-
గుట్టల్లో యువతి శవం లభ్యం
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గుబ్బడి గ్రామపంచాయితీ పరిధిలోని కవాడి గుట్టల్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన కలకలం రేపింది. కేశనాయక్తండా గ్రామపంచాయతీ పరిధిలోని చౌడుతండాకు చెందిన లావుడ్య కల్పన(21)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లావుడ్య ముత్యాలు–గంగు దంపతుల పెద్ద అమ్మాయి కల్పన. వారికి నలుగురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుర్లకు వివాహం చేశాడు. ఉద్యోగం వచ్చిన తర్వాతే వివాహం చేసుకుంటా అని కల్పన జీఎన్ఎం చేసుకుంటూ వరంగల్ అర్బన్ జిల్లాలోనే హన్మకొండలో నర్సుగా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గత నెల 30న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంనేందుకు స్వగామానికి వచ్చిందని మరుసటి రోజున తిరిగి హన్మకొండకు వెళ్తున్న చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కల్పన అనుమానాస్పందగా మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం హాస్టల్ నుంచి కల్పన రాలేదని సమాచారం రావడంతో తల్లిదండ్రులు కల్పన ఆచూకి కోసం గాలిపు చర్యలు మొదలు పెట్టిన్నట్లు గిరిజనులు చెబుతున్నారు. కాగా కవాడి గుట్టల్లో గొర్రెల కాపరి యువతి శవాన్ని గుర్తించినట్లు తెలపడంతో తండావాసులు అక్కడి చేరుకొని మృతదేహం కల్పనగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ సందేపోగుల మహేందర్, సీఐ శ్రీనివాస్లు పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసినట్లు ఎస్సై పాపయ్యనాయక్ తెలిపారు. -
మా పరీక్షలు.. మా ఇష్టం!
అనంతపురం మెడికల్: కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థులను ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల యజమానులు పక్కదారి పట్టిస్తున్నారు. సులువుగా పరీక్షలు పాస్ చేరుుస్తామని చెప్పి విద్యార్థుల నుంచి డబ్బులు గుంజి యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్పత్రిలో చూచి రాతలకు తెరలేపారు. నగర నడిబొడ్డున పేరు గొప్ప ఆస్పత్రిలో ఇంతగా మాస్ కాపీరుుంగ్ జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో బుధవారం జరిగిన జీఎన్ఎం నర్సింగ్ మూడవ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీరుుంగ్ జరుగుతోందని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంపై కొందరు ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల నిర్వాహకులు చిందులు తొక్కారు. తమను అడ్డుకునే వారే లేరంటూ గురువారం సైతం ఆస్పత్రి యాజమాన్యం, ఇన్విజిలేటర్ల ఆశీర్వాదంతో చూచి రాతలకు తెగబడ్డారు. గురువారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పరీక్షలకు హాజరయ్యారు. లేబర్ వార్డులో ఇన్విజిలేటర్లు వైవాకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. వైవా ఒక్కొక్క విద్యార్థిని విడిగా అడగాలి. అలాంటిది గుంపుగా అందరినీ నిల్చోబెట్టి తూతూ మంత్రంగా కానిచ్చేశారు. రికార్డులను జావాబు పత్రం కింద పెట్టుకుని పరీక్ష హాలులోకి వెళ్లారు. చివరి సంవత్సరం ఎంతో పకడ్బందీగా జరపాల్సిన పరీక్షలను ఇలా నిర్వహించడాన్ని చూసి వైద్య విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాగైతే నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్విజిలేటర్ల వద్దే ప్రైవేట్ అధ్యాపకులు ఎక్కడైనా పరీక్షలు జరిగితే ఆ దరిదాపుల్లో ఇతర కళాశాలల అధ్యాపక బృందం ఉండకూడదు. అటువంటిది పలు నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు వారి విద్యార్థులకు సూచనలు, సలహాలిస్తూ అక్కడే తిష్ట వేశారుు. ఇన్విజిలేటర్లతో లోపారుు కారి ఒప్పందం వల్లే ఇలా జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తారుు. ఈ నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్లిన ‘సాక్షి’ని ప్రైవేట్ నర్సింగ్ కళాశాల ప్రతినిధులు అడ్డుకున్నారు. ‘పిల్లలు ఏదో రాసుకుంటున్నారు రాసుకోనివ్వండి.. అవినీతి చాలా చోట్ల జరుగుతోంది.. ఈ పరీక్షలకు ఎందుకు అడ్డువస్తున్నార’ంటూ వాగ్వాదానికి దిగారు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరైన వారిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నగరాల్లో అనేక కళాశాలలున్నా, ‘అనంత’లో సులువుగా సర్టిఫికెట్ పొందేందుకు వీలుగా ఉంటుందని అర్థమవుతోంది. ఆర్ఎంఓకు తెలుసు ఆర్ఎంఓ డాక్టర్ పద్మావతికి పరీక్షల గురించి తెలుసు. ఇది వరకే నర్సింగ్ పరీక్షల బోర్డు నుంచి లేఖ వచ్చింది. ఉదయం పరీక్షల విధానాన్ని పరిశీలించాం. నిబంధనలు పాటించమని చెప్పాం. - రాజేశ్వరి, నర్సింగ్ సూపరింటెండెంట్ నాకు సంబంధం లేదు ఆస్పత్రిలో పరీక్షలు జరుగుతున్న విషయం నాకు తెలియదు. అడ్మినిస్ట్రేషన్ విభాగంతో సంబంధం లేదు. అకడమిక్ వైపు వారు చూసుకుంటారు. కొంత మంది నా పేరును వాడుకుంటున్నారు. - డాక్టర్ వైవీ రావు. ఇన్చార్జ్ ఆర్ఎంఓ థియరీ మాత్రమే మా పరిధిలోకి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ థియరీ పరీక్షలు మాత్రమే మా పరిధిలోకి వస్తాయి. డీఎంఈ నిబంధనలు ఇవే. ప్రాక్టికల్స్ విషయం మాత్రం మా పరిధిలోకి రాదు. ఆ బాధ్యత సూపరింటెండెంట్దే. - డాక్టర్ నీరజ, ప్రిన్సిపాల్, వైద్య కళాశాల, అనంతపురం అకడమిక్ వారికే సంబంధం జీఎన్ఎం పరీక్షలు అకడమిక్ వారికే సంబంధం. మాకు ఎటువంటి సంబంధం లేదు. స్థలం మాత్రం మేం ఏర్పాటు చేస్తాం. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించే బాధ్యత వైద్య కళాశాల ప్రిన్సిపల్దే. - డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement