్రాయల్, డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్ఫర్లు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్స్ వంటి అయిదు రకాల సర్వీసులు ఈ విధానంలో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అకౌంటు తెరవడం వంటి ఇతర సేవలను కూడా చేర్చే యోచనలో ఎస్బీఐ ఉంది. -
దివ్యాంగులకు గుడ్న్యూస్.. మీ ఇంటికే వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే వ్యాక్సినే శరణ్యం కావడంతో మరింత మందికి టీకా డోసులు అందేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగులకు, ఇంటి నుంచి కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దకే వచ్చి టీకాలు ఇస్తామని నీతి అయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. ఇళ్ల వద్ద వ్యాక్సిన్ వేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఇంకా రెండో వేవ్ మధ్యలోనే ఉన్నామని∙ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కేరళ నుంచే అత్యధికంగా కేసులు వస్తున్నాయని గత వారం 62.73% కేసులు ఆ రాష్ట్రం నుంచే వచ్చాయని చెప్పారు. లక్షకు పైగా యాక్టివ్ కోవిడ్ కేసులున్న ఏకైక రాష్ట్రం కేరళయేనని వెల్లడించారు. చదవండి: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అర్హుల్లో 66 శాతం మందికి కరోనా టీకా దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 66 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ కనీసం ఒక్క డోసైనా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం చెప్పారు. 23 శాతం మందికి రెండు డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 63.7 శాతం డోసులను గ్రామీణ ప్రాంతాల్లో, 35.4 శాతం డోసులను పట్టణ ప్రాంతాల్లో ఇచ్చినట్లు తెలిపారు. 68.2 లక్షల డోసులను (దాదాపు 0.95 శాతం) కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఇచ్చామని, వీటిని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కేటగిరీలో కలుపలేమని వివరించారు. దేశంలో పండుగల సీజన్ మొదలయ్యిందని, కరోనా నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని రాజేశ్ భూషణ్ సూచించారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండి ఇలా..
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా పుణేకు చెందిన మైలాబ్ సంస్థ రూపొందించిన ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్కు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం ఆమోద ముద్ర వేసింది. రూ.250కి లభ్యమయ్యే ఈ కిట్ ద్వారా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్) వైద్య నిపుణుల సహాయం లేకుండానే సొంతంగా పరీక్షించుకోవచ్చు. సొంతంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు ఎలా చేసుకోవాలనే విషయంపై ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని వీడియో రూపంలో అందుబాటులోకి తెచి్చంది. ‘కోవి సెల్ఫ్’ టెస్ట్ కిట్ యూజర్ మ్యాన్యువల్లో కూడా కిట్ను ఎలా ఉపయోగించొచ్చనే సూచనలు ఉంటాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పాటు కోవిడ్ రోగులను కలిసిన వారు ఈ కిట్ను ఉపయోగించాలి. ముక్కులో నుంచి నమూనాలు తీసుకుని ఈ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పాజిటివ్గా తేలితే మళ్లీ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షలు ఇలా చేసుకోవాలి.. ఈ కిట్ను ఉపయోగించే వారు మొదట ‘కోవి సెల్ఫ్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష చేసుకోవడానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని తడిలేకుండా చూసుకోవాలి. కోవిసెల్ఫ్ కిట్లో 3 విడి భాగాలు ఉంటాయి. నాసల్ స్వాబ్ (ముక్కులో నుంచి శాంపిల్ తీసుకునేందుకు), శాంపిల్ తీసిన తర్వాత స్వాబ్ను పెట్టేందుకు ఉపయోగించే ఒక చిన్న ట్యూబ్, టెస్ట్ కార్డు (పరీక్ష ఫలితాన్ని తెలిపేది) ఉంటాయి. నాసల్ స్వాబ్ను ముక్కు రంధ్రాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల లోపల వరకు పెట్టుకుని కనీసం 5 సార్లు తిప్పాలి. ప్రత్యేక ద్రవంతో కూడిన ట్యూబ్ను తెరిచి ఈ స్వాబ్ తలభాగాన్ని అందులో మునిగేలా పెట్టి 10 సార్లు తిప్పాలి. స్వాబ్ను విరగ్గొట్టిన