-
డేరా బాబాకు రహస్య పెరోల్
చండిఘర్ : మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాసౌదా అధినేత గుర్మీత్ రామ్రహీమ్సింగ్ (డేరా బాబా)బాబాకు రహస్యంగా పెరోల్ మంజూరైంది. ఒకరోజు పెరోల్పై డేరా బాబా బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడటానికి డేరా బాబాకు హరియాణా ప్రభుత్వం అక్టోబర్ 24 న పెరోల్ మంజూరు చేసింది. అయితే పెరోల్ లభించిన విషయం మీడియాకు కూడా తెలియకుండా హరియాణా ప్రభుత్వం జాగ్రత్తపడింది. భారీ బందోబస్తు మధ్య గత నెల 24న గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూడడానికి డేరా బాబాను తీసుకొచ్చారు. ఆ రోజు సాయంత్రం వరకూ డేరా బాబా ఆసుపత్రిలో తన తల్లి దగ్గరే ఉన్నారు. డేరా బాబాకు పెరోల్ వచ్చిన విషయాన్ని రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ ధ్రువీకరించారు. రామ్ రహీమ్ గుర్గావ్ పర్యటనకు భద్రతా ఏర్పాట్ల కోసం జైలు సూపరింటెండెంట్ నుంచి తనకు వినతి వచ్చిందని ఆయన చెప్పారు. మరోవైపు, శనివారం మధ్యాహ్నం రాష్ట్ర జైలు మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా కూడా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. అన్ని నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని రామ్ రహీమ్కు పెరోల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డేరాబాబా ఆశ్రమంలో అనేక అక్రమాలతో పాటు మహిళలపై అత్యాచారాలను రామ్చందర్ ఛత్రపతి అనే జర్నలిస్టు తన కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆయనను డేరాబాబా 2002లో తన రివాల్వర్తో కాల్చి చంపారు. మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్య కేసులో డేరాబాబా దోషిగా తేలడంతో హర్యానాలోని పంచకుల సెషన్స్ కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్షను 2017లో విధించింది. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 32 మంది మరణించిన విషయం తెలిసిందే. -
డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
-
డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో డేరా మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను కోర్టు దోషిగా తేల్చిన తరువాత.. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అల్లర్లు చేలరేగాయి. ఈ అల్లర్లలో ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్తులు భారీగా నాశనమయ్యాయి. ఈ నష్టాన్ని గుర్మీత్ ఆస్తులతో భర్తీ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆయా ప్రభుత్వాలు ఆ పనిలోకి దిగాయి. డేరా ఆస్తులను పరిశీలించే క్రమంలో ప్రభుత్వాధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. డేరాబాబా స్థిరచరాస్తుల విలువ వందల వేల కోట్లలోనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క డేరాబాబా, ఆయన దత్తపుత్రిక హనిప్రీత్కు చెందిన బ్యాంక్ అకౌంట్లలో రూ. 75 కోట్లు బయటపడ్డాయి. వివిధ బ్యాంకుల్లో కోట్ల రూపాయల నగదు అకౌంట్లలో ఉన్నట్లు తేలింది. ఆస్తుల వివరాలు.. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు.. రూ. 74.96 కోట్లు గుర్మీత్కు చెందిన 12 అకౌంట్లలో ...రూ. 7.72 కోట్లు హనిప్రీత్ అకౌంట్లో.. రూ. కోటి హర్కీత్ ఎంటర్టైన్మెంట్స్.. రూ. 50 లక్షలు వివిధ బ్యాంకుల్లో మొత్తం అకౌంట్లు.. 504 (అందులో 473 సేవింగ్స్ ఖాతాలు, మిగిలినవి లోన్ ఖాతాలు) గుర్మీత్ పేరున ఉన్న స్థిరాస్తఉలు.. 25 హర్యానా, పంజాబ్లో ఉన్న స్థిరాస్తుల విలువ... రూ. 1,435 కోట్లు పలు బ్యాంకుల్లో కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. -
డేరాబాబాకు పారిపోయే ప్లాన్
సాక్షి, చండీగఢ్ : హర్యానా పోలీసులు తాజాగా మరో అరెస్టులు చేశారు. అయితే, వారు అరెస్టు చేసింది మాత్రం పోలీసులనే. డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను కోర్టు దోషి అని తేల్చిన తర్వాత కూడా అతడిని పారిపోయేందుకు సహాయం చేసిన ముగ్గురు పోలీసులను ద్రోహంవంటి ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. వారిలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉండగా మరొకరు కానిస్టేబుల్. ప్రస్తుతం వారిని విచారణలో భాగం చేసినట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 25న పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గుర్మీత్ను దోషిగా తేల్చింది. ఆ సమయంలో వారు గుర్మీత్కు ఆయన భద్రతకు సంబంధించిన వివరాలు తెలియజేసి ఆయన పారిపోయేందుకు కుట్రలు చేశారు. ప్రస్తుతం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టిన వారిని మూడు రోజులపాటు విచారించనున్నారు. -
గుర్మీత్ అకౌంట్ క్లోజ్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార కేసులో జైలు పాలైన డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు షాక్ మీద షాక్ తగులుతోంది. ఓ వైపు గుర్మీత్ సినిమా లైసెన్స్ రద్దు కాగ, మరోవైపు గుర్మీత్ మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ అకౌంట్ను కూడా భారత్లో నిలిపివేశారు. ఈ నిలుపుదలతో భారత్లో ఆయన ఫాలోవర్స్ ఎవరూ గుర్మీత్ అకౌంట్ను యాక్సస్ చేయడం కానీ, ట్వీట్లు చూడటం కానీ వీలుపడదు. అయితే భారత్లో మాత్రమే ఆయన అకౌంట్ను బ్లాక్ చేశారు. విదేశీయులు మాత్రం డేరా సచ్చా సౌదా పోస్టులను చూడవచ్చు. ఇప్పటివరకు గుర్మీత్కు 3.6 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. ఫాలోవర్స్ అభ్యర్థన మేరకు ఆయన అకౌంట్ను బ్లాక్చేశామని హర్యానాకు చెందిన సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. డేరాతో సంబంధమున్న ఇతర సోషల్ మీడియా అకౌంట్లను వారు చూడటానికి ఇష్టపడుట లేదని పేర్కొన్నారు. @గుర్మీత్రామ్రహీమ్ ఖాతా నిలిపివేయబడింది అనే మెసేజ్ మాత్రమే ఆయన అకౌంట్ పేజీలో ప్రస్తుతం దర్శనమిస్తోంది. ఆయన ట్వీట్లు ఏమీ కనిపించడం లేదు. ఇద్దరు మహిళలపై అత్యాచార కేసులో దోషిగా తేలిన వివాదస్పద డేరా చీఫ్ గుర్మీత్కు సీబీఐ ప్రత్యేక కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. గుర్మీత్ తీర్పు నేపథ్యంలో ఉత్తర భారతం ఉడికిపోయింది. పంజాబ్, హర్యానాలో గుర్మీత్ మద్దతుదారులు ఆందోళనలు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement