హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా బాబా రాందేవ్
హరిద్వార్ : హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నియమించింది. గురువారం హరిద్వార్లోని దివ్య యోగా మందిర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ రాష్ట్ర క్రీడలు మరియు ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమి ఖాళీగా ఉందిని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బాబా రాందేవ్ ఆధ్వరంలో ఆ భూమిలో 25 వేల ఆయుర్వేద మొక్కలను నాటాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.