తర్వాత ట్యూబ్కు మూత పెట్టి, దాన్ని నెమ్మదిగా ఒత్తుతూ ట్యూబ్ మూతలోని రంధ్రం ద్వారా రెండు చుక్కలను టెస్ట్ కార్డు చివరలో ఉండే చిన్న గుంతలాంటి భాగంలో వేయాలి. కిట్ను ఉపయోగించేవారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టెస్ట్ కార్డు ఫోటో తీసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మొబైల్ యాప్లో ఫలితం కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత కనిపించే ఫలితాన్ని ఇన్వ్యాలిడ్గా భావించాలి. ఈ ఫలితాన్ని ఐసీఎంఆర్ కోవిడ్ టెస్టింగ్ పోర్టల్లో భద్రపరుస్తారు. పాజిటివ్గా తేలితే కోవిడ్ నిబంధనల మేరకు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్లో ఉండాలి. చదవండి: కరోనా.. తెల్లారితే కూతురు పెళ్లి.. అంతలోనే తండ్రి చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. -
గూగుల్ ఫుడ్ డెలివరీ యాప్.. ఆరియో
► హోమ్ సర్వీసులు కూడా ► ముందుగా ముంబై, బెంగళూరులో కార్యకలాపాలు బెంగళూరు: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్లో ఫుడ్ డెలివరీ, హోమ్ సర్వీసెస్కి సంబంధించి ఆరియో యాప్ను ప్రారంభించింది. ప్రస్తుతం ముంబై, బెంగళూరులో యాప్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఫుడ్ డెలివరీ సేవల కోసం బాక్స్8, ఫ్రెష్మెను, ఫాసూస్ వంటి సంస్థలతోను, గృహ సంబంధ సర్వీసుల కోసం అర్బన్క్లాప్, జింబర్ సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకుంది. దాదాపు 8–10 నెలలుగా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోవడంపై గూగుల్ దృష్టి పెట్టినట్లు సమాచారం. మూడు నెలల క్రితమే తమ ఉద్యోగుల కోసం పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్లో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో.. ఆరియోను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది. ఆరియో ద్వారా వినియోగదారులు, స్టార్టప్ సంస్థల మధ్య అనుసంధానకర్తగా గూగుల్ వ్యవహరిస్తుంది తప్ప ఈ సేవల కోసం ప్రత్యేకంగా తమ సిబ్బందిని వినియోగించదు. ఆయా స్టార్టప్ సంస్థలే సర్వీసులు అందించాల్సి ఉంటుంది. అయితే అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నందున గూగుల్ కొంత కమీషన్ తీసుకుంటుంది. ఇప్పటికిప్పుడు పెద్దగా పోటీదారు కానప్పటికీ.. రాబోయే రోజుల్లో కార్యకలాపాలు విస్తరించిన పక్షంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సేవల సంస్థలపై ఆరియో ప్రభావం పడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీ స్టార్టప్ సంస్థల్లోకి నిధుల ప్రవాహం తగ్గిపోయిన తరుణంలో గూగుల్ ప్రవేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
గూగుల్ మరో ఇంట్రెస్టింగ్ యాప్
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరో సరికొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా యాప్ తో ఫూడ్ అండ్ బుక్ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ టెక్ దిగ్గజం. ‘ఏరియో’ పేరుతో విడుదల చేసిన ఈ యాప్ ద్వారా అదిరిపోయే ఎన్నో సదుపాయాలు యూజర్లకు అందిస్తోంది. గూగుల్ ప్లే నుంచి ఈ యాప్ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే హోం సర్వీసులకోసం అర్బన్ క్లాప్ , జింబర్ తో నూ, ఆహార సేవలకోసం ఫ్రెష్ మెనూ, బాక్స్ 8 లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే చెల్లింపులకోసం ఆన్లైన్ పేమెంట్స్ కంపెనీ డైరెక్ పే తో ఒప్పందం కుదుర్చుకుంది. ముంబై, బెంగళూరులలో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా ఏరియో యాప్ ద్వారా హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు శాఖాహారం, మాంసాహార ఆహార ఎంపికలు కోసం ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంది. దీంతోపాటు బిల్లుల చెల్లింపులు, ప్లంబర్, బ్యుటీషియన్ వంటి సేవలను పొందవచ్చు. అన్ని సర్వీస్లు ఏరియా యాప్లో ఒకే చోట ఉండడంతో యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండనుందని భావిస్తున్నారు. యూజర్ల లోకేషన్ను ఆధారంగా ఆర్డరు చేసుకున్న వెంటనే వారు కోరుకున్న వస్తువులు, ఆహార పదార్థాల డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తుంది.


