breaking news
gloria
-
పోర్చుగల్లో ఘోర విషాదం
లిస్బన్: పోర్చుగల్ రాజధాని లిస్బన్లోని ప్రముఖ పర్యాటక విశేషం ‘గ్లోరియా ఫునిక్యులర్’స్ట్రీట్ కార్ ఘోర ప్రమాదానికి గురైంది. ఒక బోగీ అదుపుతప్పి కిందు దూసుకొచ్చి పక్కనున్న భవనాన్ని ఢీకొనడంతో 16 మంది చనిపోయారు. 21 మంది గాయపడ్డారు. 140 ఏళ్లుగా నిర్వహించే ఈ స్ట్రీట్ కార్లోని రెండు బోగీలుంటాయి. విద్యుత్ మోటార్లతో బోగీలు కేబుల్తో అనుసంధానించి ఉంటాయి. ఇందులో ఒకటి పైకి వెళ్తుంటే, మరోటి కింది వస్తుంటుంది. ప్రయాణ సమయం మూడే మూడు నిమిషాలు. ప్రయాణ దూరం 265 మీటర్లు. పర్వత శిఖరం పైనుంచి కిందకు మెలికలు తిరుగుతూ వెళ్లివచ్చే కేబుల్ కారులో ప్రయాణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు. ఒక్కో బోగీలో 41 మందే ప్రయాణించే వీలుంటుంది. బుధవారం కిందికి వచ్చే బోగీ అదుపు తప్పి పక్కనుండే భవనాన్ని అతి వేగంగా ఢీకొట్టింది. ఆ తీవ్రతకు బోగీ మొత్తం నామరూపాల్లేకుండా నుజ్జయింది. దీంతో, అందులోని 16 మంది చనిపోయారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విష మంగా ఉందని చెబుతున్నారు. బ్రేక్ పనిచేయకపోవడం లేదా కేబుల్ తెగిపోవడం వల్ల ప్రమాదం ఘటన జరిగి ఉండొచ్చన్న వార్తలపై అధికారులు స్పందించలేదు. మృతుల్లో పోర్చుగల్ వారితోపాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్, కెనడా, మొరాకో, దక్షిణ కొరియా, కేప్వెర్డె తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. స్థానికంగా ‘ఎల్వడోర్ డా గ్లోరియా’ అని పిలుచుకునే ఈ స్ట్రీట్ కారుకు విదేశాల్లో ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ఇలా పలు దేశాల నుంచి పర్యాటకులు ఏటా వస్తుంటారు. ఘటన నేపథ్యంలో పోర్చుగల్ ప్రభుత్వం గురువారం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. -
స్పెయిన్లో గ్లోరియా బీభత్సం
-
‘జయ’ నర్సు ఆత్మహత్యాయత్నం
చెన్నై: అపోలో ఆసుపత్రిలో జయలలితకు చికిత్స అందించిన నర్సు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. ఆమె ఇంటిలో వందకు పైగా నిద్రమాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇద్దరు కుమారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జయలలిత మృతి మిస్టరీగా మారిన నేపథ్యంలో కొడనాడు ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు కారు డ్రైవర్తో సహా వరుసగా మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జయకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి నర్సు గ్లోరియా (33) చెన్నై ఐనావరం నాగేశ్వర గురుస్వామి వీధిలో నివసిస్తోంది. భర్త విజయకుమార్ (35), అదే ప్రాంతంలో స్టేషనరీ దుకాణం నడుపుతున్నాడు. కుమారులు ప్రవీణ్కుమార్ (07), సుజిత (06) ఉన్నారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమెకు చికిత్స అందించిన నర్సులలో గ్లోరియా ఒకరు. ఇదిలా ఉండగా గత గ్లోరియా భర్త విజయకుమార్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. గుండెనొప్పితో అతడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో భర్త మృతిపై గ్లోరియా మనోవేదనతో కనిపించేది. గత ఆదివారం గ్లోరియా తన ఇద్దరు కుమారులకు నిద్రమాత్రలు మింగించి తాను మింగింది. వీరిద్దరూ ట్యూషన్లో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే వారిని చెన్నై అన్నానగర్లో గల సుందరం ఆసుపత్రిలో చేర్పించి అనంతరం అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అదే సమయం గ్లోరియాను చెన్నై రాజీవ్గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె స్థితి కొంచెం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. భర్త మృతి చెందడం వలన గ్లోరియా ఆత్మహత్యకు యత్నించిందా? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.