breaking news
gnana desikan
-
జ్ఞానదేశికన్కు పదవీ గండం
టీఎన్సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ పదవి ఊడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను తొలగించాలని ఫిర్యాదులు ఏఐసీసీకి వెల్లువెత్తారుు. కొత్త అధ్యక్షుడిగా తిరునావుక్కరసును నియమించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్లో ప్రధాన గ్రూపు నేతగా ఉన్న కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ మద్దతుదారుడు జ్ఞాన దేశికన్ టీఎన్సీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన్ను ఆ పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా ప్రత్యర్థి గ్రూపులు తీవ్రంగానే గతంలో ప్రయత్నాలు చేశాయి. అయితే, వాసన్ పలుకుబడి ముందు ఆ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. అయితే, తాజాగా ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న నినాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కష్టాల మడుగులో మునగడం వెనుక జ్ఞానదేశికన్ పనితీరు కారణం అంటూ ఫిర్యాదులు ఏఐసీసీకి వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే మీద ఇది వరకు పదే పదే జ్ఞాన దేశికన్ విమర్శలు గుప్పించడంతోనే ఆ పార్టీ ఎన్నికల వేళ ఛీదరించుకున్నదంటూ మరి కొందరు కాంగ్రెస్వాదులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒంటరి కష్టం: రాష్ర్టంలో ఒంటరిగా కాంగ్రెస్ మనుగడ సాధించడం కష్టతరం అంటూ పలువురు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో సీనియర్లు పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనలేకే వారు దూరంగా ఉండాల్సిన పరిస్థితిని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పతనం తప్పదని, మళ్లీ పుంజుకోవాలంటూ సరికొత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించి ఉన్నారు. ప్రధానంగా అధ్యక్షుడిని మార్చాల్సిందేనని, అప్పుడే రాష్ట్రంలో డీఎంకేకు దగ్గర కావచ్చని మరి కొందరు పేర్కొన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకే అత్యధిక సీట్లు సాధించిన పక్షంలో, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు దొరికిన పక్షంలో, వారి మద్దతు కూడగట్టుకోవాలంటే, అందుకు తగ్గ చర్చలకు సమర్థులు అవసరం అని సూచించారు. ఇక్కడ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడిలో ఉత్సాహం, చురుకుదనం లేదని, ఆయన్ను తొలగిస్తేనే రాష్ట్రంలో పార్టీ బాగుపడుతుందని సూచించినట్టు, ఈ ఫిర్యాదులను సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ పరిశీలించినట్టు సమాచారం. అధ్యక్షుడిని మార్చాలంటూ రాహుల్ సైతం ఇది వరకు సంకేతం ఇచ్చి ఉండడంతో ఆ పదవిని చేజిక్కించుకునేందుకు ముగ్గురి మధ్య పోటీ నెలకంది. గతంలో కష్ట కాలంలో ఉన్న పార్టీని సమర్థవంతంగా నడిపించి గాడిలో పెట్టిన మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం రేసులో ఉన్నట్టు తెలిసింది. గత అనుభవాలతో మళ్లీ పార్టీని గాడిలో ఆయన పెట్టగలరన్న నమ్మకం ఉన్నా, కొత్త వాళ్లకు చోటు ఇచ్చేందుకు రాహుల్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ దృష్ట్యా, కేంద్ర సహాయ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ లేదా, జాతీయ కార్యదర్శి తిరునావుక్కరసుకు పదవి దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే, రాహుల్తో తిరునావుక్కరసుకు వ్యక్తిగతంగా పరిచయం ఉండటం, ఆయన పోటీ చేసిన రామనాధపురానికి స్వయంగా రాహుల్ వచ్చి ప్రచారం నిర్వహించడం తెలిసిందే. ఈ దృష్ట్యా, టీఎన్సీసీ పదవిని తిరునావుక్కరసు తన్నుకెళ్లొచ్చంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
ఒంటరి పోరు
చెన్నై, సాక్షి ప్రతినిధి: తొమ్మిదేళ్లు తమతో స్నేహం చేసిన డీఎంకేకు అకస్మాత్తుగా తమపై ఎందుకంత కోపమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ వ్యాఖ్యానించగా, బీజేపీతో చెలిమి చేయదలుచుకుంటే తాము పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలాసీతారామన్ ఇప్పటికే ప్రకటించారు. రెండు జాతీయ పార్టీలు తమతో దోస్తీకి పాకులాడుతున్నాయని కరుణ భావిస్తున్నారు. అయితే పైకి కాంగ్రెస్తో పొత్తు లేదని స్పష్టంగా చెప్పిన కరుణ, బీజేపీతో మాత్రం పొత్తు లేదని నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు. ఈలం తమిళుల సమస్యలో తనకుతానుగా అప్రతిష్టపాలైనా, 2 జీ స్పెక్ట్రం కేసులో తన గారాలపట్టి కనిమొళిని కటకటాలపాలు చేయడంలో కాంగ్రెస్ చూపిన ఉత్సాహాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదే అదనుగా కాంగ్రెస్ కూడా కరుణానిధిపై విమర్శలు చేస్తోంది. తమ పార్టీ అంటే అంతగా పడనప్పుడు ఇటీవల జరి గిన ఎన్నికల్లో కనిమొళి గెలుపునకు కాంగ్రెస్ మద్దతు ఎందుకు కోరారని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం లేని అయిష్టత ఇపుడు ఎలా ముందుకొచ్చిందనే విమర్శకు కరుణ బదులివ్వలేక పోతున్నారు. కాంగ్రెస్తో కయ్యానికి సిద్ధమైన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం పెడుతున్న ముసాయిదా బిల్లును ఉభయసభల్లో బలపరుస్తారా అని కరుణానిధిని మీడియా ప్రశ్నిం చగా, ఈ వ్యవహారాలన్నీ డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు చూస్తున్నారని దాటవేశారు. కరుణ కాంగ్రెస్కు దూరమైన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీపై సంధించిన వ్యంగ్యాస్త్రాలపై కూడా ఆయన ధన్యవాదాలంటూ ప్రతిస్పందించారు. అన్నాడీఎంకే ఎలాగూ కలిసి వచ్చే అవకాశం లేనందున డీఎంకేతో పొత్తుపెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలు సైతం పరోక్షంగా చెబుతున్నారు. అయితే కరుణానిధి మాత్రం ఇప్పటికీ కొట్టి పారేస్తున్నారు. బీజేపీ మద్దతు పొందాలనే విషయంలో ఇంత వరకు తాము ఒక అభిప్రాయానికి రాలేదన్నారు. ఈ ఉద్దేశంతో ఆ పార్టీకి ఉత్తరం కూడా రాయలేదని వ్యాఖ్యానించారు. పొత్తు విషయమై జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరపలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్తో తె గదెంపులు చేసుకున్నట్లు వ్యవహరిస్తున్న కరుణ బీజేపీవైపు ఎంతో కొంత మొగ్గుచూపుతూనే, మేకపోతు గాంభీర్యంతో ఒంటరిపోరుకు సిద్ధమని ప్రకటించారు. కరుణతో ముస్లింలీగ్ ఇండియా యూనియన్ ముస్లింలీగ్ అధినేత ఖాదర్మొహిద్దీన్ మంగళవారం కరుణానిధిని కలిసి డీఎంకేతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. మొిహ ద్దీన్ మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేతో నిన్న ఉన్నాము, నేడు, రేపుకూడా ఉంటామని అన్నారు. ముఖ్యమంతులు తాము ప్రధాని అభ్యర్థులమని ప్రకటించుకుంటున్నారంటూ పరోక్షంగా అన్నాడీఎంకే అధినేత్రిని విమర్శించారు. ప్రధాని ఎవరనేది ప్రజలు నిర్ణయించాలని వ్యాఖ్యానించారు. డీఎంకేతో పెద్ద పార్టీలు కలిసినా కలవకున్నా తమవంటి చిన్నపార్టీల కలయితో మెజార్టీ స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు.