breaking news
hero ramcharan
-
చరణ్ తో రొమాన్స్ చేయబోతున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్
-
భార్యతో కలిసి హీరో వర్కవుట్లు
సినిమా హీరోలంటే.. తమ ఫిట్నెస్ను, ఫిజిక్ను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వాళ్లు నిరంతరం వర్కవుట్లు చేస్తూనే ఉండాలి. చేతిలో సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ఇది మాత్రం తప్పదు. ఇక ఇప్పటికే చేతిలో సినిమాలు ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉంటారు. తమిళంలో సెన్సేషనల్ హిట్ అయిన తని ఒరువన్ రీమేక్ 'ధ్రువ' హీరోగా చేస్తున్న హీరో రాంచరణ్ కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అనే చెబుతుంటారు. దానికితోడు ఆయన భార్య ఉపాసన అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాపరెడ్డి మనవరాలు. దాంతో ఇద్దరూ కలిసి మరీ వర్కవుట్లు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాంచరణ్, ఉపాసన తలో ట్రెడ్ మిల్ మీద ఒక జిమ్లో పరుగులు తీస్తూ ఆ వీడియోలో కనిపించారు. ఏమాత్రం దృష్టి మరలకుండా తదేక దీక్షతో వ్యాయామాలు చేయడం ఈ వీడియోలో కనిపించింది. -
భార్యతో కలిసి హీరో వర్కవుట్లు
-
రేపటి నుంచి ట్రూజెట్ సేవలు
ఉదయం 8 గం.కి తిరుపతి నుంచి రాజమండ్రికి తొలి విమానం - హైదరాబాద్, చెన్నై నుంచి కూడా పుష్కరాలకు విమానాలు - 26 నుంచి పూర్తిస్థాయి సర్వీసులు; ఆరంభ ఆఫర్ ధర రూ.1,499 - ఈ ఏడాది చివరికి 5 విమానాలు; ఐదేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి - కంపెనీ డెరైక్టర్, హీరో రామ్చరణ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో విమానయాన సంస్థ ఆరంభమైంది. ‘ట్రూజెఃట్’ పేరిట ఆదివారం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు ‘టర్బో మేఘ ఎయిర్వేస్’ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పూర్తిస్థాయి సేవలు ప్రారంభించనున్న ఈ సంస్థ... గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నైల నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానాలు నడుపుతోంది. దీనికోసం హైదరాబాద్-రాజమండ్రి మధ్య రూ.1499 ధరను ప్రారంభ ఆఫర్గా ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు తొలి విమానం తిరుపతిలో బయలుదేరుతుందని శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో టర్బో మేఘ డెరైక్టరు, సినీ హీరో రామ్చరణ్ ప్రకటించారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-అహ్మదాబాద్, హైదరాబాద్-రాజమండ్రి మధ్య కూడా సర్వీసులుంటాయని ఆయన తెలిపారు. ఏడాదిన్నర నుంచి ప్రయత్నాలు చేస్తుండగా అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని, తాను బ్రాండ్ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నానని చెప్పారాయన. ‘‘విమాన ప్రయాణాల్లో కావాల్సినవి సౌకర్యం, సమయానికి చేరటం, సేవలు, ఆతిథ్యం, మంచి ఫుడ్. అవన్నీ మేం ఏ విమానయాన సంస్థకూ తక్కువ కాకుండా అందిస్తాం’’ అని ఆయన వివరించారు. వినూత్న సేవలు; డిస్కౌంట్లు ఈ రంగంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా వృద్ధులు, విద్యార్థులు, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందినవారు, జర్నలిస్టులకు టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు రామ్చరణ్ తెలియజేశారు. దీంతోపాటు సమీప ప్రాంతాల నుంచి ప్రయాణికుల్ని ఉచితంగా ఎయిర్పోర్టుకు చేర్చే బాధ్యతను కూడా తీసుకుంటున్నామంటూ... ఉదాహరణకు నెల్లూరు, చిత్తూరుల నుంచి తిరుపతి విమానాశ్రయానికి... షిర్డీ నుంచి ఔరంగాబాద్ విమానాశ్రయానికి తామే తీసుకెళతామని సంస్థ ఎండీ ఉమేష్ వంకాయలపాటి తెలియజేశారు. రెండు విమానాలతో మొదలు సంస్థ ప్రస్తుతం రెండు విమానాలను కొనుగోలు చేసింది. ఈ రెండూ 72 సీటర్ల ఏటీఆర్-500 విమానాలే. ఈ ఏడాది చివరికి వీటి సంఖ్య ఐదుకు చేరుస్తామని, దీనికోసం రూ.120-150 కోట్ల మధ్య పెట్టుబడి అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నామని ఉమేష్ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో దీనిపై రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేశారు. శంషాబాద్లోని జీఎంఆర్ ఏరో పార్క్లో... విమాన పరికరాల కోసం నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ యూనిట్ అన్ని అనుమతులూ వస్తే ఈ ఏడాది చివరికల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ట్రూజెట్ ద్వారా ఈ ఏడాది చివరినాటికి 70-80% లోడ్ ఫ్యాక్టర్ను సాధిస్తామనే విశ్వాసం కూడా ఆయన వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నాటికి మరో 7 ప్రాంతాలకు సేవలందిస్తామని, విశాఖ కూడా ఇందులో ఉండవచ్చని చెప్పారాయన. ప్రస్తుతం తమకు 200 మంది వరకూ సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. -
వేలానికి హీరో రామ్చరణ్ బైకు!
హీరో రామ్చరణ్ బైకు అమ్మకానికి పెట్టనున్నారు. ఇంతకుముందు బాలకృష్ణ 'లెజెండ్' బైకును అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు అదే తరహాలో చరణ్ బైకును వేలం వేయనున్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో రూ. 30 లక్షల విలువ చేసే హర్లీ డేవిడ్సన్ బైకు వాడాడు. ఈ సినిమా కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. సినిమా విడుదలైన తర్వాత ఈ బైకును వేలం వేయాలని నిర్మాత బండ్ల గణేష్ భావిస్తున్నారట. వేలం ద్వారా వచ్చే డబ్బును దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలను కుంటున్నారదన్నది చిత్రసీమ సమాచారం. 'లెజెండ్' సినిమాలో తాను వాడిన బైకును వేలం వేయడం ద్వారా సొమ్మును బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రికి అందజేశారు బాలకృష్ణ. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది.